AAP vs BJP: ఢిల్లీలో శీష్ మహల్ రచ్చ.. ప్రధాని నివాసం వద్ద ఆప్- సీఎం ఇంటి వద్ద బీజేపీ!
- అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఢిల్లీలో హీటెక్కిన పాలిటిక్స్..
- ఢిల్లీలో ఆమ్ ఆద్మీ- బీజేపీ పార్టీల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం..
- ప్రధాని నివాసం దగ్గర ఆప్.. ఢిల్లీ సీఎంఅధికారిక ఇంటి వద్ద బీజేపీ నిరసన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AAP vs BJP: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఢిల్లీ పాలిటిక్స్ హీటెక్కాయి. ఆప్, బీజేపీ పరస్పర విమర్శలకు దిగాయి. ఈ సమయంలో ‘ ముఖ్యమంత్రి బంగ్లా’ వివాదం రాజకీయ దుమారానికి దారి తీసింది. ఈ బంగ్లాను ‘శీష్ మహల్ అంటూ భారతీయ జనతా పార్టీ చేస్తోన్న విమర్శలను ఆమ్ ఆద్మీ పార్టీ తిప్పికొడుతుంది. తాజాగా ‘నిజాన్ని చూపిస్తామంటూ’ ఆ పార్టీ నేతలు సంజయ్ సింగ్, సౌరభ్ భరద్వాజ్ మీడియాను తీసుకొని సీఎం అధికారిక నివాసం దగ్గరకు వెళ్లారు. అయితే వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడంతో.. మంత్రి, ఎంపీ అధికారాలను పోలీసులు అడ్డుకుంటున్నారని ఆప్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ముఖ్యమంత్రి నివాసం దగ్గర గందరగోళ వాతావరణం ఏర్పడింది.
Read Also: CM Chandrababu: కుప్పంలో ముగిసిన సీఎం చంద్రబాబు పర్యటన.. బెంగళూరుకు పయనం
Also Read
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
- Mohan Bhagwat: న్యూయార్క్లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
- Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
కాగా, ఆ అధికారిక నివాసంలోకి వెళ్లేందుకు ఆమ్ ఆద్మీ నేతలకు పర్మిషన్ లేదని పోలీసులు తెలిపారు. వివాదం చెలరేగడంతో బారికేడ్లను ఏర్పాటు చేశారు పోలీసులు. ఎవరినీ లోపలికి అనుమతించ వద్దంటూ పైనుంచి ఆదేశాలు వచ్చాయని వెల్లడించారు. పోలీసుల చర్యలు బీజేపీకి సంతోషాన్ని కలిగిస్తున్నాయని మంత్రి సౌరభ్ భరద్వాజ్ విమర్శించారు. తర్వాత ఎంపీ సంజయ్ సింగ్తో పాటు కొద్దిసేపు ధర్నా చేసిన తర్వాత ప్రధాన మంత్రి అధికారిక నివాసం వైపు వెళ్లారు. దీంతో వారిని పీఎం నివాసం సమీపంలోనే పోలీసులు అడ్డుకున్నారు.
Read Also: Warangal: తల్లడిల్లిపోయిన గోమాత.. వీడియో కాల్ ద్వారా ప్రసవం చేసిన మెడికల్ విద్యార్థులు..
మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీకి కౌంటర్గా భారతీయ జనతా పార్టీ ఢిల్లీ ముఖ్యమంత్రి అధికారిక నివాసం వద్దకు వెళ్లారు. హస్తీనాలోని 6 ఫ్లాగ్ స్టాఫ్ రోడ్లో ఉన్న ప్రభుత్వ బంగ్లాను అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా ఉన్న సమయంలో అధికారిక నివాసంగా ఉపయోగించారు. ఈ బంగ్లాను ‘శీష్ మహల్ (అద్దాల మేడ)’గా ప్రస్తుతం బీజేపీ అభివర్ణిస్తోంది. ప్రజాధనాన్ని వృథా చేసి ఆయన 7-స్టార్ రిసార్ట్గా మార్చుకున్నారని ఆరోపింస్తుంది. దీనికి కౌంటర్గా పీఎం నివాసాన్ని ‘రాజ్ మహల్’ అని ఆప్ విమర్శలు చేస్తుంది.
आज प्रधानमंत्री निवास देखने चलेंगे मीडिया के साथ। क्या भाजपा तैयार है? आप राज्यसभा सांसद @SanjayAzadSln और वरिष्ठ नेता @Saurabh_MLAgk की Important Press Conference l LIVE https://t.co/3HG69YvfaH
— AAP (@AamAadmiParty) January 8, 2025
BJP National Spokesperson Dr. @SudhanshuTrived addresses a press conference at BJP headquarters in New Delhi. https://t.co/htEwwdsAQ5
— BJP Delhi (@BJP4Delhi) January 8, 2025
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!