AAP vs BJP: ఢిల్లీలో శీష్ మహల్ రచ్చ.. ప్రధాని నివాసం వద్ద ఆప్- సీఎం ఇంటి వద్ద బీజేపీ!
- అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఢిల్లీలో హీటెక్కిన పాలిటిక్స్..
- ఢిల్లీలో ఆమ్ ఆద్మీ- బీజేపీ పార్టీల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం..
- ప్రధాని నివాసం దగ్గర ఆప్.. ఢిల్లీ సీఎంఅధికారిక ఇంటి వద్ద బీజేపీ నిరసన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AAP vs BJP: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఢిల్లీ పాలిటిక్స్ హీటెక్కాయి. ఆప్, బీజేపీ పరస్పర విమర్శలకు దిగాయి. ఈ సమయంలో ‘ ముఖ్యమంత్రి బంగ్లా’ వివాదం రాజకీయ దుమారానికి దారి తీసింది. ఈ బంగ్లాను ‘శీష్ మహల్ అంటూ భారతీయ జనతా పార్టీ చేస్తోన్న విమర్శలను ఆమ్ ఆద్మీ పార్టీ తిప్పికొడుతుంది. తాజాగా ‘నిజాన్ని చూపిస్తామంటూ’ ఆ పార్టీ నేతలు సంజయ్ సింగ్, సౌరభ్ భరద్వాజ్ మీడియాను తీసుకొని సీఎం అధికారిక నివాసం దగ్గరకు వెళ్లారు. అయితే వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడంతో.. మంత్రి, ఎంపీ అధికారాలను పోలీసులు అడ్డుకుంటున్నారని ఆప్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ముఖ్యమంత్రి నివాసం దగ్గర గందరగోళ వాతావరణం ఏర్పడింది.
Read Also: CM Chandrababu: కుప్పంలో ముగిసిన సీఎం చంద్రబాబు పర్యటన.. బెంగళూరుకు పయనం
Also Read
- NEET Paper Leak: పేపర్ సెట్ చేసినవారే లీక్ చేశారు.. NEET స్కాంలో మరో టీచర్ అరెస్ట్..
- PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
- Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
- Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
కాగా, ఆ అధికారిక నివాసంలోకి వెళ్లేందుకు ఆమ్ ఆద్మీ నేతలకు పర్మిషన్ లేదని పోలీసులు తెలిపారు. వివాదం చెలరేగడంతో బారికేడ్లను ఏర్పాటు చేశారు పోలీసులు. ఎవరినీ లోపలికి అనుమతించ వద్దంటూ పైనుంచి ఆదేశాలు వచ్చాయని వెల్లడించారు. పోలీసుల చర్యలు బీజేపీకి సంతోషాన్ని కలిగిస్తున్నాయని మంత్రి సౌరభ్ భరద్వాజ్ విమర్శించారు. తర్వాత ఎంపీ సంజయ్ సింగ్తో పాటు కొద్దిసేపు ధర్నా చేసిన తర్వాత ప్రధాన మంత్రి అధికారిక నివాసం వైపు వెళ్లారు. దీంతో వారిని పీఎం నివాసం సమీపంలోనే పోలీసులు అడ్డుకున్నారు.
Read Also: Warangal: తల్లడిల్లిపోయిన గోమాత.. వీడియో కాల్ ద్వారా ప్రసవం చేసిన మెడికల్ విద్యార్థులు..
మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీకి కౌంటర్గా భారతీయ జనతా పార్టీ ఢిల్లీ ముఖ్యమంత్రి అధికారిక నివాసం వద్దకు వెళ్లారు. హస్తీనాలోని 6 ఫ్లాగ్ స్టాఫ్ రోడ్లో ఉన్న ప్రభుత్వ బంగ్లాను అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా ఉన్న సమయంలో అధికారిక నివాసంగా ఉపయోగించారు. ఈ బంగ్లాను ‘శీష్ మహల్ (అద్దాల మేడ)’గా ప్రస్తుతం బీజేపీ అభివర్ణిస్తోంది. ప్రజాధనాన్ని వృథా చేసి ఆయన 7-స్టార్ రిసార్ట్గా మార్చుకున్నారని ఆరోపింస్తుంది. దీనికి కౌంటర్గా పీఎం నివాసాన్ని ‘రాజ్ మహల్’ అని ఆప్ విమర్శలు చేస్తుంది.
आज प्रधानमंत्री निवास देखने चलेंगे मीडिया के साथ। क्या भाजपा तैयार है? आप राज्यसभा सांसद @SanjayAzadSln और वरिष्ठ नेता @Saurabh_MLAgk की Important Press Conference l LIVE https://t.co/3HG69YvfaH
— AAP (@AamAadmiParty) January 8, 2025
BJP National Spokesperson Dr. @SudhanshuTrived addresses a press conference at BJP headquarters in New Delhi. https://t.co/htEwwdsAQ5
— BJP Delhi (@BJP4Delhi) January 8, 2025
తాజావార్తలు
-
Peddi: పెద్ది ట్రైలర్’పై చిరు రివ్యూ.. డైలాగ్ లీక్
-
NEET Paper Leak: పేపర్ సెట్ చేసినవారే లీక్ చేశారు.. NEET స్కాంలో మరో టీచర్ అరెస్ట్..
-
Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
-
PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
-
Lightning Strike: పక్కనే పిడుగు పడినా బతికాడు.. షాక్లో సైంటిస్టులు..ఈ కుర్రాడిలో అంతుచిక్కని శక్తులున్నాయా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..