Kejriwal: కంగ్రాట్స్.. మీరే ఢిల్లీ సీఎం అభ్యర్థి! బీజేపీ నేతకు కేజ్రీవాల్ విషెస్
- కంగ్రాట్స్.. మీరే ఢిల్లీ సీఎం అభ్యర్థి!
- బీజేపీ నేతకు కేజ్రీవాల్ విషెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ ఆప్-బీజేపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. నువ్వానేనా? అన్నట్టుగా రెండు పార్టీల మధ్య ఫైటింగ్ నడుస్తోంది. ఇక బీజేపీ అయితే కేజ్రీవాల్ టార్గెట్గా దాడి చేస్తోంది. తాజాగా సీఎం అతిషిని కూడా లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ సీఎం అభ్యర్థి రమేష్ బిధురికి కంగ్రాట్స్ అంటూ వ్యాఖ్యానించారు. కాబోయే బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి మీరేనని తెలిసింది. త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని తెలుస్తోంది. అందుకే ముందుగా మీకు కంగ్రాట్స్ చెబుతున్నట్లు తెలిపారు. తమ దగ్గర పక్కా సమాచారం ఉందని.. రెండు, మూడు రోజుల్లో అధికారిక ప్రకటన రావొచ్చని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Delhi Assembly Elections: బీజేపీ రెండో జాబితా విడుదల.. ఎవరెవరికి చోటు దక్కిందంటే?
Also Read
- Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. పార్టీ సీఎం అభ్యర్థి మీరే.. ఎంపీగా ఉండి ఢిల్లీకి ఏం చేశారో కాస్త చెప్పాలని రమేష్ బిధురిని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఢిల్లీ అభివృద్ధిలో మీ భాగస్వామ్యం ఎంత? ఎంపీగా ఉన్నంత కాలం ఢిల్లీకి ఏం చేశారు.. మీ విజన్ ఏంటో చెప్పాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. అధికారికంగా బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఢిల్లీ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ రమేష్ను కేజ్రీవాల్ ప్రశ్నించారు.
రమేష్ బిధూరి సీనియర్ రాజకీయ నాయకుడు. తుగ్లకాబాద్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా, దక్షిణ ఢిల్లీ లోక్సభ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 2024 లోక్సభ ఎన్నికల్లో సీటు లభించలేదు. ప్రస్తుతం సీఎం అతిషి పోటీ చేస్తున్న కల్కాజీ నియోజకవర్గం నుంచి రమేష్ బిధూరి బరిలోకి దిగారు. ఇదే స్థానం నుంచి కాంగ్రెస్ తరపున అల్కా లంబా పోటీలో ఉన్నారు.
ఢిల్లీలో ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి. ఇక్కడ ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బరిలో ఉన్నాయి. ఈ మూడు పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. మరోసారి అధికారం కోసం ఆప్ ప్రయత్నిస్తుండగా.. అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఈ పోరులో ఎవరు గెలుస్తారో చూడాలి.
ఇది కూడా చదవండి: Jio Free YouTube Premium Subscription: జియో యూజర్స్కు పండగే.. రెండేళ్ల వరకు ఆ సేవలు ఫ్రీ!
తాజావార్తలు
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
IRGC attack US 5th Fleet: ఇరాన్ ప్రతీకారం.. అమెరికా 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై IRGC దాడి!
-
Ruturaj Gaikwad: సెంచరీ వెనుక సీక్రెట్ ఇదే.. రుతురాజ్ గైక్వాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
-
Pakistan Airstrikes Afghanistan: ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 13 మంది మృతి
ట్రెండింగ్
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?