Amit Shah: ప్రజల సొమ్ముతో కేజ్రీవాల్ విలాసాలు.. అమిత్ షా విమర్శలు
- ప్రజల సొమ్ముతో కేజ్రీవాల్ విలాసాలు
- కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయాలు హీటెక్కాయి. త్వరలో జరగనున్న అసెంబ్లీ పోల్స్కి అన్ని పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ ఆప్.. అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా బీజేపీ 29 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్ కూడా కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇదిలా ఉంటే శీతాకాలంలో విమర్శలు.. ప్రతివిమర్శలతో హస్తిన వాతావరణం వేడెక్కుతోంది. శుక్రవారం ప్రధాని మోడీ… కేజ్రీవాల్ టార్గెట్గా ధ్వజమెత్తగా.. తాజాగా అమిత్ షా కూడా ఆప్ అధినేత లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారిక నివాసంపై దుబారా ఖర్చు చేశారంటూ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. ఒక బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడారు. ‘‘కొందరు పిల్లలు తనను కలవడానికి తన ఇంటికి వచ్చారని.. వాళ్లను అడిగాను.. కేజ్రీవాల్ ఢిల్లీ కోసం ఏం చేశారని అడిగాను. శీష్మహల్ నిర్మించుకున్నారని ఓ పిల్లవాడు చెప్పాడు.’’ అని అమిత్ షా గుర్తుచేశారు. కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలకు ఏం చేయలేదు గానీ.. అద్దాల మేడలాంటి రాజభవనం నిర్మించుకున్నారని ఆరోపించారు. తాను రాజకీయాల్లోకి వచ్చాక.. ప్రభుత్వ కారు.. బంగ్లా తీసుకోనని చెప్పిన ఆయన.. ఈరోజు ఢిల్లీ ప్రజల సొమ్ముతో విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ లెక్క చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు.
Also Read
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
- Hydrogen Train: భారత తొలి హైడ్రోజన్ రైలుకు గ్రీన్ సిగ్నల్.. ప్రత్యేకతలేంటంటే!
శుక్రవారం ప్రధాని మోడీ కూడా ఢిల్లీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ టార్గెట్గా విమర్శనాస్త్రాలు సంధించారు. దశాబ్ద కాలంగా దేశ రాజధానిని పట్టిపీడిస్తున్న విపత్తు అని ఆప్ను అభివర్ణించారు. తాను విలాసవంతమైన జీవితాన్ని కోరుకోవడం లేదని.. ప్రజల కోసం తాము ఇండ్లు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు.
కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అధికారిక నివాసం కోసం విపరీతంగా ఖర్చు చేశారన్న ఆరోపణలపై బీజేపీ విమర్శలు చేస్తోంది. గత ఏడాది అక్టోబర్లో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (పీడబ్ల్యుడీ) విడుదల చేసిన ఇన్వెంటరీలో బంగ్లాలో విలాసవంతమైన ఉపకరణాలు, పునర్నిర్మాణాలు ఉన్నాయని తెలిపింది. అయితే ప్రధాని మోడీ ఆరోపణలను కేజ్రీవాల్ కొట్టిపారేశారు. 10 ఏళ్లలో బీజేపీ ఒక్క మంచి పని కూడా చేయలేదన్నారు. 2022 నాటికి శాశ్వత గృహాలు అని వాగ్దానం చేసి.. ఐదేళ్లలో 4,700 ఇళ్లు నిర్మించారని పేర్కొన్నారు. ఆప్ పాలనలో 22,000 తరగతి గదులు, మూడు కొత్త విశ్వవిద్యాలయాలతో పాటు లెక్కలేనన్నీ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ శనివారం తొలి జాబితాను విడుదల చేసింది. 29 మందితో కూడిన ఫస్ట్ లిస్టు రిలీజ్ చేసింది. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పర్వేష్ వర్మను కేజ్రీవాల్కు పోటీకి దించింది. ఇక రమేష్ బిధూరిని ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషిపై బరిలోకి దింపింది. అతిషి కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
-
Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
-
Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
-
Isakapatnam Trailer: అధికారం కోసం కన్నతండ్రినే ఢీకొట్టిన కూతురు!”
-
Idupu Kayitham : ‘ఇడుపు కాయితం’ చుట్టూ కొత్త వివాదం.. అసలు ఈ పదం అర్ధమేంటి?
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!