Balineni Srinivasa Reddy Tweet Delete: మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. ఎక్స్ ( ట్విట్టర్)లో చేసిన ఓ పోస్టు.. మళ్లీ తీసివేశారు.. ఇప్పుడు ఆ పోస్టు గురించి చూస్తే కనిపించడం లేదు.. మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ జరుగుతున్న ప్రచారానికి ఉదయం చేసిన ట్వీట్తో పులిస్టాప్ పెట్టిన బాలినేని.. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో తాను, తన కుమారుడు ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. పోస్టు పెట్టారు..…
Pawan Kalyan – Balineni Meet: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో సమావేశమయ్యారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి.. తన కుమారుడు ప్రణీత్ రెడ్డితో కలిసి డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్తో భేటీ అవ్వడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ గంటన్నర చర్చల వెనుక బలమైన రాజకీయ సమీకరణాలు ఉన్నట్లు తెలుస్తోంది. Read Also: Story Board: డబ్బిస్తే..…
Off The Record: తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఇటీవల వరుసగా వివిధ నియోజకవర్గాల నేతలతో భేటీలు నిర్వహిస్తున్నారు పార్టీ అధ్యక్షుడు జగన్. ఈ క్రమంలోనే తాజాగా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తలు, ముఖ్య నేతలతో సమీక్షా సమావేశం పెట్టారు.ఈ సందర్బంగా రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలను వివరించి దిశానిర్దేశం చేశారాయన. అంతవరకు బాగానే ఉన్నా.. మీటింగ్ ప్రారంభంలో జగన్ చేసిన కామెంట్స్ చుట్టూ రకరకాల చర్చలు జరుగుతున్నాయి. వాటిని ఎవరికి నచ్చినట్టు వాళ్లు అన్వయించుకుంటూ ప్రచారం…
Off The Record: కూటమి అధికార భాగస్వామి జనసేనలో ఉన్నప్పటికీ ఎలాంటి పదవి లేకుండా, రాజకీయంగా కూడా వెయిటింగ్ మోడ్లోనే ఉన్న ఇద్దరు సీనియర్ నేతల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పెద్దగా మార్పేమీ లేకున్నా… ఉన్నట్టుండి వాళ్లు యాక్టివిటీ పెంచడం వెనకున్న రీజన్ ఏంటంటూ పార్టీ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి. ఒకప్పుడు తమ నియోజకవర్గాల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను. ఇప్పుడు జనసేనలో వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందనే…
Balineni Srinivasa Reddy: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం తీవ్ర వివాదంగా మారింది.. దీనిపై పాలక, ప్రతిపక్షాల మధ్య విమర్శలు, ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి.. తాజాగా, తిరుమల లడ్డూలో వాడిన నెయ్యి విషయంలో జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూలో ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని టీటీడీ మాజీ ఛైర్మన్ స్పష్టంగా చెప్పారని ఆయన పేర్కొన్నారు. అయితే, ఆ…
Hari Hara Veera Mallu flexis removed in Ongole: ప్రకాశం జిల్లా ఒంగోలులో మరోసారి ఫ్లెక్సీల రగడ రచ్చకెక్కింది. డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా సినిమా ‘హరిహర వీరమల్లు’ మూవీ ఫ్లెక్సీలను తొలగించారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఫోటోలతో హరిహర వీరమల్లు ఫ్లెక్సీలు ఒంగోలులో ఏర్పాటు చేశారు. బాలినేని ఫోటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించింది. ఫ్లెక్సీల తొలగింపును బాలినేని అనుచరులు తప్పుపట్టారు. మున్సిపల్…
ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాలతో పాటు ఏపీ పాలిటిక్స్లో కూడా పెద్దగా పరియం అక్కర్లేని పేరు బాలినేని శ్రీనివాసరెడ్డి. రాజకీయాల్లో మిస్టర్ కూల్ అన్న పేరుంది ఆయనకు. దాదాపు పది నెలల క్రితం వరకు ఆయన పొలిటికల్ లైఫ్ సాఫీగానే ఉన్నట్టు అనిపించింది.
బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య, పెండెం దొరబాబు.... అందరూ అందరే. అంతా సీనియర్ లీడర్సే. కొందరు రాష్ట్ర స్థాయిలో, కొందరు నియోజకవర్గంలో చక్రాలు తిప్పేసిన వారే. అంతకు ముందు వైసీపీలో ఉన్నప్పుడు వాయిస్ రెయిజ్ చేసిన వారే. కానీ... కాలం మారింది. పరిస్థితులు మారిపోయాయి.... సదరు లీడర్స్ స్వరాలు మూగబోయాయి. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఫుల్ వాల్యూమ్లో ఫ్యాన్ కిందినుంచి పక్కకు వచ్చేసి టీ గ్లాస్ పట్టుకున్నారు ఈ నేతలంతా.
తమ పార్టీ నుంచి వాళ్ల పార్టీకి బాలినేని అలిగి వెళ్ళారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. నేడు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. “నా ఆస్తులు నాశనం చేసుకున్నాను అంటారు.. జగన్ నా దోపిడీ చేసారు అని చెప్పటానికి సిగ్గులేదా.. పిఠాపురం సాక్షిగా అన్నీ నిజాలు చెబుతున్నా అని మాట్లాడారు.. బాలినేని, సాయిరెడ్డి ఇద్దరు జగన్ పక్కన ఉండి రాజకీయాలు చేయలేదా.. ఇలాంటి వాళ్ళను నమ్మి పవన్ కల్యాణ్ రాజకీయాలు చేస్తే ఇంక అంతే…
ప్రకాశం జిల్లా ఒంగోలు నగర పాలక సంస్థలో వైసీపీ కార్పొరేటర్ల మధ్య వార్ కొత్త టర్న్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు అందరూ వైసిపి కార్పొరేటర్లే అయినప్పటికీ ఎన్నికల అనంతర పరిణామాలతో మేయర్ సహా కొందరు కార్పొరేటర్లు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో పసుపు కండువాలు వేసుకున్నారు. తదనంతర పరిణామాలతో వైసీపీ కీలక నేతగా వ్యవహరించిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీని వీడి జనసేనలో చేరారు.