Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రజలకు షేక్ హసీనా కీలక సందేశం
- బంగ్లాదేశ్ ప్రజలకు షేక్ హసీనా కీలక సందేశం
- ఆగస్టు 15న జాతీయ సంతాప దినాన్ని గౌరవప్రదంగా జరుపుకోవాలని పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్ ప్రజలకు మాజీ ప్రధాని షేక్ హసీనా కీలక సందేశం పంపించారు. ఆగస్టు 15న జాతీయ సంతాప దినాన్ని గౌరవప్రదంగా.. గంభీరంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు తన దేశస్థులకు విజ్ఞప్తి చేశారు. బంగబంధు భాబన్లో పూల దండలు సమర్పించి ప్రార్థించాలని కోరారు. ఆత్మలందరి మోక్షానికి ప్రార్థించాలని షేక్ హసీనా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు షేక్ హసీనా కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్ తన సోషల్ మీడియా ఎక్స్లో షేక్ హసీనా తరపున ఒక ప్రకటనను విడుదల చేశారు.
ఇది కూడా చదవండి: Lucknow Horror: విద్యార్థిని కిడ్నాప్.. కదులుతున్న కారులో అత్యాచారం..
Also Read
కోటా ఉద్యమం ఉధృతం కావడంతో బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. ఈ ఘటనలో వందిలాది మంది ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితులు చేదాటిపోవడంతో షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి భారత్కు వచ్చేశారు. ఇక్కడ నుంచి యూకేకు వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ సఫలీకృతం కాలేదు. దీంతో ఆమె భారత్లోనే ప్రస్తుతం బస చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం నోబెల్ గ్రహీత యూనస్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వం నుంచి హసీనాకు పిలుపువచ్చింది. దేశానికి రావాలని ఆహ్వానించారు. మరోవైపు హసీనాపై క్రిమినల్ కేసు నమోదైంది.
ఇది కూడా చదవండి: Kamikaze Drones: ప్రాణాంతక ‘‘ఆత్మాహుతి డ్రోన్ల’’ ఆవిష్కరణ.. స్వదేశీ టెక్నాలజీతో తయారీ..
ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ అల్లర్లతో తమకు సంబంధం లేదని అమెరికా వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ జీన్ ప్రియరీ ఖండించారు. ఇది బంగ్లాదేశ్ ప్రజలు ఎంచుకున్న నిర్ణయమని తెలిపారు. వారి భవిష్యత్ను నిర్ణయించుకునే అధికారం వారికే ఉందని తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. ఇది తప్ప ఇంకేమీ ఆరోపణలు వచ్చినా అవన్నీ అవాస్తవమేనని జీన్ ప్రియరీ స్పష్టం చేశారు.
బంగ్లాదేశ్ అల్లర్ల వెనుక అగ్ర రాజ్యం అమెరికా హస్తం ఉన్నట్లుగా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆరోపించారు. అమెరికాకు తలవంచకపోవడంతోనే ఈ సమస్య వచ్చినట్లుగా ఆమె పేర్కొన్నారు. షేక్ హసీనా ఆరోపణలు అంతర్జాతీయంగా పెను దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికా వైట్హౌస్ స్పందిస్తూ ఖండించింది.
Son of deposed Prime Minister of Bangladesh Sheikh Hasina, Sajeeb Wazed Joy releases a statement on behalf of Sheikh Hasina on his social media handle X.
…I appeal to you to observe the National Mourning Day on 15th August with due dignity and solemnity. Pray for the salvation… pic.twitter.com/b1qRgOP06r
— ANI (@ANI) August 13, 2024
తాజావార్తలు
-
Vinayakan: చిన్నారి ఫోటో పోస్ట్ వివాదం.. ‘జైలర్’ విలన్ వినాయకన్పై మరో కేసు
-
BCCI: టీమ్ ఇండియా కోచింగ్ టీమ్లో మార్పులు..! గంభీర్ సహాయకుల్లో ఇద్దరిని తొలగిస్తారా..?
-
Virat Kohli: లండన్లో ఆ ప్లేయర్తో విరాట్ సీక్రెట్ మీటింగ్.. రెండు గంటల్లోనే వైరల్ ఫొటోలు చూసి కోహ్లీ షాక్!
-
Wedding Fight: మటన్ పెడతామని ఒప్పుకొని.. చికెన్ పెడతారా?.. పెళ్లి విందులో పొట్టు పొట్టు తన్నుకున్న వైనం
-
Pawan Kalyan Health Update: పవన్ కల్యాణ్కు శస్త్రచికిత్స విజయవంతం.. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే..?
ట్రెండింగ్
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!