Bangladesh: బంగ్లాదేశ్ పరిణామాలు భారత వస్త్ర, పత్తి పరిశ్రమలపై ఎలా ప్రభావం చూపిస్తోంది..?
- బంగ్లా పరిస్థితులు భారత వస్త్ర-పత్తి పరిశ్రమలపై ప్రభావం..
- పత్తి ఎగుమతులు తగ్గే అవకాశం..
- విద్యుత్.. ప్రతీకూల వాతావరణం.. ఉక్రెయిన్ వార్తో బంగ్లా కుదేలు..
- భారత వస్త్ర పరిశ్రమకు ప్లస్ అవుతున్న బంగ్లా పరిణామాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్ పరిస్థితులు, ఉద్రిక్తతలు భారత వస్త్ర వ్యాపారం, పత్తి ఎగుమతులపై ప్రభావం చూపిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద టెక్స్టైల్స్ వ్యాపారానికి బంగ్లాదేశ్ కేంద్రంగా ఉంది. అయితే, ఇటీవల హింసాత్మక అల్లర్లు, రాజకీయ అస్థిరత అక్కడి పరిశ్రమపై ప్రభావం చూపిస్తోంది. బంగ్లాదేశ్ ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చే కొత్త ఆర్డర్లను నిలిపేసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం బంగ్లాదేశ్కి ముడి పదార్థాలను సరఫరా చేసే దేశంగా ఉన్న భారత్పై ప్రభావం చూపిస్తుంది.
భారతదేశం నుంచి బంగ్లాదేశ్కి పత్తి ఎగుమతి అవుతుంది. భారతదేశం ఏడాదికి 2.4 బిలియన్ల విలువైన పత్తిని ఆ దేశానికి ఎగుమతి చేస్తుంది. భారత్ మొత్తం పత్తి ఎగుమతుల్లో బంగ్లాదేశ్ వాటా ఆర్థిక సంవత్సరం 2013 నుంచి 2024 పోల్చి చూస్తే 16.8 శాతం నుంచి 34.7 శాతానికి పెరిగింది. 2024లో బంగ్లాదేశ్కి భారత్ చేసిన ఎగుమతుల్లో నాలుగో వంతు భాగం ముడిపత్తి ఉంది.
Also Read
- Nepal Flash Floods: నేపాల్లో వరద విలయం.. 105 మంది భారతీయులు గల్లంతు..
- Marriage Not License: తల్లిదండ్రుల ఇంటికి వెళ్లేందుకు భర్త పర్మిషన్ అక్కర్లేదు.. హైకోర్టు కీలక తీర్పు
- Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ న్యూయార్క్ ఈవెంట్.. మమ్దానీపై యూఎస్ సింగర్ ఘాటు వ్యాఖ్యలు..
- Kriti Sanon: రాహుల్గాంధీ-కంగనా మాటల యుద్ధం.. కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ తొలగింపు
Read Also: Shreya Ghoshal: ‘‘వెన్నులో వణుకు పుట్టిస్తోంది’’..కోల్కతా ఘటనపై శ్రేయా ఘోషల్ స్పందన..
అయితే, బంగ్లాదేశ్ పరిణామాలు భారత వస్త్రపరిశ్రమకు కొంత బూస్ట్ ఇస్తోంది. భారత్ వస్త్ర ఉత్పత్తి కోసం తాజాగా పలు ఆర్డర్లకు సంబంధించి విచారణలను స్వీకరించడం ప్రారంభించింది. ఇదిలా ఉంటే, భారత్ నుంచి బంగ్లాదేశ్కి పత్తి ఎగుమతులు క్షీణిస్తున్నాయి. నిజానికి బంగ్లాదేశ్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీకి భారత్ ప్రత్యామ్యాయంగా విదేశాలు చూస్తున్నాయి. అయితే, బంగ్లాదేశ్ గుణాత్మ, పరిణాత్మక డిమాండ్లను తీర్చడంలో భారతీయ వస్త్రపరిశ్రమ సవాళ్లను ఎదుర్కొంటుందని న్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ (CITI) సెక్రటరీ జనరల్ చంద్రిమా ఛటర్జీ చెప్పారు. అయితే, భారతదేశం యొక్క ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం మరియు PM మిత్రా పథకం దేశీయ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి సానుకూల చర్యలు అని ఆమె హైలైట్ చేసింది.
బంగ్లాదేశ్లో మానవ హక్కుల సమస్య గురించి పాశ్చాత్య మార్కెట్లు ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ ఆ మార్కెట్లకు ఆకర్షణీయమైన ప్రత్యామ్నాయంగా మారింది. బంగ్లాదేశ్లో 45 బిలియన్ డాలర్ల వస్త్ర పరిశ్రమను, 4 మిలియన్లకు పైగా కార్మికులను కలిగి ఉంది. అయితే, ఆ దేశంలో బలహీనమైన విద్యుత్ ఉత్పత్తి అవస్థాపన, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఇన్పుట్ ఖర్చులు పెరగడం, వరదలు-తుఫానుల వంటి ప్రతీకూల వాతావరణ పరిస్థితులతో పోరాడుతోంది.
తాజావార్తలు
-
Daggubati Purandeswari: 2024 ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ.. పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు
-
Nepal Flash Floods: నేపాల్లో వరద విలయం.. 105 మంది భారతీయులు గల్లంతు..
-
Silver Cleaning Trick: వెండి ఆభరణాలపై నలుపు పోవాలా? ఇలా క్లీన్ చేస్తే కొత్తదానిలా మెరిసిపోతాయి!
-
Marriage Not License: తల్లిదండ్రుల ఇంటికి వెళ్లేందుకు భర్త పర్మిషన్ అక్కర్లేదు.. హైకోర్టు కీలక తీర్పు
-
Success Story: ఆ ఒక్క నిర్ణయం అతని జీవితాన్నే మార్చేసింది.. IT జాబ్ వదిలి మష్రూమ్ బిజినెస్తో లక్షలు!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..