Team India Coach: టీ20 వరల్డ్ కప్ తర్వాత ద్రవిడ్ కోచ్గా కొనసాగనున్నారా.. జైషా ఏమన్నారంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కొనసాగనున్నారా అనే దానిపై బీసీసీఐ సెక్రటరీ జైషా స్పందించారు. ద్రవిడ్ పదవీకాలం పూర్తయిన తర్వాత కోచ్ పదవిలో కొనసాగాలనుకుంటే.. అతను మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. కొత్త కోచ్ నియామకం మూడేళ్లపాటు ఉంటుందని షా స్పష్టం చేశారు. ద్రవిడ్ అసలు కాంట్రాక్ట్ రెండేళ్లు. గతేడాది నవంబర్లో జరిగిన 50 ఓవర్ల ప్రపంచకప్ తర్వాత ద్రవిడ్, సహాయక సిబ్బంది పదవీకాలాన్ని ఏడాది పాటు పొడిగించారు. రాహుల్ ద్రవిడ్ మార్గదర్శకత్వంలో టీమిండియా వన్డే ప్రపంచకప్ 2023లో ఫైనల్లోకి ప్రవేశించింది.
Engagement Off: ఎంగేజ్మెంట్ ఆగిపోయిందనే కోపంతో.. అమ్మాయి తల నరికిన వ్యక్తి..
Also Read
- Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!
- What's Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
- TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
“ద్రవిడ్ టీమిండియా కోచ్గా కొనసాగాలనుకుంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని జైషా చెప్పాడు. దాదాపు మూడేళ్ల పాటు సుదీర్ఘ పదవీకాలం కోచ్ కోసం చూస్తున్నాం.” వివిధ ఫార్మాట్లకు వేర్వేరు కోచ్ల నియామకానికి సంబంధించి ఎలాంటి పూర్వాపరాలు లేవని, అయితే క్రికెట్ అడ్వైజరీ కమిటీ నిర్ణయమే అంతిమంగా ఉంటుందని బీసీసీఐ కార్యదర్శి తెలిపారు. “భారత క్రికెట్లో వివిధ ఫార్మాట్లకు వేర్వేరు కోచ్లను నియమించడానికి ఎటువంటి కారణం లేదు. అన్ని ఫార్మాట్లలో ఆడే ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. అందులో.. రిషబ్ పంత్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి ప్లేయర్లు ఉన్నారు. అంతిమంగా ఇది సీఏసీ (CAC) నిర్ణయం. వారు ఏ నిర్ణయం తీసుకున్నా తాను దానిని అమలు చేస్తానని జైషా పేర్కొన్నారు.
SBI Jobs: ఎస్బీఐలో 12,000 ఉద్యోగాలు.. వివరాలు ఇలా..
సీఏసీ సిఫారసు మేరకు విదేశీ కోచ్లను కూడా నియమించుకోవచ్చని జై షా తెలిపారు. సీఏసీ విదేశీ కోచ్ని ఎంపిక చేస్తే, తాను జోక్యం చేసుకోనన్నారు. త్వరలో జాతీయ సెలెక్టర్ పదవిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. “సెలెక్టర్ పదవికి చాలా ఇంటర్వ్యూలు జరిగాయి. మేము త్వరలో ప్రకటిస్తాము.” అని జైషా పేర్కొన్నారు. మరోవైపు.. ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే పదవీకాలం ఈ సంవత్సరం చివరిలో ముగియనుంది.. ఈ క్రమంలో షా ఆ పదవిపై ఆసక్తి లేదని చెప్పారు.
తాజావార్తలు
-
Golden Globes: 2027 అవార్డుల కోసం గోల్డెన్ గ్లోబ్స్ షాకింగ్ రూల్స్!
-
Sai Pallavi: ‘ఏక్ దిన్’ డిజాస్టర్ పై సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్..
-
Tamil Nadu Politics : తమిళనాడు రాజకీయాల్లో హైడ్రామా.. విజయ్ భవిష్యత్తును తేల్చనున్న ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు.!
-
OnePlus Nord CE 6: వన్ప్లస్ నార్డ్ CE6 విడుదల.. 8000mAh బ్యాటరీ, పవర్, పనితీరు అన్నీ ఒకే ఫోన్లో
-
India T20 Captain: బీసీసీఐ కీలక నిర్ణయం.. సూర్యకుమార్ ఔట్.. టీమిండియా కొత్త కెప్టెన్ ఎవరంటే?