Rhea Chakraborty: డ్రగ్స్ కేసులో హీరోయిన్కు ఊరట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ సినీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతికి సంబంధించిన డ్రగ్స్ కేసులో హీరోయిన్ రియా చక్రవర్తి బెయిల్పై ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు బెయిల్ పిటిషన్ పై చర్చలు జరిగాయి.. రియాకు మంజూరైన బెయిల్ను సవాలు చేయడం లేదని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇదీ ఆమెకు ఓ రకంగా శుభవార్తనే చెప్పవచ్చు. అయితే.. ఆమెపై ఇప్పటికే ఉన్న నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (ఎన్డిపిఎస్) చట్టంలోని సెక్షన్ 27-ఎకి సంబంధించిన చట్టాన్ని తెరిచే ఉంచాలని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు న్యాయమూర్తులు ఎఎస్ బోపన్న, ఎంఎం సుందరేష్లతో కూడిన ధర్మాసనానికి తెలిపారు.
NCB రియా చక్రవర్తిపై అక్రమ మాదకద్రవ్యాలతో పాటు అక్రమ రవాణాకు సంబంధించి ఫైనాన్సింగ్ చేయడమే కాకుండా అలాంటి వారికి ఆశ్రయం కల్పించడం వంటి వాటికి సంబంధించిన నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (ఎన్డిపిఎస్) చట్టంలోని కఠినమైన సెక్షన్ 27-ఎ కింద అభియోగాలు మోపింది. ఇది గరిష్టంగా 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు బెయిల్ మంజూరుపై నిషేధాన్ని కలిగి ఉంటుంది. అయితే.. చక్రవర్తి కేసులో డ్రగ్స్కు సంబంధంచి ఆమె ఫైనాన్సింగ్ లేదా ఆశ్రయం కల్పించినట్లు ఆధారాలు లేనందున సెక్షన్ 27-A వర్తించదని హైకోర్టు పేర్కొంది.
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
సుశాంత్ సింగ్ రాజ్పుత్ కోసం డ్రగ్స్ కొనుగోలులో డబ్బు ఖర్చు చేశారనే ఆరోపణలపై ఆమె అక్రమ రవాణాకు ఆర్థిక సహాయం చేసిందని అర్థం కాదు అని పిటిఐ హైకోర్టును ఉటంకిస్తూ పేర్కొంది. చట్టం కింద వివరించిన విధంగా నేరస్థుడికి ఆశ్రయం కల్పించడం అంటే ఆ వ్యక్తికి మాదకద్రవ్యాల వినియోగం కోసం డబ్బును అందించడంతోపాటు అతనికి ఆశ్రయం, ఆహారం కూడా అందించడం అని కూడా పేర్కొంది..1 లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ, చక్రవర్తికి నేర చరిత్రలు లేవని, ఆమె బెయిల్పై బయట ఉన్నప్పుడు సాక్ష్యాలను తారుమారు చేయడం లేదా దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం లేదని హైకోర్టు తన ఉత్తర్వుల్లో గమనించింది. అయితే, చక్రవర్తి కేసులో, ఫైనాన్సింగ్ లేదా ఆశ్రయం (డ్రగ్స్ లేదా దాని వినియోగదారులకు) లేనందున, సెక్షన్ 27-A వర్తించదని హైకోర్టు పేర్కొంది.. సుశాంత్ సింగ్ రాజ్పుత్, 34, జూన్ 14, 2020న సబర్బన్ బాంద్రాలోని తన అపార్ట్మెంట్లో ఉరివేసుకుని కనిపించాడు. చక్రవర్తిపై రాజ్పుత్ తల్లిదండ్రులు ఆత్మహత్యకు ప్రేరేపించారని ఆరోపించిన కేసు నమోదు చేసిన తర్వాత, ఆమె డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు ఆరోపణలపై దర్యాప్తు కూడా ప్రారంభమైంది. ఆ తర్వాత ఆమె నెల రోజులు రిమాండ్ లో ఉండి విడుదలైంది..
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?