Botsa Satyanarayana: కూటమి ప్రభుత్వానికి జగన్ ఫోబియా పట్టుకుంది.. బొత్స సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana: మెడికల్ కాలేజీల ఏర్పాటు పేద వాని వైద్యానికి సంబంధించినదని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తాజాగా విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నామన్నారు.. పేదవాడి ఆరోగ్య విషయంలో రాజీపడమన్నారు.. కూటమి ప్రభుత్వానికి జగన్ ఫోబియా పట్టుకుందని తెలిపారు.. ఇంకా ఎన్ని రోజులు జగన్ పేరు చెబుతూ బతుకుతారని ప్రశ్నించారు. కురుపాంలో 39 మంది విద్యార్థులు పచ్చ కామెర్లతో బాధపడుతున్నారని గుర్తు చేశారు. అందులో ఇద్దరు
మరణించారన్నారు..
Also Read
కూటమి ప్రభుత్వానికి పర్యవేక్షణ కొరవడిందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. “అశోక్ గజపతిరాజు జెనెటిక్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. అశోక్ గజపతిరాజుకు అహం ఎక్కువ. సింహాచలంలో ఆరుగురు భక్తులు మరణిస్తే కనీసం అశోక్ గజపతిరాజు పరామర్శించారా.. ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేరాలు, హత్యలు హత్యాచారాలు పెరిగిపోయాయి. మా హయాంలో ఎన్ని నేరాలు జరిగాయి, ఏడాదిన్నరగా కూటమి పాలనలో ఎన్ని జరిగాయో లెక్కేసుకోండి.. మా ఐదేళ్ల పాలన కంటే, కూటమి ఏడాదిన్నర పాలనలో తక్కువ నేరాలు జరిగాయి అంటే నేను తలదించుకుంటాను. అమ్మవారి పండుగను రాజకీయం చేయడం తగదు. కిమిడి నాగార్జున చరిత్ర చెపితే టీడీపీనే ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తుంది.” అని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Ketan Agarwal: కేతన్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చేతులెత్తేసిన పోలీసులు!
-
Patna High Court: ‘‘సల్వార్ తీయడం, ఛాతీ నొక్కడం’’.. రేప్ అటెంప్ట్ కేసుపై హైకోర్టు కీలక తీర్పు..
-
Income Tax Notice: ఇదెక్కడి పాపం.. రోజుకు రూ.400 సంపాదించే కూలీకి ఐటీ శాఖ షాక్! అసలు ట్విస్ట్ ఇదే
-
SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
-
IRCTC: రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. ఇక వేగంగా తత్కాల్!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!