BJP- AAP Poster War: ఢిల్లీలో హీటెక్కిన పాలిటిక్స్.. బీజేపీ- ఆమ్ ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య పోస్టర్ ఫైట్
- దేశ రాజధాని ఢిల్లీలో హీటెక్కిన పాలిటిక్స్..
- కేజ్రీవాల్ ఒకే అడ్రస్లో వందల సంఖ్యలో బోగస్ ఓట్లు చేర్చారని బీజేపీ పోస్ట్..
- గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్టైమ్ (గోట్) అనే పోస్టర్ తో బీజేపీకి ఆప్ కౌంటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP- AAP Poster War: దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఓటర్లను ఆకర్షించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ వినూత్న ప్రచారానికి తెర లేపాయి. ఒకరి లోపాలను మరొకరు ఎత్తి చూపుతూ, హామీల వర్షం కురిపిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో బీజేపీ రిలీజ్ చేసిన పోస్టర్కు ఆప్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చిపడేసింది. ఇక, ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం కేజ్రీవాల్ ఒకే అడ్రస్లో వందల సంఖ్యలో బోగస్ ఓట్లు చేర్చారని బీజేపీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా విమర్శించింది. ఇంటి యజమానికి తెలియకుండా నకిలీ ఓట్లను రిజిస్టర్ చేస్తున్నారని ఆరోపించింది. ఇది కేజ్రీవాల్ కొత్త గేమ్ అంటూ తీవ్రంగా మండిపడింది. ఆప్కు నకిలీ ఓటర్లపై ప్రేమ అనే మీనింగ్ వచ్చేలా ఒక పోస్టర్ను నెట్టింట షేర్ చేసింది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ కౌంటర్ ఎటాక్ కు దిగింది. ఆ విమర్శను తిప్పి కొడుతూ ‘గోట్’ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్టైమ్) అంటూ కేజ్రీవాల్ ఉన్న మరో పోస్టర్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Read Also: Akash Deep: సిడ్నీ టెస్టు నుండి టీమిండియా ఫాస్ట్ బౌలర్ అవుట్..
Also Read
- Abhijit Deepke: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కేపై ఇంక్ దాడి..
- NEET Ranker: కన్నీటి నుంచి పుట్టిన సంకల్పం.. తండ్రి మరణాన్ని స్ఫూర్తిగా మార్చుకుని 'నీట్'లో ర్యాంక్..
- NCP: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్.? విలీనం దిశగా ఎన్సీపీ.. బీజేపీ ప్లాన్..
- UCC Bill: 'ఒక్క పెళ్లి చేసుకున్నవారికే రాష్ట్రంలో ఉండే హక్కు ఉంటుంది'.. సీఎం సంచలన ప్రకటన..
ఇక, ఇదిలాఉంటే.. ఢిల్లీలో ఓటర్లకు బీజేపీ నగదు పంపిణీ చేస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తుంది. ఈ మేరకు ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు మోహన్ భగవత్కు అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. కమలం పార్టీ చేస్తున్న తప్పులను ఆర్ఎస్ఎస్ ఆమోదిస్తుందా? అని అందులో క్వశ్చన్ చేశారు. ఈ లేఖపై బీజేపీ రియాక్ట్ అవుతూ.. ఇలా మీడియా దృష్టిని ఆకర్షించాడానికి ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడికి లేఖ రాయడానికి బదులు ఆ సంస్థ నుంచి సేవా స్ఫూర్తిని నేర్చుకోవాలని కేజ్రీవాల్కు సూచించారు.
Read Also: Mythri Movie Makers : పుష్పా-2 నిర్మాతలకు హై కోర్టులో ఊరట
అయితే, దేశ రాజకీయాల్లోనే ఆమ్ ఆద్మీ పార్టీ అవిశ్వసనీయ పార్టీకి ఉదాహరణ అని.. దీనిని ప్రజలు అర్థం చేసుకున్నారని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది విమర్శలు గుప్పించారు. అబద్ధాలు చెప్పడం మానుకోవడానికి కొత్త సంవత్సరం రోజున కేజ్రీవాల్ తీర్మానించుకోవాలని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ ఆప్ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు మరో లేఖ రాశారు. దీంతో ఇరు పార్టీల మధ్య సోషల్ మీడియా వేదికగా ఫైట్ కొనసాగుతుంది.
दिल्ली में केजरीवाल का नया खेल! वोटों का फर्जीवाड़ा करके सत्ता बचाने की कोशिश।
मकान मालिक को नहीं पता और उसके घर के पते पर सैंकड़ों वोट बना दिया था इस ठग ने वो भी एक विशेष समुदाय का (और नये वोटर की उम्र – 40 साल से लेकर 80 साल तक)#AAP_के_फर्जी_वोटर pic.twitter.com/xt11LKFFPH
— BJP Delhi (@BJP4Delhi) January 2, 2025
G.O.A.T. 🔥 pic.twitter.com/RoNdSZGXFb
— AAP (@AamAadmiParty) January 2, 2025
తాజావార్తలు
-
Kapil Dev: “బాధ ఎందుకు.. పండుగలా సెలబ్రేట్ చేసుకోవాలి”.. రోహిత్ రిటైర్మెంట్పై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
-
Anaconda vs Python: అనకొండా, కొండచిలువ ఒకటే అనుకుంటున్నారా? అసలు తేడా ఇదే!
-
Abhijit Deepke: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కేపై ఇంక్ దాడి..
-
KTR : స్థానిక యువతకు 95 శాతం ఉద్యోగాలు సాధించింది కేసీఆరే
-
Maheshwara Reddy: రివ్యూలపై ‘ఓ సుకుమారి’ నిర్మాత షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!