Bangladesh: 15 రోజుల్లో బంగ్లాదేశ్ హిందువులపై 1000కి పైగా దాడులు..
- షేక్ హసీనా దిగిపోయిన తర్వాత హిందువులపై 1000కి పైగా దాడులు..
- ఆగస్టు 5-20 మధ్య దాడులు జరిగినట్లు అక్కడి మీడియా కథనం..
- హిందువులతో పాటు అహ్మదీయ ముస్లింలు.. క్రైస్తవులపై కూడా అటాక్స్..
Bangladesh: బంగ్లాదేశ్లో మైనారిటీలు, ముఖ్యంగా హిందువులపై దాడులు ఆగడం లేదు. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయినప్పటి నుంచి అక్కడ మైనారిటీలు, వారి వ్యాపారాలు, ఆలయాలు, చర్చ్ల మీద దాడులు జరగుతూనే ఉన్నాయి. 15 రోజుల్లో దేశంలోని 49 జిల్లాల్లో 1000కి పైగా దాడులు జరిగాయి. ఆగస్టు 5 నుంచి ఆగస్టు 20 వరకు మైనారిటీలపై మొత్తం 1068 దాడులు జరిగాయిని ఆ దేశంలోని ప్రముఖ వార్తాపత్రిక ప్రోథోమ్ అలో తెలిపింది. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చినప్పటి నుంచి బంగ్లాదేశ్లో హిందువులు లక్ష్యంగా దాడులు జరిగాయి. ఈ దాడుల్ని వీలైనంత త్వరగా ఆపేయాలని భారత్, బంగ్లాదేశ్ని కోరింది.
Read Also: Israel: ఇజ్రాయిల్పై విరుచుకుపడిన హిజ్బుల్లా.. రాకెట్లతో దాడి..
Also Read
- Mojtaba Khamenei: "సముద్ర గర్భంలో పాతిపెడతాం".. అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ స్ట్రాంగ్ వార్నింగ్..
- Mojtaba Khamenei: ‘‘దేవుడి దయతో అమెరికా లేని భవిష్యత్తు’’.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన..
- Iran War: ఇరాన్పై దాడికి అమెరికా సిద్ధం.. ట్రంప్ ముందు 3 ప్రణాళికలు..
- Pakistan: ట్రంప్ను మోసం చేస్తున్న పాకిస్తాన్.. ఎలాగంటే..
బంగ్లాదేశ్లో హిందువులు ఎక్కువగా దాడులకు గురయ్యానని నివేదికలు చెప్పాయి. 9 జిల్లాలు మరియు సబ్ డివిజన్లలో వారి ఇళ్ళు, వ్యాపారాలు మరియు ప్రార్థనా స్థలాలపై దాడులు జరిగాయి. నైరుతి డివిజన్లోని బంగ్లాదేశ్లోని ఖుల్నా జిల్లాల్లో చాలా దాడులు జరిగాయని వార్తాపత్రిక నివేదించింది.క్రైస్తవ మరియు అహ్మదీయ ముస్లిం సమాజంపై, ఇతర మైనారిటీలపై దాడులకు గురయ్యారు. ఠాకూర్గావ్లోని నిజపరా మిషన్లో మేరీ మాత విగ్రహాన్ని ధ్వంసం చేశారు మరియు అనేక మిషనరీ పాఠశాలలు మరియు కళాశాలలపై బెదిరింపులు మరియు దాడికి ప్రయత్నించారు.
ఇదిలా ఉంటే, షేక్ హసీనా ఈ దాడులకు బాధ్యత వహిస్తారని కొత్తగా ఏర్పడిన బంగ్లా ప్రభుత్వం చెబుతోంది. ఆమె అధికారంలో ఉన్న సమయంలో మైనారిటీలు, హిందువులు ఆమె పార్టీ అవామీలీగ్కి మద్దుతుగా ఉండటంతోనే వారిపై దాడులు జరిగాయని, ఈ దాడులను మతకోణంలో కాకుండా, రాజకీయ కోణంలో చూడాలని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ స్వయంగా అన్నారు. ఇదిలా ఉంటే ఈ దాడులపై పరిశోధన ప్రారంభించామని, మైనారిటీలపై విశ్వాసం కల్పించేందుకు మా వంతు ప్రయత్నాలు చేస్తున్నామని బంగ్లా ప్రభుత్వం చెబుతోంది.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!