Kejriwal: కంగ్రాట్స్.. మీరే ఢిల్లీ సీఎం అభ్యర్థి! బీజేపీ నేతకు కేజ్రీవాల్ విషెస్
- కంగ్రాట్స్.. మీరే ఢిల్లీ సీఎం అభ్యర్థి!
- బీజేపీ నేతకు కేజ్రీవాల్ విషెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ ఆప్-బీజేపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. నువ్వానేనా? అన్నట్టుగా రెండు పార్టీల మధ్య ఫైటింగ్ నడుస్తోంది. ఇక బీజేపీ అయితే కేజ్రీవాల్ టార్గెట్గా దాడి చేస్తోంది. తాజాగా సీఎం అతిషిని కూడా లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ సీఎం అభ్యర్థి రమేష్ బిధురికి కంగ్రాట్స్ అంటూ వ్యాఖ్యానించారు. కాబోయే బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి మీరేనని తెలిసింది. త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని తెలుస్తోంది. అందుకే ముందుగా మీకు కంగ్రాట్స్ చెబుతున్నట్లు తెలిపారు. తమ దగ్గర పక్కా సమాచారం ఉందని.. రెండు, మూడు రోజుల్లో అధికారిక ప్రకటన రావొచ్చని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Delhi Assembly Elections: బీజేపీ రెండో జాబితా విడుదల.. ఎవరెవరికి చోటు దక్కిందంటే?
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
- Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
- 1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. పార్టీ సీఎం అభ్యర్థి మీరే.. ఎంపీగా ఉండి ఢిల్లీకి ఏం చేశారో కాస్త చెప్పాలని రమేష్ బిధురిని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఢిల్లీ అభివృద్ధిలో మీ భాగస్వామ్యం ఎంత? ఎంపీగా ఉన్నంత కాలం ఢిల్లీకి ఏం చేశారు.. మీ విజన్ ఏంటో చెప్పాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. అధికారికంగా బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఢిల్లీ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ రమేష్ను కేజ్రీవాల్ ప్రశ్నించారు.
రమేష్ బిధూరి సీనియర్ రాజకీయ నాయకుడు. తుగ్లకాబాద్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా, దక్షిణ ఢిల్లీ లోక్సభ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 2024 లోక్సభ ఎన్నికల్లో సీటు లభించలేదు. ప్రస్తుతం సీఎం అతిషి పోటీ చేస్తున్న కల్కాజీ నియోజకవర్గం నుంచి రమేష్ బిధూరి బరిలోకి దిగారు. ఇదే స్థానం నుంచి కాంగ్రెస్ తరపున అల్కా లంబా పోటీలో ఉన్నారు.
ఢిల్లీలో ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి. ఇక్కడ ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బరిలో ఉన్నాయి. ఈ మూడు పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. మరోసారి అధికారం కోసం ఆప్ ప్రయత్నిస్తుండగా.. అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఈ పోరులో ఎవరు గెలుస్తారో చూడాలి.
ఇది కూడా చదవండి: Jio Free YouTube Premium Subscription: జియో యూజర్స్కు పండగే.. రెండేళ్ల వరకు ఆ సేవలు ఫ్రీ!
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..