వీసా క్లియరెన్స్ ఆలస్యం కావడంతో నేడు (సోమవారం) బీసీసీఐ ప్రెసిడెంట్, వైఎస్ ప్రెసిడెంట్ పాకిస్తాన్ కు చేరుకున్నారు. ఈ ఇద్దరూ వాగా బార్డర్ ద్వారా జెడ్ ప్లస్ సెక్యూరిటీతో పాక్ కు వెళ్లారు.
KL Rahul Fitness Test on September 4 at NCA: స్వదేశంలో జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో ఆడే భారత జట్టుకు టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఎంపిక అవుతాడా? లేదా? అన్న అనుమానాలకు దాదాపుగా తెరపడినట్లే కనబడుతోంది. ప్రపంచకప్ జట్టులో రాహుల్కు చోటు ఖాయం అని తెలుస్తోంది. ఫిట్నెస్ విషయంలో జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) పచ్చ జెండా ఊపడమే ఇందుకు కారణం. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మంగళవారం…
టీమిండియా ప్లేయర్స్ ఆటను చూస్తే కనీసం నాకౌట్ వరకైనా వెళ్తారా అనే అనుమానం కలుగుతుందని హఫీజ్ అన్నాడు. వరల్డ్ కప్ టైటిల్ గెలవాలంటే మాత్రం మ్యాచ్ విన్నర్లు కావాలి.. ద్వైపాక్షిక సిరీసుల్లో వాళ్లు బాగా ఆడుతున్నారు.
భారత క్రికెట్ నియంత్రణ మండలి మీడియా హక్కులను వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీకి చెందిన వయాకామ్18 కంపెనీ దక్కించుకుంది. ఈ సంస్థ టీమిండియా స్వదేశంలో ఆడే మ్యాచ్ల టీవీ ప్రసార హక్కులతో పాటు డిజిటల్ హక్కులను కూడా సొంతం చేసుకుంది.
Fans Trolls BCCI Over World Cup 2023 IND vs PAK Tickets: భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ 2023 అక్టోబర్ 5 నుంచి ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీ షెడ్యూల్ విడుదల చేసిన ఐసీసీ, బీసీసీఐ.. టికెట్స్ విక్రయాలను కూడా ఆరంభించాయి. అక్టోబర్ 14న జరగనున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు సంబంధించి కొన్ని టికెట్లను మంగళవారం (ఆగష్టు 29) సాయంత్రం 6 గంటలకు ఆన్లైన్లో ఉంచారు. ఈ మ్యాచ్ టికెట్స్ కోసం…
KL Rahul to Miss Pakistan and Nepal matches in Asia Cup 2023: ఆసియా కప్ 2023 ఆరంభానికి ముందే టీమిండియాకు భారీ షాక్ తగిలింది. చాలాకాలం తర్వాత జట్టుకు ఎంపికైన స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్.. తొలి రెండు మ్యాచ్లకు అందుబాటులో ఉండకుండా పోయాడు. ఈ విషయాన్ని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలిపారు. ఆసియా కప్ 2023లో భాగంగా పాకిస్థాన్, నేపాల్తో జరిగే మ్యాచ్లకు రాహుల్ దూరం కానున్నాడు. అతడి…
BCCI set to announce India Team for World Cup 2023 on September 3: 2011 తర్వాత భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ 2023 జరగనుంది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు మెగా టోర్నీ జరగనుంది. ఈ టోర్నమెంట్ కోసం ఇప్పటికే చాలా దేశాలు తమ ప్రాథమిక జట్లను ప్రకటించాయి. ప్రపంచకప్ టోర్నీకి భారత జట్టును సెప్టెంబర్ 3న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.…
BCCI President Roger Binny participate in Eco Vizag Beach Walk: గతంలో కంటే వైజాగ్లో ఎన్నో మార్పులు వచ్చాయని బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ అన్నారు. ‘ఎకో వైజాగ్ బీచ్ వాక్’లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2023లో భాగంగా జీవీఎంసీ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఆధ్వర్యంలో మంగళవారం ఎకో వైజాగ్ బీచ్ వాక్ నిర్వహించారు. ఉదయం 6 గంటలకు ఆర్కేబీచ్ కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ వరకు ఈ వాక్…
బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా దాయాది దేశమైన పాకిస్తాన్కు వెళ్లనున్నారు. ఆసియా కప్-2023 ప్రారంభ వేడులకు హాజరు కావాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పంపిన ఆహ్వానం మేరకు వీరిరువురు పాక్ కు పయనం కానున్నారు.