బాలీవుడ్ సినీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతికి సంబంధించిన డ్రగ్స్ కేసులో హీరోయిన్ రియా చక్రవర్తి బెయిల్పై ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు బెయిల్ పిటిషన్ పై చర్చలు జరిగాయి.. రియాకు మంజూరైన బెయిల్ను సవాలు చేయడం లేదని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇదీ ఆమెకు ఓ రకంగా శుభవార్తనే చెప్పవచ్చు. అయితే.. ఆమెపై ఇప్పటికే ఉన్న నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (ఎన్డిపిఎస్) చట్టంలోని సెక్షన్ 27-ఎకి…
మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు మధ్యంతర బెయిల్ లభించింది. రూ.25,000 వ్యక్తిగత పూచీకత్తుపై రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
గతంలో రద్దు చేసిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవకతవకలకు సంబంధించిన కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత మనీష్ సిసోడియా బెయిల్ అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు ఈరోజు తిరస్కరించింది.
తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ బెయిల్ పిటిషన్ పై నేడు తీర్పు వెలువడనుంది. ఈ రోజు మద్రాస్ ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు సెంథిల్ బాలాజీ బెయిల్ పిటిషన్ మరియు తనని కస్టడీలోకి తీసుకోవాలని ఎన్ఫోర్స్మెంట్ డైక్టరేట్(ఈడీ) అభ్యర్థన అనే రెండు పిటిషన్లపై తీర్పును ఇవ్వనుంది.
దేశ రాజధాని ఢిల్లీలోని మద్యం పాలసీలో జరిగిన కుంభకోణంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు ఈరోజు బెయిల్ నిరాకరించింది.
వైఎస్ వివేకా కేసులో ఏ1 నిందితుడైన ఎర్ర గంగిరెడ్డి బెయిల్ను తెలంగాణ హైకోర్టు గురువారం రద్దు చేసింది. వచ్చే నెల 5లోగో హైదరాబాద్ సీబీఐ కోర్టు ముందు లొంగిపోవాలని ఎర్ర గంగరెడ్డిని ఆదేశించింది. ఒకవేళ గంగిరెడ్డి లొంగిపోకపోతే అరెస్ట్ చేయవచ్చని సీబీఐకి తెలంగాణ హైకోర్టు సూచించింది.
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పిటీషన్ పై ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు షర్మిలకు బెయిల్ మంజూరు చేసింది. కానీ కొన్ని షరతులను ఈ సందర్బంగా కోర్టు సూచించింది. రూ.30 వేలు, ఇద్దరు పూచికత్తుతో బెయిల్ మంజూరు చేసింది. ఇక షర్మిల విదేశాలకు వెళ్లాలనుకుంటే కోర్టు అనుమతి తప్పనిసరని తెలిపింది.
బండి సంజయ్ లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. హనుమకొండ కోర్టు డాకెట్ ఆర్డర్ను సస్పెండ్ చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. అరెస్టు సమయంలో పోలీసులు 41ఎ నోటీసు జారీ చేయలేదని పేర్కొన్నారు.