షేక్ హసీనా ప్రధానిగా 15 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కొత్త అధ్యాయానికి నాంది పలుకుతూ బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు.
ఇదిలా ఉంటే మరో కాంగ్రెస్ నేత సజ్జన్ సింగ్ వర్మ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బంగ్లాదేశ్ మాదిరిగానే భారత్లో ఏదో రోజు ప్రధాని నరేంద్రమోడీ ఇంటిని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. షేక్ హసీనాకు పట్టిన గతే ప్రధాని మోడీకి పడుతుందని అన్నారు. బంగ్లాదేశ్లో వేలాది మంది నిరసనకారులు సోమవారం ఢాకాలోని షేక్ హసీనా ఇంటిని ముట్టడించారు.
Bangladesh Violence: రిజర్వేషన్ల కోటాపై బంగ్లాదేశ్లో చెలరేగిని హింస, చివరకు షేక్ హసీనా తన ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసి, దేశం వదిలి పారిపోయేలా చేసింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు కాబోతోంది.
Salman Khurshid: కాంగ్రెస్ నేత, సీడబ్ల్యూసీ సభ్యుడు సల్మాన్ ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ అవుతోంది. ఇండియాలో కూడా ‘‘బంగ్లాదేశ్ పరిస్థితులు’’ రావచ్చని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. మంగళవారం ఖుర్షీద్ మాట్లాడుతూ.. ‘‘బయటకు ప్రతీది సాధారణంగా కనిపించొచ్చు. బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో అది భారత్లో కూడా జరగొచ్చు’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు.
Pinaki Bhattacharya: షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా రాజీనామా చేసి, దేశం వదిలిపారిపోయేలా చేసేందుకు కుట్ర జరిగిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. షేక్ హసీనాను భారత్ కీలుబొమ్మగా పోలుస్తూ, అడుగడుగున భారత వ్యతిరేకత నింపుకున్న వ్యక్తి ‘పినాకి భట్టాచార్య’. ఫ్రాన్స్లో ఉంటున్న ఇతను అక్కడ నుంచే షేక్ హసీనాకు వ్యతిరేకంగా వీడియోలు చేస్తూ దేశంలో అగ్గిరాజేందుకు కీలకంగా వ్యవహరించాడు.
CM Yogi Adityanath: బంగ్లాదేశ్లో హిందువులను సెలెక్టివ్గా టార్గెట్ చేస్తున్నారని ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ బుధవారం ఆరోపించారు. సనాతన ధర్మానికి ఎదురయ్యే బెదిరింపులను ఎదుర్కోవడానికి ఐక్యత అవసరమని ఆయన బుధవారం అన్నారు.
బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. గురువారం కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్-ఉజ్-జమాన్ బుధవారం తెలిపారు.
Bangladesh Violence: బంగ్లాదేశ్ హింసాత్మక ఘటనల మధ్య తొలిసారిగా షేక్ హసీనా ప్రత్యర్థి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) చీఫ్, మాజీ ప్రధాని ఖలిదా జియా తొలి సందేశాన్ని ఇచ్చారు. షేక్ హసీనా రాజీనామా చేసి దేశం నుంచి పారిపోయిన తర్వాత, ఆ దేశ అధ్యక్షుడు షహబుద్దీన్ జైలులో ఉన్న ఖలిదా జియాను విడుదల చేయాలని ఆదేశించారు.
ఇదిలా ఉంటే, ఒక్క హిందువులనే కాకుండా షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తూ విధ్వంసానికి తెగబడుతున్నారు. అవామీ లీగ్ కార్యకర్తలు, నేతల ఇళ్లను చుట్టుముట్టి నిప్పుపెడుతున్నారు.
Bangladesh Violence: బంగ్లాదేశ్లో ఇంకా హింస చెలరేగుతూనే ఉంది. షేక్ హసీనా రాజీనామా చేసి, ఇండియాకి పారిపోయివచ్చినప్పటికీ అక్కడ పరిస్థితి చక్కబడటం లేదు. ముఖ్యంగా హసీనాకు చెందిన అవామీ లీడ్ పార్టీ నేతలతో పాటు హిందువులను టార్గెట్ చేస్తున్నారు.