ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా అయతుల్లా అలీ ఖమేనీ కుమారుడు మోజ్తబా అలీ ఖమేనీ (56) ఎన్నికయ్యారు. 80 మందితో కూడిన పండితుల కమిటీ మోజ్తబా పేరును ఆమోదించినట్లుగా ఇరాన్ మీడియా పేర్కొంది.
Israel-Iran War: ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ లక్ష్యంగా ఇజ్రాయిల్ అమెరికాలు సంయుక్తంగా దాడులు ప్రారంభించాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్, ఇతర నగరాలపై ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేసింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా దాడులు చేస్తోంది. మధ్యప్రాచ్యంలోని
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. శనివారం తొలుత ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా క్షిపణులతో విరుచుకుపడ్డాయి. ఇరాన్ అధ్యక్ష భవనంతో సహా అనేక ప్రాంతాల్లో బాంబ్ పేలుళ్లు సంభవించాయి. ఈ దాడుల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది.
బెదిరించినట్టుగానే ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టాయి. శనివారం ఇరాన్పై భీకర దాడులకు దిగాయి. టెహ్రాన్లో అధ్యక్షుడి కార్యాలయం సహా ఇరాన్ వైమానిక స్థావరాలు లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడి దాడులు ప్రారంభించాయి.
మధ్యప్రాచ్యంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన రెండో విడత అణు చర్చలు కూడా విఫలమయ్యాయి. దీంతో రెండు దేశాల మధ్య సవాళ్లు-ప్రతి సవాళ్లు జరుగుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య మంగళవారం కీలక చర్చలు జరగనున్నాయి. మరోసారి అణు ఒప్పందంపై రెండు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఇరు దేశాల మధ్య మంగళవారం చర్చలు జరగనున్నాయి.
ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్పై దాడికి అమెరికా సిద్ధమవుతోంది. అణు ఒప్పందం చేసుకోకపోతే దాడి జరగడం ఖాయమని ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు.
Iran: దేశ వ్యాప్తంగా చెలరేగుతున్నఆందోళనల్ని ఇరాన్ అణచివేయాలని చూస్తోంది. అయతొల్లా అలీ ఖమేనీ మతపాలనకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు ఉద్యమిస్తున్నారు. వందలాది మంది ఇప్పటికే మరణించారు. అయితే, ఈ నిరసనలతో సంబంధం ఉన్నవారిని అక్కడి ప్రభుత్వ కఠినంగా శిక్షించేందుకు సిద్ధమైంది. తాజాగా, మొదటి ఉరిశిక్షను అమలు చేయాడానికరి ఇరాన్ అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 26 ఏళ్ల ఎర్ఫాన్ సొల్తానీకి త్వరలో మరణశిక్ష అమలు చేయనున్నారు.
ఇరాన్లో సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. టెహ్రాన్లో పరిపాలనా భవనం దగ్గరకు నిరసనకారులు రావడంతో భద్రతా దళాలు కాల్పులకు తెగబడ్డారు. దీంతో 16 మంది ఆందోళనకారులు మృతిచెందారు.