Bangladesh crisis: రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ వ్యాప్తంగా జరిగి అల్లర్లు, హింస గురించి అందరికి తెలిసిందే. చివరకు షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోవాల్సి వచ్చింది.
Sheikh Hasina : బంగ్లాదేశ్లో జరిగిన హింసాకాండ తర్వాత ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా బంగ్లాదేశ్ను విడిచిపెట్టారు. బంగ్లాదేశ్ను విడిచిపెట్టిన కొద్ది గంటల్లోనే ఆమె అధికారిక నివాసం గణ భవన్ను ఆందోళనకారులు స్వాధీనం చేసుకున్నారు.
బంగ్లాదేశ్లో అల్లర్ల తర్వాత బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్లో తలదాచుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె ఢిల్లీలో ఉంటున్నారు. ఇదే అంశంపై యూకే విదేశాంగ శాఖ కార్యదర్శి డేవిడ్ లామీతో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ ఫోన్లో సంభాషించారు.
PM Modi: షేక్ హసీనా రాజీనామా తర్వాత బంగ్లాదేశ్లో నోబెల్ విజేత ముహమ్మద్ యూనస్ ప్రధానిగా తాత్కాలిక ప్రభుత్వాన్ని ఈ రోజు ఏర్పాటు చేశారు. బాధ్యతలు స్వీకరించిన యూనస్కి ప్రధాని నరేంద్రమోడీ శుభాకాంక్షలు తెలిపారు. బంగ్లాదేశ్లో త్వరగా సాధారణ స్థితికి రావాలని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
షేక్ హసీనా ప్రధానిగా 15 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కొత్త అధ్యాయానికి నాంది పలుకుతూ బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు.
ఇదిలా ఉంటే మరో కాంగ్రెస్ నేత సజ్జన్ సింగ్ వర్మ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బంగ్లాదేశ్ మాదిరిగానే భారత్లో ఏదో రోజు ప్రధాని నరేంద్రమోడీ ఇంటిని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. షేక్ హసీనాకు పట్టిన గతే ప్రధాని మోడీకి పడుతుందని అన్నారు. బంగ్లాదేశ్లో వేలాది మంది నిరసనకారులు సోమవారం ఢాకాలోని షేక్ హసీనా ఇంటిని ముట్టడించారు.
Bangladesh Violence: రిజర్వేషన్ల కోటాపై బంగ్లాదేశ్లో చెలరేగిని హింస, చివరకు షేక్ హసీనా తన ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసి, దేశం వదిలి పారిపోయేలా చేసింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు కాబోతోంది.
Salman Khurshid: కాంగ్రెస్ నేత, సీడబ్ల్యూసీ సభ్యుడు సల్మాన్ ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ అవుతోంది. ఇండియాలో కూడా ‘‘బంగ్లాదేశ్ పరిస్థితులు’’ రావచ్చని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. మంగళవారం ఖుర్షీద్ మాట్లాడుతూ.. ‘‘బయటకు ప్రతీది సాధారణంగా కనిపించొచ్చు. బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో అది భారత్లో కూడా జరగొచ్చు’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు.
Pinaki Bhattacharya: షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా రాజీనామా చేసి, దేశం వదిలిపారిపోయేలా చేసేందుకు కుట్ర జరిగిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. షేక్ హసీనాను భారత్ కీలుబొమ్మగా పోలుస్తూ, అడుగడుగున భారత వ్యతిరేకత నింపుకున్న వ్యక్తి ‘పినాకి భట్టాచార్య’. ఫ్రాన్స్లో ఉంటున్న ఇతను అక్కడ నుంచే షేక్ హసీనాకు వ్యతిరేకంగా వీడియోలు చేస్తూ దేశంలో అగ్గిరాజేందుకు కీలకంగా వ్యవహరించాడు.
CM Yogi Adityanath: బంగ్లాదేశ్లో హిందువులను సెలెక్టివ్గా టార్గెట్ చేస్తున్నారని ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ బుధవారం ఆరోపించారు. సనాతన ధర్మానికి ఎదురయ్యే బెదిరింపులను ఎదుర్కోవడానికి ఐక్యత అవసరమని ఆయన బుధవారం అన్నారు.