Bangladesh: బంగ్లాదేశ్ పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్లైంది. రిజర్వేషన్ కోటాకు నిరసగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో షేక్ హసీనా ప్రధాని పదవికీ రాజీనామా చేసి భారత్ పారిపోయి వచ్చింది. నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా అక్కడ మతోన్మాదులు రెచ్చిపోతున్నారు. దేశ అంతర్గత భద్రత తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ అనేది ఆ దేశంలో లేనే లేదు. నిరసనల…
ఇదిలా ఉంటే, మైనారిటీలపై హింసను దర్యాప్తు చేయడానికి ఐక్యరాజ్యసమితి మానవహక్కుల పర్యవేక్షణ బృంధం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకి చేరుకుంది. నోబెల్ శాంతి గ్రహీత మహ్మద్ యూనస్ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా అక్కడ మైనారిటీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి.
Bangladesh: బంగ్లాదేశ్లో మైనారిటీలు, ముఖ్యంగా హిందువులపై దాడులు ఆగడం లేదు. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయినప్పటి నుంచి అక్కడ మైనారిటీలు, వారి వ్యాపారాలు, ఆలయాలు, చర్చ్ల మీద దాడులు జరగుతూనే ఉన్నాయి. 15 రోజుల్లో దేశంలోని 49 జిల్లాల్లో 1000కి పైగా దాడులు జరిగాయి. ఆగస్టు 5 నుంచి ఆగస్టు 20 వరకు మైనారిటీలపై మొత్తం 1068 దాడులు జరిగాయిని ఆ దేశంలోని ప్రముఖ వార్తాపత్రిక ప్రోథోమ్ అలో తెలిపింది.
Bangladesh: బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల గొడవలు హింసాత్మకంగా మారి, చివరకు షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ పారిపోయి వచ్చేలా చేశాయి. హసీనా అవామీ లీగ్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత అక్కడ మతోన్మాదులు హిందువులను టార్గెట్ చేసి దాడులకు తెగబడిన సంగతి తెలిసిందే. హిందూ వ్యాపారాలను, ఆలయాలను తగలబెట్టారు. ప్రస్తుతం ఇప్పుడిప్పుడే ఆ దేశంలో హిందువుల పరిస్థితి చక్కబడుతోంది.
Bangladesh: బంగ్లాదేశ్లో షేక్ హసీనాని గద్దె దించాలనే కుట్ర జరిగినట్లు వస్తున్న ఊహాగానాలకు బలం చేకూర్చిన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. షేక్ హసీనా, ఆమె పార్టీ అవామీ లీగ్ని బంగ్లాదేశ్ నుంచి తొలగించే ప్లాన్ విదేశాల నుంచి అమలు చేయబడినట్లు తెలుస్తోంది. హసీనా పదవి నుంచి దిగిపోవడం వెనక అమెరికా కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. దీనికి పాకిస్తాన్ కూడా తోడైంది.
Bangladesh: బంగ్లాదేశ్ క్రమక్రమంగా రాడికల్ ఇస్లామిస్ట్ శక్తుల చేతుల్లోకి వెళ్తోంది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుందని షేక్ హసీనా నిషేధించిన ‘‘జమాతే ఇస్లామీ’’ సంస్థకు ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్ క్లీన్చిట్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే, తాజాగా ఆయన హెఫాజత్-ఏ ఇస్లాం సంస్థ నాయకుడు మమునుల్ హక్, అతడి గ్రూపు సభ్యులతో కలిసి మహ్మద్ యూనస్ భేటీ కావడం వివాదాస్పదమైంది.
Bangladesh: ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోటాను వ్యతిరేకిస్తూ బంగ్లాదేశ్లో జరిగిన హింసాత్మక ఆందోళనలు ఏకంగా షేక్ హసీనా ప్రభుత్వాన్నే కూల్చాయి. బంగ్లాదేశ్ స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు ఇచ్చిన రిజర్వేషన్లను క్యాన్సిల్ చేయాలని విద్యార్థులు, ప్రజలు ఆందోళనలు చేశారు. చివరకు ఆ దేశ ఆర్మీ ఇచ్చిన అల్టిమేటంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, ఇండియా పారిపోయి వచ్చారు.
Bangladesh: బంగ్లాదేశ్ పరిస్థితులు, ఉద్రిక్తతలు భారత వస్త్ర వ్యాపారం, పత్తి ఎగుమతులపై ప్రభావం చూపిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద టెక్స్టైల్స్ వ్యాపారానికి బంగ్లాదేశ్ కేంద్రంగా ఉంది. అయితే, ఇటీవల హింసాత్మక అల్లర్లు, రాజకీయ అస్థిరత అక్కడి పరిశ్రమపై ప్రభావం చూపిస్తోంది. బంగ్లాదేశ్ ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చే కొత్త ఆర్డర్లను నిలిపేసినట్లు తెలుస్తోంది.
Shiekh Hasina: రిజర్వేషన్ కోటా రద్దు ఆందోళనలు చివరకు బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్న షేక్ హసీనా పదవికి రాజీనామా చేసి, ఇండియా పారిపోయేలా చేశాయి. ప్రస్తుతం మహ్మద్ యూనస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. షేక్ హసీనా దేశం వదిలినప్పటి నుంచి బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆమెపై కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా షేక్ హసీనాతో పాటు ఆమె మాజీ కేబినెట్ మంత్రులు, సహాయకులపై మరో నాలుగు హత్య కేసులు నమోదు అయ్యాయని ఆదివారం మీడియా నివేదికలు తెలిపాయి.
Sheikh Hasina : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తిరుగుబాటు తర్వాత ఆమె భారత్లో ఆశ్రయం పొందారు. నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ నాయకత్వంలో అక్కడ మధ్యంతర ప్రభుత్వం ఏర్పడింది.