Police Case: కేంద్ర మంత్రి కుమారుడితోపాటు ముగ్గురిపై కేసు నమోదు..
- ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో మోసం
- అకౌంట్లలో అవకతవకలు
- కేంద్ర మంత్రి వీ సోమన్న కుమారుడు అరుణ్ బీఎస్ సహా ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు
- జంటను బెదిరించిన ఆరోపణలపై కేసు నమోదు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో మోసం, అకౌంట్లలో అవకతవకలు అలాగే సంస్థతో సంబంధం ఉన్న జంటను బెదిరించిన ఆరోపణలపై కేంద్ర మంత్రి వీ సోమన్న కుమారుడు అరుణ్ బీఎస్ సహా ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. అక్కడి 37వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు వారు తెలిపారు. ఎఫ్ఐఆర్ ప్రకారం., తృప్తి, తన భర్త మధ్వరాజ్తో కలిసి గత 23 సంవత్సరాలుగా ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీని నడుపుతున్నట్లు ఆరోపించింది.ఇక 2013 లో, ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పుడు, వారు కేంద్ర జల శాఖ సహాయ మంత్రి కుమారుడు అరుణ్ను కలిశారు.
Causes Of Paralysis: ఈ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారా.. పక్షవాతం రావచ్చు జాగ్రత్త సుమీ..
Also Read
- Ketan Murder Case: "ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం".. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
- రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
- Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ "పెసర గారెలు" చేసేయండి ఇలా.!
2017లో తమ సంస్థ అరుణ్ కూతురికి బర్త్ డే పార్టీని కూడా ఏర్పాటు చేసింది. చివరికి, అరుణ్ తన స్నేహితులు అలాగే ఇతర కుటుంబ సభ్యుల కోసం ఈవెంట్ లను ప్లాన్ చేసే పనిని ఫిర్యాదుదారు కంపెనీకి అప్పగించాడు. ఆ తదుపరి 2019లో.. అరుణ్, మధ్వరాజ్ భాగస్వామ్య ఒప్పందం కింద ఒక కంపెనీని ప్రారంభించారు. వ్యాపారంలో నష్టాలు వచ్చినప్పుడు, అరుణ్ మధ్వరాజ్కు సమాచారం ఇవ్వలేదని.. దీనిపై విచారించినప్పుడు అతను కంపెనీకి రాజీనామా చేయవలసి వచ్చింది. ఆ తరువాత అరుణ్ కంపెనీలో కొత్త భాగస్వాములను కూడా చేర్చుకున్నాడు.
Causes Of Paralysis: ఈ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారా.. పక్షవాతం రావచ్చు జాగ్రత్త సుమీ..
ఇకపోతే తనకు, తన భర్తకు కూడా ప్రాణహాని ఉందని తృప్తి ఆరోపించింది. కంపెనీలో మధ్వరాజ్ డివిడెండ్ కూడా 30 శాతం నుంచి 10 శాతానికి తగ్గింది. నకిలీ పత్రాలను ఉపయోగించి కంపెనీ కార్యాలయ స్థలం మరియు రిజిస్ట్రేషన్తో సహా అనేక అక్రమాలకు పాల్పడ్డారని జూన్ 12 న దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ పేర్కొంది. తన కుటుంబాన్ని గూండాలు వేటాడారని, తన భర్తను చీకటి గదిలో బంధించి చిత్రహింసలకు గురిచేశారని ఫిర్యాదుదారు ఆరోపించారని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. సంజయ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అనేక సంబంధిత సెక్షన్ల కింద కేసును నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
-
NRI: అంతిమ శ్వాస భారత్లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!