Bangladesh: షేక్ హసీనా లగ్జరీ ప్యాలెస్.. ఇప్పుడు ‘‘విప్లవ మ్యూజియం’’..
- విప్లవ మ్యూజియంగా షేక్ హసీనా లగ్జరీ ప్యాలెస్..
- బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం కీలక నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్లోని షేక్ హసీనా ప్యాలెస్ ‘‘విప్లవ మ్యూజియం’’గా మారుతుందని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ సోమవారం తెలిపారు. హసీనాకు చెందిన విలాసవంతమైన ప్యాలెస్ నుంచి ఆమె పారిపోయేలా చేసిన విప్లవానికి గుర్తుగా ఈ మ్యూజియం మారుతుందని యూనస్ చెప్పారు. ఈ మ్యూజియంలో ఆమె దుర్మార్గమైన పరిపాలన, ఆమెను అధికారం నుంచి తొలగించిన ప్రజలు విప్లవాన్ని భద్రపరుస్తుందని చెప్పారు.
Read Also: Hyderabad: పోలీసుల అదుపులో సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్..
Also Read
- WHO Ebola Emergency: కాంగో, ఉగాండాలలో ఎబోలా వ్యాప్తి.. ఇంటర్నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ
- Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
- Australia: 61 మంది మహిళలపై పైశాచికత్వం! ఆస్ట్రేలియాలో భారత సంతతి చెందిన వ్యక్తికి 13 ఏళ్ల జైలు శిక్ష
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
రిజర్వేషన్ కోటాపై హింసాత్మక అల్లర్ల నేపథ్యంలో ఆగస్టు 5న షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చారు. ఆ తర్వాత తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహ్మద్ యూనస్ నియమితులయ్యారు. షేక్ హసీనా 15 ఏళ్ల పాలనలో ఆమె రాజకీయ ప్రత్యర్థుల సామూహిక నిర్భంధం, చట్టవిరుద్ధంగా హత్యలు, మానవహక్కుల ఉల్లంఘనలు జరిగాయని, ఇటీవల బంగ్లాదేశ్ కోర్టు ఆమెపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. హసీనా రాజీనామాకు ముందు పోలీసులు క్రూరమైన అణిచివేతలో 700 మందికి పైగా మరణించారు.
షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఆ దేశవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు జరిగాయి. ముఖ్యంగా మైనారిటీలు, హిందువుల్ని టార్గెట్ చేస్తూ దాడులు చేశారు. హిందువుల ఆలయాలు, ఇళ్లు, వ్యాపారాలను ధ్వంసం చేయడంతో పాటు పలు చోట్ల మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారు. ఇదిలా ఉంటే, మహ్మద్ యూనస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు ఉగ్రవాదుల్ని జైలు నుంచి విడుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. జమాతే ఇస్లామీ వంటి సంస్థలపై నిషేధాన్ని ఎత్తి వేశాడు.
తాజావార్తలు
-
Drumstick Curry Recipe: మధ్యాహ్న భోజనానికి స్పెషల్.. శనగపిండి – పెరుగు పులుసుతో టేస్టీ మునగకాయ కూర..
-
Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
-
NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
-
Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్మెన్గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
-
WHO Ebola Emergency: కాంగో, ఉగాండాలలో ఎబోలా వ్యాప్తి.. ఇంటర్నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..