Police Case: కేంద్ర మంత్రి కుమారుడితోపాటు ముగ్గురిపై కేసు నమోదు..
- ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో మోసం
- అకౌంట్లలో అవకతవకలు
- కేంద్ర మంత్రి వీ సోమన్న కుమారుడు అరుణ్ బీఎస్ సహా ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు
- జంటను బెదిరించిన ఆరోపణలపై కేసు నమోదు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో మోసం, అకౌంట్లలో అవకతవకలు అలాగే సంస్థతో సంబంధం ఉన్న జంటను బెదిరించిన ఆరోపణలపై కేంద్ర మంత్రి వీ సోమన్న కుమారుడు అరుణ్ బీఎస్ సహా ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. అక్కడి 37వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు వారు తెలిపారు. ఎఫ్ఐఆర్ ప్రకారం., తృప్తి, తన భర్త మధ్వరాజ్తో కలిసి గత 23 సంవత్సరాలుగా ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీని నడుపుతున్నట్లు ఆరోపించింది.ఇక 2013 లో, ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పుడు, వారు కేంద్ర జల శాఖ సహాయ మంత్రి కుమారుడు అరుణ్ను కలిశారు.
Causes Of Paralysis: ఈ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారా.. పక్షవాతం రావచ్చు జాగ్రత్త సుమీ..
Also Read
- WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
- Indian Rupee: రూపాయికి 'చీకటి' రోజు.. జీవితకాల కనిష్టానికి పడిపోయిన భారత కరెన్సీ..
- 8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
- Sambhaji Maharaj Jayanti: ఛత్రపతి శివాజీ వారసుడు.. మొఘలుల సింహస్వప్నం! ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరగాథ ఇదే..
2017లో తమ సంస్థ అరుణ్ కూతురికి బర్త్ డే పార్టీని కూడా ఏర్పాటు చేసింది. చివరికి, అరుణ్ తన స్నేహితులు అలాగే ఇతర కుటుంబ సభ్యుల కోసం ఈవెంట్ లను ప్లాన్ చేసే పనిని ఫిర్యాదుదారు కంపెనీకి అప్పగించాడు. ఆ తదుపరి 2019లో.. అరుణ్, మధ్వరాజ్ భాగస్వామ్య ఒప్పందం కింద ఒక కంపెనీని ప్రారంభించారు. వ్యాపారంలో నష్టాలు వచ్చినప్పుడు, అరుణ్ మధ్వరాజ్కు సమాచారం ఇవ్వలేదని.. దీనిపై విచారించినప్పుడు అతను కంపెనీకి రాజీనామా చేయవలసి వచ్చింది. ఆ తరువాత అరుణ్ కంపెనీలో కొత్త భాగస్వాములను కూడా చేర్చుకున్నాడు.
Causes Of Paralysis: ఈ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారా.. పక్షవాతం రావచ్చు జాగ్రత్త సుమీ..
ఇకపోతే తనకు, తన భర్తకు కూడా ప్రాణహాని ఉందని తృప్తి ఆరోపించింది. కంపెనీలో మధ్వరాజ్ డివిడెండ్ కూడా 30 శాతం నుంచి 10 శాతానికి తగ్గింది. నకిలీ పత్రాలను ఉపయోగించి కంపెనీ కార్యాలయ స్థలం మరియు రిజిస్ట్రేషన్తో సహా అనేక అక్రమాలకు పాల్పడ్డారని జూన్ 12 న దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ పేర్కొంది. తన కుటుంబాన్ని గూండాలు వేటాడారని, తన భర్తను చీకటి గదిలో బంధించి చిత్రహింసలకు గురిచేశారని ఫిర్యాదుదారు ఆరోపించారని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. సంజయ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అనేక సంబంధిత సెక్షన్ల కింద కేసును నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
IPL 2026 Playoffs Chances: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు రసవత్తరం.. నాలుగో స్థానం కోసం అసలు పోటీ, ఆ లక్కీ టీమ్ ఏదో!
-
Vijay : జాసన్ విజయ్ కు CM విజయ్ సపోర్ట్ ఉంటుందా.. సందీప్ కిషన్ తో సినిమా ఏమైంది?
-
Coal Gasification Scheme: బొగ్గు నుంచి సింథటిక్ గ్యాస్.. రూ.37,500 కోట్లతో కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులు.. 50,000 జాబ్స్!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
Indian Rupee: రూపాయికి ‘చీకటి’ రోజు.. జీవితకాల కనిష్టానికి పడిపోయిన భారత కరెన్సీ..
ట్రెండింగ్
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!