Bangladesh: బంగ్లాదేశ్ పరిణామాలు భారత వస్త్ర, పత్తి పరిశ్రమలపై ఎలా ప్రభావం చూపిస్తోంది..?
- బంగ్లా పరిస్థితులు భారత వస్త్ర-పత్తి పరిశ్రమలపై ప్రభావం..
- పత్తి ఎగుమతులు తగ్గే అవకాశం..
- విద్యుత్.. ప్రతీకూల వాతావరణం.. ఉక్రెయిన్ వార్తో బంగ్లా కుదేలు..
- భారత వస్త్ర పరిశ్రమకు ప్లస్ అవుతున్న బంగ్లా పరిణామాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్ పరిస్థితులు, ఉద్రిక్తతలు భారత వస్త్ర వ్యాపారం, పత్తి ఎగుమతులపై ప్రభావం చూపిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద టెక్స్టైల్స్ వ్యాపారానికి బంగ్లాదేశ్ కేంద్రంగా ఉంది. అయితే, ఇటీవల హింసాత్మక అల్లర్లు, రాజకీయ అస్థిరత అక్కడి పరిశ్రమపై ప్రభావం చూపిస్తోంది. బంగ్లాదేశ్ ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చే కొత్త ఆర్డర్లను నిలిపేసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం బంగ్లాదేశ్కి ముడి పదార్థాలను సరఫరా చేసే దేశంగా ఉన్న భారత్పై ప్రభావం చూపిస్తుంది.
భారతదేశం నుంచి బంగ్లాదేశ్కి పత్తి ఎగుమతి అవుతుంది. భారతదేశం ఏడాదికి 2.4 బిలియన్ల విలువైన పత్తిని ఆ దేశానికి ఎగుమతి చేస్తుంది. భారత్ మొత్తం పత్తి ఎగుమతుల్లో బంగ్లాదేశ్ వాటా ఆర్థిక సంవత్సరం 2013 నుంచి 2024 పోల్చి చూస్తే 16.8 శాతం నుంచి 34.7 శాతానికి పెరిగింది. 2024లో బంగ్లాదేశ్కి భారత్ చేసిన ఎగుమతుల్లో నాలుగో వంతు భాగం ముడిపత్తి ఉంది.
Also Read
- Salman Khan: అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్.. 500 కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం
- Gujarat Well Mystery: వింత ఘటన.. బావిలో నీరు అలల్లా కదలికలు, రంగంలోకి అధికారులు (వీడియో)
- Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
Read Also: Shreya Ghoshal: ‘‘వెన్నులో వణుకు పుట్టిస్తోంది’’..కోల్కతా ఘటనపై శ్రేయా ఘోషల్ స్పందన..
అయితే, బంగ్లాదేశ్ పరిణామాలు భారత వస్త్రపరిశ్రమకు కొంత బూస్ట్ ఇస్తోంది. భారత్ వస్త్ర ఉత్పత్తి కోసం తాజాగా పలు ఆర్డర్లకు సంబంధించి విచారణలను స్వీకరించడం ప్రారంభించింది. ఇదిలా ఉంటే, భారత్ నుంచి బంగ్లాదేశ్కి పత్తి ఎగుమతులు క్షీణిస్తున్నాయి. నిజానికి బంగ్లాదేశ్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీకి భారత్ ప్రత్యామ్యాయంగా విదేశాలు చూస్తున్నాయి. అయితే, బంగ్లాదేశ్ గుణాత్మ, పరిణాత్మక డిమాండ్లను తీర్చడంలో భారతీయ వస్త్రపరిశ్రమ సవాళ్లను ఎదుర్కొంటుందని న్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ (CITI) సెక్రటరీ జనరల్ చంద్రిమా ఛటర్జీ చెప్పారు. అయితే, భారతదేశం యొక్క ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం మరియు PM మిత్రా పథకం దేశీయ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి సానుకూల చర్యలు అని ఆమె హైలైట్ చేసింది.
బంగ్లాదేశ్లో మానవ హక్కుల సమస్య గురించి పాశ్చాత్య మార్కెట్లు ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ ఆ మార్కెట్లకు ఆకర్షణీయమైన ప్రత్యామ్నాయంగా మారింది. బంగ్లాదేశ్లో 45 బిలియన్ డాలర్ల వస్త్ర పరిశ్రమను, 4 మిలియన్లకు పైగా కార్మికులను కలిగి ఉంది. అయితే, ఆ దేశంలో బలహీనమైన విద్యుత్ ఉత్పత్తి అవస్థాపన, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఇన్పుట్ ఖర్చులు పెరగడం, వరదలు-తుఫానుల వంటి ప్రతీకూల వాతావరణ పరిస్థితులతో పోరాడుతోంది.
తాజావార్తలు
-
Trent Boult విధ్వంసం.. యార్కర్తో బెయిర్స్టోకు షాక్.! ‘బై-బై’ సెలబ్రేషన్ వీడియో వైరల్.!
-
Telangana High Court: “సమాజంలో ఎవరికైనా బాధ్యత ఉందా”.. ఉచిత పథకాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
CM Chandrababu: వారికి ఎంతైనా ఖర్చు పెట్టాలనుంది.. కానీ ఖజానా ఖాళీగా ఉంది!
-
Petrol Cars India: పెట్రోల్ కార్ల శకం ముగిసిందా? ఈవీలు, హైబ్రిడ్ కార్ల అమ్మకాలు రికార్డు స్థాయికి.. మార్కెట్లో మారుతి ఆధిపత్యం
-
Ajinkya Rahane: “ధోనీ, కోహ్లీ కానే కాదు.. టీమిండియా ఆల్టైమ్ గ్రేట్ అతడే”.. రహానే ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!