BJP- AAP Poster War: ఢిల్లీలో హీటెక్కిన పాలిటిక్స్.. బీజేపీ- ఆమ్ ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య పోస్టర్ ఫైట్
- దేశ రాజధాని ఢిల్లీలో హీటెక్కిన పాలిటిక్స్..
- కేజ్రీవాల్ ఒకే అడ్రస్లో వందల సంఖ్యలో బోగస్ ఓట్లు చేర్చారని బీజేపీ పోస్ట్..
- గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్టైమ్ (గోట్) అనే పోస్టర్ తో బీజేపీకి ఆప్ కౌంటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP- AAP Poster War: దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఓటర్లను ఆకర్షించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ వినూత్న ప్రచారానికి తెర లేపాయి. ఒకరి లోపాలను మరొకరు ఎత్తి చూపుతూ, హామీల వర్షం కురిపిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో బీజేపీ రిలీజ్ చేసిన పోస్టర్కు ఆప్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చిపడేసింది. ఇక, ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం కేజ్రీవాల్ ఒకే అడ్రస్లో వందల సంఖ్యలో బోగస్ ఓట్లు చేర్చారని బీజేపీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా విమర్శించింది. ఇంటి యజమానికి తెలియకుండా నకిలీ ఓట్లను రిజిస్టర్ చేస్తున్నారని ఆరోపించింది. ఇది కేజ్రీవాల్ కొత్త గేమ్ అంటూ తీవ్రంగా మండిపడింది. ఆప్కు నకిలీ ఓటర్లపై ప్రేమ అనే మీనింగ్ వచ్చేలా ఒక పోస్టర్ను నెట్టింట షేర్ చేసింది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ కౌంటర్ ఎటాక్ కు దిగింది. ఆ విమర్శను తిప్పి కొడుతూ ‘గోట్’ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్టైమ్) అంటూ కేజ్రీవాల్ ఉన్న మరో పోస్టర్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Read Also: Akash Deep: సిడ్నీ టెస్టు నుండి టీమిండియా ఫాస్ట్ బౌలర్ అవుట్..
Also Read
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
ఇక, ఇదిలాఉంటే.. ఢిల్లీలో ఓటర్లకు బీజేపీ నగదు పంపిణీ చేస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తుంది. ఈ మేరకు ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు మోహన్ భగవత్కు అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. కమలం పార్టీ చేస్తున్న తప్పులను ఆర్ఎస్ఎస్ ఆమోదిస్తుందా? అని అందులో క్వశ్చన్ చేశారు. ఈ లేఖపై బీజేపీ రియాక్ట్ అవుతూ.. ఇలా మీడియా దృష్టిని ఆకర్షించాడానికి ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడికి లేఖ రాయడానికి బదులు ఆ సంస్థ నుంచి సేవా స్ఫూర్తిని నేర్చుకోవాలని కేజ్రీవాల్కు సూచించారు.
Read Also: Mythri Movie Makers : పుష్పా-2 నిర్మాతలకు హై కోర్టులో ఊరట
అయితే, దేశ రాజకీయాల్లోనే ఆమ్ ఆద్మీ పార్టీ అవిశ్వసనీయ పార్టీకి ఉదాహరణ అని.. దీనిని ప్రజలు అర్థం చేసుకున్నారని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది విమర్శలు గుప్పించారు. అబద్ధాలు చెప్పడం మానుకోవడానికి కొత్త సంవత్సరం రోజున కేజ్రీవాల్ తీర్మానించుకోవాలని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ ఆప్ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు మరో లేఖ రాశారు. దీంతో ఇరు పార్టీల మధ్య సోషల్ మీడియా వేదికగా ఫైట్ కొనసాగుతుంది.
दिल्ली में केजरीवाल का नया खेल! वोटों का फर्जीवाड़ा करके सत्ता बचाने की कोशिश।
मकान मालिक को नहीं पता और उसके घर के पते पर सैंकड़ों वोट बना दिया था इस ठग ने वो भी एक विशेष समुदाय का (और नये वोटर की उम्र – 40 साल से लेकर 80 साल तक)#AAP_के_फर्जी_वोटर pic.twitter.com/xt11LKFFPH
— BJP Delhi (@BJP4Delhi) January 2, 2025
G.O.A.T. 🔥 pic.twitter.com/RoNdSZGXFb
— AAP (@AamAadmiParty) January 2, 2025
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..