Shiekh Hasina: షేక్ హసీనాపై మరో 4 మర్డర్ కేసులు పెట్టిన బంగ్లాదేశ్..
- షేక్ హసీనాపై మరో నాలుగు మర్డర్ కేసులు..
- పదుల కొద్ది కేసులు పెడుతున్న బంగ్లాదేశ్..
- ఇప్పటికే ఆమెపై 55 కేసులు.. ఇందులో 44 మర్డర్ కేసులు..
Shiekh Hasina: రిజర్వేషన్ కోటా రద్దు ఆందోళనలు చివరకు బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్న షేక్ హసీనా పదవికి రాజీనామా చేసి, ఇండియా పారిపోయేలా చేశాయి. ప్రస్తుతం మహ్మద్ యూనస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. షేక్ హసీనా దేశం వదిలినప్పటి నుంచి బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆమెపై కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా షేక్ హసీనాతో పాటు ఆమె మాజీ కేబినెట్ మంత్రులు, సహాయకులపై మరో నాలుగు హత్య కేసులు నమోదు అయ్యాయని ఆదివారం మీడియా నివేదికలు తెలిపాయి.
2010లో అప్పటి బంగ్లాదేశ్ రైఫిల్స్(బీడీఆర్) అధికారి అబ్దుల్ రహీమ్ మృతిపై హసీనా, బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్ మాజీ డైరెక్టర్ జనరల్ అజీజ్ అహ్మద్తో పాటు మరో 11 మందిపై ఆదివారం హత్య కేసు నమోదైంది. 2010లో పిల్ఖానాలో జరిగిన మారణహోమంపై నమోదైన కేసులో మాజీ బీడీఆర్ డిప్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్ రహీమ్ నిందితుడిగా ఉన్నాడు. అదే ఏడాది జూలై 29న జైలు కస్టడీలో మరణించాడు. రహీమ్ కుమారుడు అడ్వకేట్ అబ్దుల్ అజీబ్ ఢాకా మేజిస్ట్రేట్ ముందు కేసు దాఖలు చేశారు.
Also Read
- Jeffrey Epstein: ఎప్స్టీన్ మిస్టరీలో మరో ట్విస్ట్.. ఏడేళ్లుగా దాచిన 'సూసైడ్ లేటర్'.. ప్రపంచ కుబేరులకు దడ!
- US: ముంచుకొస్తున్న ముప్పు.. ఇరాన్ను తుడిచిపెట్టేందుకు ట్రంప్ 'మాస్టర్ ప్లాన్' సిద్ధం!
- Imran Khan: 85% చూపు కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్.. వైద్య కారణాలతో విడుదల కోరుతూ కోర్టుకు అప్పీల్
- Mojtaba Khamenei: "సముద్ర గర్భంలో పాతిపెడతాం".. అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ స్ట్రాంగ్ వార్నింగ్..
Read Also: Kolkata Doctor Murder: మహిళా డాక్టర్పై అత్యాచారం ఘటనపై.. కోల్కతా గణేశ్ ఉత్సవ కమిటీ సంచలన నిర్ణయం
జూలై 18న వివక్ష వ్యతిరేక విద్యార్థి ఉద్యమంలో మిలిటరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (MIST) విద్యార్థిని హత్య చేసినందుకు హసీనాతో పాటు మరో 48 మందిపై ఆదివారం మరో హత్య కేసు నమోదైంది. బాధితుడు షేక్ అషాబుల్ యెమిన్ మామ అబ్దుల్లా అల్ కబీర్ ఢాకా సీనియర్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఎండీ సైఫుల్ ఇస్లాం కోర్టులో 49 మంది నిందితులపై కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. పిటీషన్ స్వీకరించిన కోర్టు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసుల్ని ఆదేశించింది. ఈ కేసులో అవామీ లీగ్ ప్రధాని కార్యదర్శి, రోడ్డు రవాణా, వంతెలన శాఖ మాజీ మంత్రి ఒబైదుల్ క్వాడర్, మాజీ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ తదితరులను నిందితుగా చేర్చారు.
ఇటీవల జరిగిన నిరసనల సందర్భంగా ఢాకాలలో బంగ్లాదేశ్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఉత్పత్తుల విక్రయదారుడి హత్యపై హసీనాతో పాటు మరో 27 మందిపై కేసులు నమోదైంది. బాధితుడిత తరుపున అతడి బావం కేసు నమోదు చేశారు. ఈ కేసులో అవామీ లీగ్ ప్రధాన కార్యదర్శి ఒబైదుల్ క్వాడర్ మరియు మాజీ మంత్రులు అనిసుల్ హుక్ , తాజుల్ ఇస్లాం నిందితులుగా ఉన్నారు. ఇటీవల జరిగిన నిరసనల సందర్భంగా రాజధానిలో ఆటో రిక్షా డ్రైవర్ను హత్య చేయడంపై హసీనా సహా 25 మందిపై మరో కేసు నమోదైంది.
ప్రస్తుతం షేక్ హసీనాపై 53 కేసులు నమోదయ్యాయి. ఇందులో 44 హత్యలు, ఏడు మానవత్వం, మారణహోమం కేసులు ఉన్నాయి. మరొకటి కిడ్నాప్, ప్రతిపక్ష బీఎన్పీ ఊరేగింపుపై దాడి కేసులు ఉన్నాయి. హసీనా ప్రభుత్వ పతనం తర్వాత దేశవ్యాప్తంగా చెలరేగిన హింసాత్మక సంఘటనలలో బంగ్లాదేశ్లో 230 మందికి పైగా మరణించారు. మొత్తంగా రిజర్వేషన్ కోటా విషయంలో మరణించిన వారి సంఖ్య 600కి పైగా మంది మరణించారు.
తాజావార్తలు
-
Top Selling CNG Cars: భారత్లో అత్యధికంగా సేల్ అయిన CNG కార్లు ఇవే..
-
IPL 2026 Playoffs Chances: రసవత్తరంగా ప్లేఆఫ్స్ రేస్.. గుజరాత్కు చిగురించిన ఆశలు, ఆ 5 టీమ్స్ ఇక ఇంటికేనా?
-
Jeffrey Epstein: ఎప్స్టీన్ మిస్టరీలో మరో ట్విస్ట్.. ఏడేళ్లుగా దాచిన ‘సూసైడ్ లేటర్’.. ప్రపంచ కుబేరులకు దడ!
-
TG DGP C.V. Anand: తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతల స్వీకరణ..
-
Tandur: తాండూరులో చేతబడి కలకలం.. కూతురు ప్రేమ విఫలం కావాలని తల్లి క్షుద్రపూజలు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!