Shiekh Hasina: షేక్ హసీనాపై మరో 4 మర్డర్ కేసులు పెట్టిన బంగ్లాదేశ్..
- షేక్ హసీనాపై మరో నాలుగు మర్డర్ కేసులు..
- పదుల కొద్ది కేసులు పెడుతున్న బంగ్లాదేశ్..
- ఇప్పటికే ఆమెపై 55 కేసులు.. ఇందులో 44 మర్డర్ కేసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shiekh Hasina: రిజర్వేషన్ కోటా రద్దు ఆందోళనలు చివరకు బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్న షేక్ హసీనా పదవికి రాజీనామా చేసి, ఇండియా పారిపోయేలా చేశాయి. ప్రస్తుతం మహ్మద్ యూనస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. షేక్ హసీనా దేశం వదిలినప్పటి నుంచి బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆమెపై కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా షేక్ హసీనాతో పాటు ఆమె మాజీ కేబినెట్ మంత్రులు, సహాయకులపై మరో నాలుగు హత్య కేసులు నమోదు అయ్యాయని ఆదివారం మీడియా నివేదికలు తెలిపాయి.
2010లో అప్పటి బంగ్లాదేశ్ రైఫిల్స్(బీడీఆర్) అధికారి అబ్దుల్ రహీమ్ మృతిపై హసీనా, బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్ మాజీ డైరెక్టర్ జనరల్ అజీజ్ అహ్మద్తో పాటు మరో 11 మందిపై ఆదివారం హత్య కేసు నమోదైంది. 2010లో పిల్ఖానాలో జరిగిన మారణహోమంపై నమోదైన కేసులో మాజీ బీడీఆర్ డిప్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్ రహీమ్ నిందితుడిగా ఉన్నాడు. అదే ఏడాది జూలై 29న జైలు కస్టడీలో మరణించాడు. రహీమ్ కుమారుడు అడ్వకేట్ అబ్దుల్ అజీబ్ ఢాకా మేజిస్ట్రేట్ ముందు కేసు దాఖలు చేశారు.
Also Read
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల దాడితో, ఒక్క చోట చేరిన మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాదులు..
- Pakistan Cuts Petrol and Diesel Prices: పాక్లో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. వరుసగా రెండోసారి ఊరట
- Trump: భారత్ దెబ్బకు భయపడి అమెరికా కాళ్లబేరానికి పాక్.. ఆపరేషన్ సిందూర్ సీజ్ఫైర్పై ట్రంప్ సంచలన ప్రకటన..
- Hormuz Strait Crisis: పాక్ విఫలం.. 'హార్మూజ్' కోసం రంగంలోకి ఖతార్..!
Read Also: Kolkata Doctor Murder: మహిళా డాక్టర్పై అత్యాచారం ఘటనపై.. కోల్కతా గణేశ్ ఉత్సవ కమిటీ సంచలన నిర్ణయం
జూలై 18న వివక్ష వ్యతిరేక విద్యార్థి ఉద్యమంలో మిలిటరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (MIST) విద్యార్థిని హత్య చేసినందుకు హసీనాతో పాటు మరో 48 మందిపై ఆదివారం మరో హత్య కేసు నమోదైంది. బాధితుడు షేక్ అషాబుల్ యెమిన్ మామ అబ్దుల్లా అల్ కబీర్ ఢాకా సీనియర్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఎండీ సైఫుల్ ఇస్లాం కోర్టులో 49 మంది నిందితులపై కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. పిటీషన్ స్వీకరించిన కోర్టు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసుల్ని ఆదేశించింది. ఈ కేసులో అవామీ లీగ్ ప్రధాని కార్యదర్శి, రోడ్డు రవాణా, వంతెలన శాఖ మాజీ మంత్రి ఒబైదుల్ క్వాడర్, మాజీ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ తదితరులను నిందితుగా చేర్చారు.
ఇటీవల జరిగిన నిరసనల సందర్భంగా ఢాకాలలో బంగ్లాదేశ్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఉత్పత్తుల విక్రయదారుడి హత్యపై హసీనాతో పాటు మరో 27 మందిపై కేసులు నమోదైంది. బాధితుడిత తరుపున అతడి బావం కేసు నమోదు చేశారు. ఈ కేసులో అవామీ లీగ్ ప్రధాన కార్యదర్శి ఒబైదుల్ క్వాడర్ మరియు మాజీ మంత్రులు అనిసుల్ హుక్ , తాజుల్ ఇస్లాం నిందితులుగా ఉన్నారు. ఇటీవల జరిగిన నిరసనల సందర్భంగా రాజధానిలో ఆటో రిక్షా డ్రైవర్ను హత్య చేయడంపై హసీనా సహా 25 మందిపై మరో కేసు నమోదైంది.
ప్రస్తుతం షేక్ హసీనాపై 53 కేసులు నమోదయ్యాయి. ఇందులో 44 హత్యలు, ఏడు మానవత్వం, మారణహోమం కేసులు ఉన్నాయి. మరొకటి కిడ్నాప్, ప్రతిపక్ష బీఎన్పీ ఊరేగింపుపై దాడి కేసులు ఉన్నాయి. హసీనా ప్రభుత్వ పతనం తర్వాత దేశవ్యాప్తంగా చెలరేగిన హింసాత్మక సంఘటనలలో బంగ్లాదేశ్లో 230 మందికి పైగా మరణించారు. మొత్తంగా రిజర్వేషన్ కోటా విషయంలో మరణించిన వారి సంఖ్య 600కి పైగా మంది మరణించారు.
తాజావార్తలు
-
CM Chandrababu : వైద్య రంగంలో సరికొత్త విప్లవం ‘సంజీవని’.. ఇంటివద్దకే ఆధునిక వైద్యం.!
-
Pawan Kalyan: రూ.147 కోట్ల పనులపై డిప్యూటీ సీఎం సీరియస్.. ఆ ఎమ్మెల్యేకు కీలక ఆదేశాలు.!
-
Modi-Marco Rubio: ప్రధాని మోడీతో మార్కో రూబియో భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Pakistan: అజ్ఞాత వ్యక్తుల దాడితో, ఒక్క చోట చేరిన మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాదులు..
-
Kara: ధనుష్ ‘కర’ ఓటీటీ రిలీజ్ డేట్ను ఫిక్స్ ..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!