BJP- AAP Poster War: ఢిల్లీలో హీటెక్కిన పాలిటిక్స్.. బీజేపీ- ఆమ్ ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య పోస్టర్ ఫైట్
- దేశ రాజధాని ఢిల్లీలో హీటెక్కిన పాలిటిక్స్..
- కేజ్రీవాల్ ఒకే అడ్రస్లో వందల సంఖ్యలో బోగస్ ఓట్లు చేర్చారని బీజేపీ పోస్ట్..
- గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్టైమ్ (గోట్) అనే పోస్టర్ తో బీజేపీకి ఆప్ కౌంటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP- AAP Poster War: దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఓటర్లను ఆకర్షించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ వినూత్న ప్రచారానికి తెర లేపాయి. ఒకరి లోపాలను మరొకరు ఎత్తి చూపుతూ, హామీల వర్షం కురిపిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో బీజేపీ రిలీజ్ చేసిన పోస్టర్కు ఆప్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చిపడేసింది. ఇక, ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం కేజ్రీవాల్ ఒకే అడ్రస్లో వందల సంఖ్యలో బోగస్ ఓట్లు చేర్చారని బీజేపీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా విమర్శించింది. ఇంటి యజమానికి తెలియకుండా నకిలీ ఓట్లను రిజిస్టర్ చేస్తున్నారని ఆరోపించింది. ఇది కేజ్రీవాల్ కొత్త గేమ్ అంటూ తీవ్రంగా మండిపడింది. ఆప్కు నకిలీ ఓటర్లపై ప్రేమ అనే మీనింగ్ వచ్చేలా ఒక పోస్టర్ను నెట్టింట షేర్ చేసింది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ కౌంటర్ ఎటాక్ కు దిగింది. ఆ విమర్శను తిప్పి కొడుతూ ‘గోట్’ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్టైమ్) అంటూ కేజ్రీవాల్ ఉన్న మరో పోస్టర్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Read Also: Akash Deep: సిడ్నీ టెస్టు నుండి టీమిండియా ఫాస్ట్ బౌలర్ అవుట్..
Also Read
- High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్డీఏకు హైకోర్టు షాక్..!
- India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
- Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
- NEET PG 2026 Exam: నేడే నీట్ పీజీ 2026 ప్రవేశ పరీక్ష.. అభ్యర్థులు ఈ తప్పులు చేయకండి.. కీలక మార్గదర్శకాలు
ఇక, ఇదిలాఉంటే.. ఢిల్లీలో ఓటర్లకు బీజేపీ నగదు పంపిణీ చేస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తుంది. ఈ మేరకు ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు మోహన్ భగవత్కు అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. కమలం పార్టీ చేస్తున్న తప్పులను ఆర్ఎస్ఎస్ ఆమోదిస్తుందా? అని అందులో క్వశ్చన్ చేశారు. ఈ లేఖపై బీజేపీ రియాక్ట్ అవుతూ.. ఇలా మీడియా దృష్టిని ఆకర్షించాడానికి ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడికి లేఖ రాయడానికి బదులు ఆ సంస్థ నుంచి సేవా స్ఫూర్తిని నేర్చుకోవాలని కేజ్రీవాల్కు సూచించారు.
Read Also: Mythri Movie Makers : పుష్పా-2 నిర్మాతలకు హై కోర్టులో ఊరట
అయితే, దేశ రాజకీయాల్లోనే ఆమ్ ఆద్మీ పార్టీ అవిశ్వసనీయ పార్టీకి ఉదాహరణ అని.. దీనిని ప్రజలు అర్థం చేసుకున్నారని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది విమర్శలు గుప్పించారు. అబద్ధాలు చెప్పడం మానుకోవడానికి కొత్త సంవత్సరం రోజున కేజ్రీవాల్ తీర్మానించుకోవాలని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ ఆప్ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు మరో లేఖ రాశారు. దీంతో ఇరు పార్టీల మధ్య సోషల్ మీడియా వేదికగా ఫైట్ కొనసాగుతుంది.
दिल्ली में केजरीवाल का नया खेल! वोटों का फर्जीवाड़ा करके सत्ता बचाने की कोशिश।
मकान मालिक को नहीं पता और उसके घर के पते पर सैंकड़ों वोट बना दिया था इस ठग ने वो भी एक विशेष समुदाय का (और नये वोटर की उम्र – 40 साल से लेकर 80 साल तक)#AAP_के_फर्जी_वोटर pic.twitter.com/xt11LKFFPH
— BJP Delhi (@BJP4Delhi) January 2, 2025
G.O.A.T. 🔥 pic.twitter.com/RoNdSZGXFb
— AAP (@AamAadmiParty) January 2, 2025
తాజావార్తలు
-
APFDC: సినిమా షూటింగ్స్కు సింగిల్ విండో.. విశాఖను ఫిల్మ్ హబ్గా మార్చేందుకు కీలక నిర్ణయాలు
-
Rajamahendravaram: గోదావరిలో హౌస్బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
-
Mamitha Baiju : రెమ్యునరేషన్ పెంచేసిన మమిత బైజు.. రూ. 3 కోట్లు డిమాండ్?
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్ తో రూ.27 కోట్ల వసూళ్లు.. ఊహించని హిట్ అందుకున్న ‘హనుమాన్ అంశ్’
-
Smartphone Tips: పాత ఫోన్లను మూలన పడేస్తున్నారా?.. వైర్లెస్ మౌస్గా మార్చేసే సింపుల్ ట్రిక్
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!