ఢిల్లీ అసెంబ్లీ ఎన్ని్కల్లో అధికార పార్టీ ఆప్-బీజేపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. నువ్వానేనా? అన్నట్టుగా రెండు పార్టీల మధ్య ఫైటింగ్ నడుస్తోంది. ఇక బీజేపీ అయితే కేజ్రీవాల్ టార్గెట్గా దాడి చేస్తోంది.
AAP vs BJP: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఢిల్లీ పాలిటిక్స్ హీటెక్కాయి. ఆప్, బీజేపీ పరస్పర విమర్శలకు దిగాయి. ఈ సమయంలో ‘ ముఖ్యమంత్రి బంగ్లా’ వివాదం రాజకీయ దుమారానికి దారి తీసింది. ఈ బంగ్లాను ‘శీష్ మహల్ అంటూ భారతీయ జనతా పార్టీ చేస్తోన్న విమర్శలను ఆమ్ ఆద్మీ పార్టీ తిప్పికొడుతుంది.
ఈ రోజు (జనవరి 7) అధికార పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను 'చునావి (ఎన్నికల) ముసల్మాన్' అనే క్యాప్షన్ తో సోషల్ మీడియాలో పోస్టర్తో విడుదల చేసింది.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని బహిరంగంగా ప్రశంసించారు. ఒక వైపు, కేజ్రీవాల్ నితిన్ గడ్కరీని మెచ్చుకుంటూ.. మరోవైపు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్వచ్ఛమైన సిద్ధాంతం గల నాయకుడని అభివర్ణించారు. కాంగ్రెస్, బీజేపీలు అవినీతిపరులని తరచూ చెప్పే కేజ్రీవాల్ ఇతర పార్టీల నేతలను ఈ విధంగా పొగిడటం చాలా అరుదు.
త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. అందంగా అలంకరించిన గుర్రంపై వరుడు లేని వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ.. బీజేపీ ఇంకా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదని విమర్శించింది.
Arvind Kejriwal: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో ఒక్కసారిగా అక్కడి రాజకీయ వాతావరణం మారిపోయింది. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ, మరోసారి అధికారం చేపట్టాలని ఆప్, సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయాలు హీటెక్కాయి. త్వరలో జరగనున్న అసెంబ్లీ పోల్స్కి అన్ని పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ ఆప్.. అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా బీజేపీ 29 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది.
Arvind Kejriwal: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళా ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరో హామీ ఇచ్చారు. ఢిల్లీలో మరోసారి అధికారంలోకి రాగానే మంచి నీటి బిల్లులను మాఫీ చేస్తామని తెలిపారు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినట్లు కనిపిస్తోంది. ఈ రోజు ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్పై విరుచుకుపడ్డారు. ఆప్ అన్ని రంగాల్లో అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి నివాసం కోసం అరవింద్ కేజ్రీవాల్ ‘‘శీష్ మహల్’’ని విలాసవంతంగా నిర్మించారు.
BJP- AAP Poster War: దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఓటర్లను ఆకర్షించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ వినూత్న ప్రచారానికి తెర లేపాయి.