Team India Coach: టీ20 వరల్డ్ కప్ తర్వాత ద్రవిడ్ కోచ్గా కొనసాగనున్నారా.. జైషా ఏమన్నారంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కొనసాగనున్నారా అనే దానిపై బీసీసీఐ సెక్రటరీ జైషా స్పందించారు. ద్రవిడ్ పదవీకాలం పూర్తయిన తర్వాత కోచ్ పదవిలో కొనసాగాలనుకుంటే.. అతను మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. కొత్త కోచ్ నియామకం మూడేళ్లపాటు ఉంటుందని షా స్పష్టం చేశారు. ద్రవిడ్ అసలు కాంట్రాక్ట్ రెండేళ్లు. గతేడాది నవంబర్లో జరిగిన 50 ఓవర్ల ప్రపంచకప్ తర్వాత ద్రవిడ్, సహాయక సిబ్బంది పదవీకాలాన్ని ఏడాది పాటు పొడిగించారు. రాహుల్ ద్రవిడ్ మార్గదర్శకత్వంలో టీమిండియా వన్డే ప్రపంచకప్ 2023లో ఫైనల్లోకి ప్రవేశించింది.
Engagement Off: ఎంగేజ్మెంట్ ఆగిపోయిందనే కోపంతో.. అమ్మాయి తల నరికిన వ్యక్తి..
Also Read
- Congress: భారత్పై నెతన్యాహూ ప్రశంసలు.. మోడీపై కాంగ్రెస్ విమర్శలు..
- Trinamool Congress: ‘‘ముస్లింల కోసమే పనిచేసింది’’.. టీఎంసీ పార్టీ చీఫ్ రాజీనామా..
- DK Shivakumar: ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారంపై సందిగ్ధం.. ఢిల్లీలో డీకే.శివకుమార్ కీలక వ్యాఖ్యలు
- Supreme Court: వేధించడానికే పెళ్లిళ్లు చేసుకుంటారా? అబ్బాయిలకు సుప్రీంకోర్టు చీవాట్లు
“ద్రవిడ్ టీమిండియా కోచ్గా కొనసాగాలనుకుంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని జైషా చెప్పాడు. దాదాపు మూడేళ్ల పాటు సుదీర్ఘ పదవీకాలం కోచ్ కోసం చూస్తున్నాం.” వివిధ ఫార్మాట్లకు వేర్వేరు కోచ్ల నియామకానికి సంబంధించి ఎలాంటి పూర్వాపరాలు లేవని, అయితే క్రికెట్ అడ్వైజరీ కమిటీ నిర్ణయమే అంతిమంగా ఉంటుందని బీసీసీఐ కార్యదర్శి తెలిపారు. “భారత క్రికెట్లో వివిధ ఫార్మాట్లకు వేర్వేరు కోచ్లను నియమించడానికి ఎటువంటి కారణం లేదు. అన్ని ఫార్మాట్లలో ఆడే ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. అందులో.. రిషబ్ పంత్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి ప్లేయర్లు ఉన్నారు. అంతిమంగా ఇది సీఏసీ (CAC) నిర్ణయం. వారు ఏ నిర్ణయం తీసుకున్నా తాను దానిని అమలు చేస్తానని జైషా పేర్కొన్నారు.
SBI Jobs: ఎస్బీఐలో 12,000 ఉద్యోగాలు.. వివరాలు ఇలా..
సీఏసీ సిఫారసు మేరకు విదేశీ కోచ్లను కూడా నియమించుకోవచ్చని జై షా తెలిపారు. సీఏసీ విదేశీ కోచ్ని ఎంపిక చేస్తే, తాను జోక్యం చేసుకోనన్నారు. త్వరలో జాతీయ సెలెక్టర్ పదవిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. “సెలెక్టర్ పదవికి చాలా ఇంటర్వ్యూలు జరిగాయి. మేము త్వరలో ప్రకటిస్తాము.” అని జైషా పేర్కొన్నారు. మరోవైపు.. ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే పదవీకాలం ఈ సంవత్సరం చివరిలో ముగియనుంది.. ఈ క్రమంలో షా ఆ పదవిపై ఆసక్తి లేదని చెప్పారు.
తాజావార్తలు
-
Congress: భారత్పై నెతన్యాహూ ప్రశంసలు.. మోడీపై కాంగ్రెస్ విమర్శలు..
-
Romanchakam: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మనసు దోచిన లవ్ స్టోరీ.. ‘రోమాంచకం’ తో సరికొత్త ప్రయాణం!
-
Moinuddin Murder : రూ.25 లక్షల సుపారీ.. హిట్ అండ్ రన్గా న్యాయవాది హత్య స్కెచ్.!
-
Trinamool Congress: ‘‘ముస్లింల కోసమే పనిచేసింది’’.. టీఎంసీ పార్టీ చీఫ్ రాజీనామా..
-
DK Shivakumar: ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారంపై సందిగ్ధం.. ఢిల్లీలో డీకే.శివకుమార్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!