Bangladesh: భారత్తో సంబంధాలు తెంచుకుంటూ.. పాకిస్తాన్తో పెంచుకుంటున్న బంగ్లాదేశ్..
- పాకిస్తాన్తో సంబంధాలను పెంచుకుంటున్న బంగ్లాదేశ్..
- షేక్ హసీనా రాజీనామా తర్వాత ఇండియాతో తగ్గిన సంబంధాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్ నెమ్మనెమ్మదిగా పాకిస్తాన్కి దగ్గరవుతోంది. ఇండియాతో సంబంధాలను తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది. ఎప్పుడైతే షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి దిగిపోయిందో అప్పటి నుంచి బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఇస్లామిక్ మతోన్మాదులు చెలరేగిపోతున్నారు. నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ నేతృత్వంలో అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అయితే, నెమ్మదిగా యూనస్ ప్రభుత్వం పాకిస్తాన్తో సంబంధాలను పునరుద్ధరించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ(యూఎన్జీఏ) మీటింగ్ సందర్భంగా ఇరువురు నేతలు భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య సంబంధాలపై చర్చించారు.
Read Also: Israel-Iran War: ఇరాన్ చమురు, గ్యాస్ కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి చేయొచ్చంటూ వార్తా కథనాలు
Also Read
- అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
- Mahua Moitra: మహువా మొయిత్రాపై కోడిగుడ్లతో దాడి.. ఓ రెస్టారెంట్ దగ్గర ఘటన
- EPFO: ఖాతాదారులకు అలర్ట్.. మళ్లీ సేవలకు బ్రేక్.. కారణమిదే!
- Kejriwal: సనాతనం అంటే అధికారం.. డబ్బేనా? అయోధ్య స్కామ్లో బీజేపీపై కేజ్రీవాల్ విమర్శలు
ఇటీవల బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం తన విదేశాంగ విధానాన్ని మార్చుకునేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్తో పాటు ఆస్ట్రేలియా, బెల్జియం, పోర్చుగల్ రాయబారుల్ని వెనక్కి పిలిపించింది. ఇదే సమయంలో బంగ్లాదేశ్ నేషనల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ పాకిస్తాన్తో వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు, దిగుమతి చేసుకున్న వస్తువుల్ని తప్పనిసరిగా ఫిజికల్ చెకింగ్స్ చేయాలనే నిబంధనని తొలగించింది. బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి పత్తి, నూలు, రసాయనాలు, గోధుమలు, ప్లాస్టిక్ పదార్థాలు, తోలుతో సహా అనేక రకాల ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుంది. బియ్యం, పండ్లు, సర్జికల్ పరికరాలు, విద్యుత్ ఫ్యాన్ల కూడా దిగుమతి చేసుకునే వస్తువుల జాబితాలో ఉన్నాయి.
ఆగస్టులో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ అక్కడి విద్యార్థులు చేసిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, ఇండియాకి పారిపోయి వచ్చారు. అప్పటి నుంచి ఇండియాలోనే ఆశ్రయం పొందుతున్నారు. షేక్ హసీనా దిగిపోయిన తర్వాత భారత్ నమ్మకమైన మిత్రురాలిని కోల్పోయినట్లైంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువులు, ఇతర మైనారిటీలపై దాడులు పెరిగాయి. మరోవైపు పాకిస్తాన్ని, జిన్నాని పొగుడుతూ పలువురు నాయకులు సభలు ఏర్పాటు చేస్తున్నారు. బంగ్లాదేశ్ భారత్తో ఏకంగా 4000 కి.మీ పైగా భూభాగాన్ని పంచుకుంటోంది. పాకిస్తాన్తో దాని స్నేహం భారత్కి కొత్త తలనొప్పుల్ని తెచ్చే అవకాశం కనిపిస్తోంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
-
Netanyahu: నెతన్యాహు పీఠం కదులుతోంది.. ఇజ్రాయెల్ ప్రధానిని గద్దె దించేందుకు రంగంలోకి దిగిన మాజీ సైన్యాధిపతి!
-
PKCW : పవన్ కళ్యాణ్ తో కలిసి పని చేయాలనుకుంటున్నారా? ఆ క్రియేటివ్ వరల్డ్లోకి మీకూ ఎంట్రీ!
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
Mahua Moitra: మహువా మొయిత్రాపై కోడిగుడ్లతో దాడి.. ఓ రెస్టారెంట్ దగ్గర ఘటన
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!