Team India Coach: టీ20 వరల్డ్ కప్ తర్వాత ద్రవిడ్ కోచ్గా కొనసాగనున్నారా.. జైషా ఏమన్నారంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కొనసాగనున్నారా అనే దానిపై బీసీసీఐ సెక్రటరీ జైషా స్పందించారు. ద్రవిడ్ పదవీకాలం పూర్తయిన తర్వాత కోచ్ పదవిలో కొనసాగాలనుకుంటే.. అతను మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. కొత్త కోచ్ నియామకం మూడేళ్లపాటు ఉంటుందని షా స్పష్టం చేశారు. ద్రవిడ్ అసలు కాంట్రాక్ట్ రెండేళ్లు. గతేడాది నవంబర్లో జరిగిన 50 ఓవర్ల ప్రపంచకప్ తర్వాత ద్రవిడ్, సహాయక సిబ్బంది పదవీకాలాన్ని ఏడాది పాటు పొడిగించారు. రాహుల్ ద్రవిడ్ మార్గదర్శకత్వంలో టీమిండియా వన్డే ప్రపంచకప్ 2023లో ఫైనల్లోకి ప్రవేశించింది.
Engagement Off: ఎంగేజ్మెంట్ ఆగిపోయిందనే కోపంతో.. అమ్మాయి తల నరికిన వ్యక్తి..
Also Read
- Virat Kohli: లండన్లో ఆ ప్లేయర్తో విరాట్ సీక్రెట్ మీటింగ్.. రెండు గంటల్లోనే వైరల్ ఫొటోలు చూసి కోహ్లీ షాక్!
- Pawan Kalyan Health Update: పవన్ కల్యాణ్కు శస్త్రచికిత్స విజయవంతం.. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే..?
- New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
- LPG Connection Transfer Rules: ఎల్పీజీ వినియోగదారులకు అలర్ట్.. ఈ 5 రూల్స్ పాటించకపోతే కనెక్షన్ కట్..!
“ద్రవిడ్ టీమిండియా కోచ్గా కొనసాగాలనుకుంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని జైషా చెప్పాడు. దాదాపు మూడేళ్ల పాటు సుదీర్ఘ పదవీకాలం కోచ్ కోసం చూస్తున్నాం.” వివిధ ఫార్మాట్లకు వేర్వేరు కోచ్ల నియామకానికి సంబంధించి ఎలాంటి పూర్వాపరాలు లేవని, అయితే క్రికెట్ అడ్వైజరీ కమిటీ నిర్ణయమే అంతిమంగా ఉంటుందని బీసీసీఐ కార్యదర్శి తెలిపారు. “భారత క్రికెట్లో వివిధ ఫార్మాట్లకు వేర్వేరు కోచ్లను నియమించడానికి ఎటువంటి కారణం లేదు. అన్ని ఫార్మాట్లలో ఆడే ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. అందులో.. రిషబ్ పంత్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి ప్లేయర్లు ఉన్నారు. అంతిమంగా ఇది సీఏసీ (CAC) నిర్ణయం. వారు ఏ నిర్ణయం తీసుకున్నా తాను దానిని అమలు చేస్తానని జైషా పేర్కొన్నారు.
SBI Jobs: ఎస్బీఐలో 12,000 ఉద్యోగాలు.. వివరాలు ఇలా..
సీఏసీ సిఫారసు మేరకు విదేశీ కోచ్లను కూడా నియమించుకోవచ్చని జై షా తెలిపారు. సీఏసీ విదేశీ కోచ్ని ఎంపిక చేస్తే, తాను జోక్యం చేసుకోనన్నారు. త్వరలో జాతీయ సెలెక్టర్ పదవిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. “సెలెక్టర్ పదవికి చాలా ఇంటర్వ్యూలు జరిగాయి. మేము త్వరలో ప్రకటిస్తాము.” అని జైషా పేర్కొన్నారు. మరోవైపు.. ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే పదవీకాలం ఈ సంవత్సరం చివరిలో ముగియనుంది.. ఈ క్రమంలో షా ఆ పదవిపై ఆసక్తి లేదని చెప్పారు.
తాజావార్తలు
-
Virat Kohli: లండన్లో ఆ ప్లేయర్తో విరాట్ సీక్రెట్ మీటింగ్.. రెండు గంటల్లోనే వైరల్ ఫొటోలు చూసి కోహ్లీ షాక్!
-
Wedding Fight: మటన్ పెడతామని ఒప్పుకొని.. చికెన్ పెడతారా?.. పెళ్లి విందులో పొట్టు పొట్టు తన్నుకున్న వైనం
-
Pawan Kalyan Health Update: పవన్ కల్యాణ్కు శస్త్రచికిత్స విజయవంతం.. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే..?
-
Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే జోడీగా ‘శ్రీశ్రీ’.. క్లాసిక్ లవ్ స్టోరీతో వస్తోన్న పాన్ ఇండియా మూవీ
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!