Bangladesh: 15 రోజుల్లో బంగ్లాదేశ్ హిందువులపై 1000కి పైగా దాడులు..
- షేక్ హసీనా దిగిపోయిన తర్వాత హిందువులపై 1000కి పైగా దాడులు..
- ఆగస్టు 5-20 మధ్య దాడులు జరిగినట్లు అక్కడి మీడియా కథనం..
- హిందువులతో పాటు అహ్మదీయ ముస్లింలు.. క్రైస్తవులపై కూడా అటాక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్లో మైనారిటీలు, ముఖ్యంగా హిందువులపై దాడులు ఆగడం లేదు. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయినప్పటి నుంచి అక్కడ మైనారిటీలు, వారి వ్యాపారాలు, ఆలయాలు, చర్చ్ల మీద దాడులు జరగుతూనే ఉన్నాయి. 15 రోజుల్లో దేశంలోని 49 జిల్లాల్లో 1000కి పైగా దాడులు జరిగాయి. ఆగస్టు 5 నుంచి ఆగస్టు 20 వరకు మైనారిటీలపై మొత్తం 1068 దాడులు జరిగాయిని ఆ దేశంలోని ప్రముఖ వార్తాపత్రిక ప్రోథోమ్ అలో తెలిపింది. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చినప్పటి నుంచి బంగ్లాదేశ్లో హిందువులు లక్ష్యంగా దాడులు జరిగాయి. ఈ దాడుల్ని వీలైనంత త్వరగా ఆపేయాలని భారత్, బంగ్లాదేశ్ని కోరింది.
Read Also: Israel: ఇజ్రాయిల్పై విరుచుకుపడిన హిజ్బుల్లా.. రాకెట్లతో దాడి..
Also Read
- Donald Trump: 'మీరు వైట్ హౌస్ యజమాని కాదు'.. ట్రంప్కు అమెరికా కోర్టు బిగ్ షాక్..
- Doctors Continue Surgery: హ్యాట్సాఫ్.. భూకంపం వణికించినా.. పేషెంట్ ప్రాణాల కోసం కదలని వైద్యులు! వీడియో వైరల్..
- Tariff Risk: ట్రంప్ మరో షాక్.. భారత వస్తువులపై 100 శాతం టారిఫ్లు విధించేలా చట్టం
- Iran: పాక్, టర్కీతో ఒప్పందాలు రక్షించలేవు.. సౌదీకి ఇరాన్ వార్నింగ్..
బంగ్లాదేశ్లో హిందువులు ఎక్కువగా దాడులకు గురయ్యానని నివేదికలు చెప్పాయి. 9 జిల్లాలు మరియు సబ్ డివిజన్లలో వారి ఇళ్ళు, వ్యాపారాలు మరియు ప్రార్థనా స్థలాలపై దాడులు జరిగాయి. నైరుతి డివిజన్లోని బంగ్లాదేశ్లోని ఖుల్నా జిల్లాల్లో చాలా దాడులు జరిగాయని వార్తాపత్రిక నివేదించింది.క్రైస్తవ మరియు అహ్మదీయ ముస్లిం సమాజంపై, ఇతర మైనారిటీలపై దాడులకు గురయ్యారు. ఠాకూర్గావ్లోని నిజపరా మిషన్లో మేరీ మాత విగ్రహాన్ని ధ్వంసం చేశారు మరియు అనేక మిషనరీ పాఠశాలలు మరియు కళాశాలలపై బెదిరింపులు మరియు దాడికి ప్రయత్నించారు.
ఇదిలా ఉంటే, షేక్ హసీనా ఈ దాడులకు బాధ్యత వహిస్తారని కొత్తగా ఏర్పడిన బంగ్లా ప్రభుత్వం చెబుతోంది. ఆమె అధికారంలో ఉన్న సమయంలో మైనారిటీలు, హిందువులు ఆమె పార్టీ అవామీలీగ్కి మద్దుతుగా ఉండటంతోనే వారిపై దాడులు జరిగాయని, ఈ దాడులను మతకోణంలో కాకుండా, రాజకీయ కోణంలో చూడాలని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ స్వయంగా అన్నారు. ఇదిలా ఉంటే ఈ దాడులపై పరిశోధన ప్రారంభించామని, మైనారిటీలపై విశ్వాసం కల్పించేందుకు మా వంతు ప్రయత్నాలు చేస్తున్నామని బంగ్లా ప్రభుత్వం చెబుతోంది.
తాజావార్తలు
-
DC OTT Release: థియేటర్లలో ‘డీసీ’ హంగామా.. అప్పుడే ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్!
-
Producer Naga Vamsi: నిర్మాతల మధ్య గొడవలు ఎందుకు వస్తాయో చెప్పిన నాగవంశీ.. ఆ రోజులు పోయాయంటూ కామెంట్స్!
-
Mohammed Siraj: ఆటో డ్రైవర్ కొడుకు నుంచి స్టార్ బౌరల్, డీఎస్పీ వరకు.. హైదరాబాద్ ‘మియా భాయ్’ సక్సెస్ స్టోరీ!
-
iQOO Neo 11 Ultra: iQOO Neo 11 Ultra రిలీజ్ డేట్ ఫిక్స్.. 9000mAh బ్యాటరీ, Dimensity 9500, 16GB RAMతో!
-
Raveena Tandon: అందరూ చూస్తుండగానే.. స్టార్ నటి రవీనా టాండన్పై కుక్క అటాక్! చివరి క్షణంలో.. వీడియో వైరల్!
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!