Police Case: కేంద్ర మంత్రి కుమారుడితోపాటు ముగ్గురిపై కేసు నమోదు..
- ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో మోసం
- అకౌంట్లలో అవకతవకలు
- కేంద్ర మంత్రి వీ సోమన్న కుమారుడు అరుణ్ బీఎస్ సహా ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు
- జంటను బెదిరించిన ఆరోపణలపై కేసు నమోదు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో మోసం, అకౌంట్లలో అవకతవకలు అలాగే సంస్థతో సంబంధం ఉన్న జంటను బెదిరించిన ఆరోపణలపై కేంద్ర మంత్రి వీ సోమన్న కుమారుడు అరుణ్ బీఎస్ సహా ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. అక్కడి 37వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు వారు తెలిపారు. ఎఫ్ఐఆర్ ప్రకారం., తృప్తి, తన భర్త మధ్వరాజ్తో కలిసి గత 23 సంవత్సరాలుగా ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీని నడుపుతున్నట్లు ఆరోపించింది.ఇక 2013 లో, ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పుడు, వారు కేంద్ర జల శాఖ సహాయ మంత్రి కుమారుడు అరుణ్ను కలిశారు.
Causes Of Paralysis: ఈ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారా.. పక్షవాతం రావచ్చు జాగ్రత్త సుమీ..
Also Read
- Smart Phones: కేవలం రూ.17,999 లకే వాటర్ ప్రూఫ్ మొబైల్.. IP64, IP65 రేటింగ్.. 7000mAh బ్యాటరీ..
- IT Raids: హైదరాబాద్ టు హాంగ్కాంగ్.. ఐటీ దాడుల్లో రూ.1000 కోట్ల హవా లావాదేవీల గుట్టురట్టు..
- Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
- Uber Expands: ఇక బైక్ ఎక్కేయ్ బాస్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లోనూ ఉబర్ సేవలు..
2017లో తమ సంస్థ అరుణ్ కూతురికి బర్త్ డే పార్టీని కూడా ఏర్పాటు చేసింది. చివరికి, అరుణ్ తన స్నేహితులు అలాగే ఇతర కుటుంబ సభ్యుల కోసం ఈవెంట్ లను ప్లాన్ చేసే పనిని ఫిర్యాదుదారు కంపెనీకి అప్పగించాడు. ఆ తదుపరి 2019లో.. అరుణ్, మధ్వరాజ్ భాగస్వామ్య ఒప్పందం కింద ఒక కంపెనీని ప్రారంభించారు. వ్యాపారంలో నష్టాలు వచ్చినప్పుడు, అరుణ్ మధ్వరాజ్కు సమాచారం ఇవ్వలేదని.. దీనిపై విచారించినప్పుడు అతను కంపెనీకి రాజీనామా చేయవలసి వచ్చింది. ఆ తరువాత అరుణ్ కంపెనీలో కొత్త భాగస్వాములను కూడా చేర్చుకున్నాడు.
Causes Of Paralysis: ఈ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారా.. పక్షవాతం రావచ్చు జాగ్రత్త సుమీ..
ఇకపోతే తనకు, తన భర్తకు కూడా ప్రాణహాని ఉందని తృప్తి ఆరోపించింది. కంపెనీలో మధ్వరాజ్ డివిడెండ్ కూడా 30 శాతం నుంచి 10 శాతానికి తగ్గింది. నకిలీ పత్రాలను ఉపయోగించి కంపెనీ కార్యాలయ స్థలం మరియు రిజిస్ట్రేషన్తో సహా అనేక అక్రమాలకు పాల్పడ్డారని జూన్ 12 న దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ పేర్కొంది. తన కుటుంబాన్ని గూండాలు వేటాడారని, తన భర్తను చీకటి గదిలో బంధించి చిత్రహింసలకు గురిచేశారని ఫిర్యాదుదారు ఆరోపించారని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. సంజయ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అనేక సంబంధిత సెక్షన్ల కింద కేసును నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Varanasi Music Album: వారణాసి ఆల్బమ్ అదిరిపోద్ది.. మొత్తం ఎన్ని పాటలంటే?
-
Smart Phones: కేవలం రూ.17,999 లకే వాటర్ ప్రూఫ్ మొబైల్.. IP64, IP65 రేటింగ్.. 7000mAh బ్యాటరీ..
-
RC17లో రామ్ చరణ్కు జోడీగా ధురంధర్ బ్యూటీ.. లెక్కల మాస్టర్ స్కెచ్ ఇదేనా?
-
Spirit Release Date: ప్రభాస్ ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించే న్యూస్.. ‘స్పిరిట్’ రిలీజ్ డేట్లో నో ఛేంజ్!
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
ట్రెండింగ్
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!