ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహిళా ఓటర్లను ప్రలోభపెట్టే పనిలో పడ్డారు. 'ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన' అమలును ఇటీవలే ప్రకటించిన అరవింద్ కేజ్రీవాల్.. ఒక సర్వేను ఉటంకిస్తూ, ఢిల్లీలోని 60 శాతం మంది మహిళలు తనకు ఓటు వేయబోతున్నారని, 40 శాతం మంది తనకు అనుకూలంగా లేరని అన్నారు.
Kejriwal: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో నేరాలు క్రమంగా పెరిగిపోతున్నాయని మాజీ సీఎం, ఆమ్ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు. ఢిల్లీలో నెలకొన్న పరిస్థితిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.
రాబోయే ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ సొంత బలంతోనే ముందుకు వెళ్లనుందని ఆప్ చీఫ్ క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే ఛాన్స్ లేదని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు.
దేశ రాజధాని ఢిల్లీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు మూడు జాతీయ పార్టీలకు ఎంతో ప్రతిష్టాత్మకమైనవి. దీంతో ప్రధాన పార్టీలు సన్నద్ధం అయిపోతున్నాయి. అంతేకాకుండా ఇప్పటినుంచే మాటల-తూటాలు పేల్చుకుంటున్నాయి.
ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు కేంద్రం గుడ్న్యూస్ చెప్పింది. త్వరలో ప్రభుత్వ క్వార్టర్ కేటాయిస్తామని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ప్రస్తుతం అన్ని రకాల బంగ్లాలు నిండిపోయి ఉన్నాయని చెప్పారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ, అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య మరోసారి పోస్టర్ వార్ మొదలైంది. ఈ రాజకీయ పోరులో ఇరు రాజకీయ పార్టీల నుంచి ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. బీజేపీ తన పోస్టర్లలో 'ఆప్' కుంభకోణాలను బయటపెట్టడంలో బిజీగా ఉంది. అదే సమయంలో ఆప్ కూడా 'పుష్ప' తరహాలో బీజేపీపై విరుచుకుపడింది.
Arvind Kejriwal: హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం ఇండియా కూటమిలో లుకలుకలకు కారణమవుతోంది. ఇతర మిత్ర పక్షాలు కాంగ్రెస్ వైఖరిని తప్పుబడుతున్నాయి. ఇప్పటికే మమతా బెనర్జీ టీఎంసీ పార్టీ పార్లమెంట్లో కాంగ్రెస్ విధానంపై మండిపడుతోంది. సభని సరిగా జరగనివ్వాలని కోరుతోంది.
Arvind Kejriwal: ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్పై ఓ వ్యక్తి దాడికి ప్రయత్నించాడు. లిక్విడ్ పోసేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు.
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ రాజధానిలో శాంతిభద్రతల పరిస్థితిపై ప్రశ్నలు లేవనెత్తారు. కేంద్రంపై విరుచుకుపడ్డారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ఏడాదిన్నర కాలంలో ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితి దిగజారిందన్నారు. రాజధానిలో మహిళలపై జరుగుతున్న గ్యాంగ్ వార్, దోపిడీ, నేర ఘటనలు హృదయాన్ని కలచివేస్తున్నాయని ఆవేదన చెందారు.
ఢిల్లీలో మరో 80 వేల మంది వృద్ధులకు నెలకు రూ.2000 పెన్షన్ ఇవ్వనున్నట్లు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ప్రకటించారు. ఇందుకోసం 24 గంటల్లోనే 10 వేల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. తాను ఎక్కడికి వెళ్లినా పింఛను ప్రారంభించాలని వృద్ధులు కోరేవారని కేజ్రీవాల్ చెప్పారు.