Arvind Kejriwal: ఢిల్లీలో ఆప్ అధికారంలోకి రాగానే మంచి నీటి బిల్లులను మాఫీ చేస్తాం..
- ఢిల్లీలో మరోసారి అధికారంలోకి రాగానే మంచి నీటి బిల్లులను మాఫీ చేస్తాం..
- కాంగ్రెస్- బీజేపీ పార్టీలు లోపాయికార ఒప్పందంతో పోటీ చేస్తున్నాయి..
- ఢిల్లీ అభివృద్ధిపై బీజేపీకి విజన్ లేదు.. కాంగ్రెస్ను ప్రజలు సీరియస్గా తీసుకోవడం లేదు: కేజ్రీవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళా ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరో హామీ ఇచ్చారు. ఢిల్లీలో మరోసారి అధికారంలోకి రాగానే మంచి నీటి బిల్లులను మాఫీ చేస్తామని తెలిపారు. తప్పుడు మంచినీటి బిల్లులను మాఫీ చేస్తామని చెప్పుకొచ్చారు. ప్రతినెలా 20 వేల లీటర్ల ఉచిత మంచి నీరు అందిస్తున్నాం.. ఇది12 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది అని చెప్పారు. ఇక, తాను జైల్లో ఉన్నప్పుడు ఢిల్లీ ప్రజలకు తప్పుడు నీటి బిల్లులు ఇచ్చారని ఆయన ఆరోపించారు. ఆ నీటి బిల్లును చూసి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.. ఎవరి బిల్లు అయితే తప్పుగా వచ్చిందని భావిస్తున్నారో.. వారు నీటి బిల్లులు కట్టాల్సిన అవసరం లేదు అని తేల్చి చెప్పారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ రావడం ఖాయం, అధికారంలోకి రాగానే తప్పుడు బిల్లులను మాఫీ చేస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.
Read Also: Kamala Harris: ప్రతిజ్ఞ చేస్తూ తడబడిన కమలా హారిస్.. నెట్టింట తీవ్ర విమర్శలు
Also Read
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
ఇక, కాంగ్రెస్, బీజేపీ కలిసి ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా..? లేదా అనేది ప్రజలకు చెప్పాలని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. లోపాయికార ఒప్పందంతో రెండు పార్టీలు పోటీ చేస్తున్నాయి.. బీజేపీకి ఢిల్లీ సీఎం అభ్యర్థి ఎవరో తెలియదు.. ఢిల్లీ అభివృద్ధిపై బీజేపీకి విజన్ లేదు.. ఆమ్ ఆద్మీ పార్టీని దూషించి ఎన్నికల్లో గెలవాలని భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది అన్నారు. తాము అధికారంలో ఉన్న పదేళ్లలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాం.. మా పనిని చూసి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.. వచ్చే ఐదేళ్లలో ఏ పనులు చేస్తామో కూడా చెప్పి ఓటు అడుగుతున్నాం.. ఇక, ప్రజలు కాంగ్రెస్ ను సీరియస్ గా తీసుకోవడం లేదు అని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
-
Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్పై కన్నీళ్లు పెట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ దర్శకుడు!
-
Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
-
Rahul Gandhi: ‘ప్రభుత్వాన్ని తొలగించండి’ అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
-
Story Board : దేశ ప్రజల స్వరం మారుతోంది..కేంద్రంపై అసంతృప్తి ,ఆవేశం మరింత రాజుకుంటే…
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!