Bangladesh: 15 రోజుల్లో బంగ్లాదేశ్ హిందువులపై 1000కి పైగా దాడులు..
- షేక్ హసీనా దిగిపోయిన తర్వాత హిందువులపై 1000కి పైగా దాడులు..
- ఆగస్టు 5-20 మధ్య దాడులు జరిగినట్లు అక్కడి మీడియా కథనం..
- హిందువులతో పాటు అహ్మదీయ ముస్లింలు.. క్రైస్తవులపై కూడా అటాక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్లో మైనారిటీలు, ముఖ్యంగా హిందువులపై దాడులు ఆగడం లేదు. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయినప్పటి నుంచి అక్కడ మైనారిటీలు, వారి వ్యాపారాలు, ఆలయాలు, చర్చ్ల మీద దాడులు జరగుతూనే ఉన్నాయి. 15 రోజుల్లో దేశంలోని 49 జిల్లాల్లో 1000కి పైగా దాడులు జరిగాయి. ఆగస్టు 5 నుంచి ఆగస్టు 20 వరకు మైనారిటీలపై మొత్తం 1068 దాడులు జరిగాయిని ఆ దేశంలోని ప్రముఖ వార్తాపత్రిక ప్రోథోమ్ అలో తెలిపింది. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చినప్పటి నుంచి బంగ్లాదేశ్లో హిందువులు లక్ష్యంగా దాడులు జరిగాయి. ఈ దాడుల్ని వీలైనంత త్వరగా ఆపేయాలని భారత్, బంగ్లాదేశ్ని కోరింది.
Read Also: Israel: ఇజ్రాయిల్పై విరుచుకుపడిన హిజ్బుల్లా.. రాకెట్లతో దాడి..
Also Read
- Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- Donald Trump : ‘మేక్ అమెరికా క్రిస్టియన్’.. అమెరికా రాజకీయాల్లో కొత్త ట్రెండ్.?
బంగ్లాదేశ్లో హిందువులు ఎక్కువగా దాడులకు గురయ్యానని నివేదికలు చెప్పాయి. 9 జిల్లాలు మరియు సబ్ డివిజన్లలో వారి ఇళ్ళు, వ్యాపారాలు మరియు ప్రార్థనా స్థలాలపై దాడులు జరిగాయి. నైరుతి డివిజన్లోని బంగ్లాదేశ్లోని ఖుల్నా జిల్లాల్లో చాలా దాడులు జరిగాయని వార్తాపత్రిక నివేదించింది.క్రైస్తవ మరియు అహ్మదీయ ముస్లిం సమాజంపై, ఇతర మైనారిటీలపై దాడులకు గురయ్యారు. ఠాకూర్గావ్లోని నిజపరా మిషన్లో మేరీ మాత విగ్రహాన్ని ధ్వంసం చేశారు మరియు అనేక మిషనరీ పాఠశాలలు మరియు కళాశాలలపై బెదిరింపులు మరియు దాడికి ప్రయత్నించారు.
ఇదిలా ఉంటే, షేక్ హసీనా ఈ దాడులకు బాధ్యత వహిస్తారని కొత్తగా ఏర్పడిన బంగ్లా ప్రభుత్వం చెబుతోంది. ఆమె అధికారంలో ఉన్న సమయంలో మైనారిటీలు, హిందువులు ఆమె పార్టీ అవామీలీగ్కి మద్దుతుగా ఉండటంతోనే వారిపై దాడులు జరిగాయని, ఈ దాడులను మతకోణంలో కాకుండా, రాజకీయ కోణంలో చూడాలని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ స్వయంగా అన్నారు. ఇదిలా ఉంటే ఈ దాడులపై పరిశోధన ప్రారంభించామని, మైనారిటీలపై విశ్వాసం కల్పించేందుకు మా వంతు ప్రయత్నాలు చేస్తున్నామని బంగ్లా ప్రభుత్వం చెబుతోంది.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!