AAP vs BJP: ఢిల్లీలో శీష్ మహల్ రచ్చ.. ప్రధాని నివాసం వద్ద ఆప్- సీఎం ఇంటి వద్ద బీజేపీ!
- అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఢిల్లీలో హీటెక్కిన పాలిటిక్స్..
- ఢిల్లీలో ఆమ్ ఆద్మీ- బీజేపీ పార్టీల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం..
- ప్రధాని నివాసం దగ్గర ఆప్.. ఢిల్లీ సీఎంఅధికారిక ఇంటి వద్ద బీజేపీ నిరసన..
AAP vs BJP: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఢిల్లీ పాలిటిక్స్ హీటెక్కాయి. ఆప్, బీజేపీ పరస్పర విమర్శలకు దిగాయి. ఈ సమయంలో ‘ ముఖ్యమంత్రి బంగ్లా’ వివాదం రాజకీయ దుమారానికి దారి తీసింది. ఈ బంగ్లాను ‘శీష్ మహల్ అంటూ భారతీయ జనతా పార్టీ చేస్తోన్న విమర్శలను ఆమ్ ఆద్మీ పార్టీ తిప్పికొడుతుంది. తాజాగా ‘నిజాన్ని చూపిస్తామంటూ’ ఆ పార్టీ నేతలు సంజయ్ సింగ్, సౌరభ్ భరద్వాజ్ మీడియాను తీసుకొని సీఎం అధికారిక నివాసం దగ్గరకు వెళ్లారు. అయితే వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడంతో.. మంత్రి, ఎంపీ అధికారాలను పోలీసులు అడ్డుకుంటున్నారని ఆప్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ముఖ్యమంత్రి నివాసం దగ్గర గందరగోళ వాతావరణం ఏర్పడింది.
Read Also: CM Chandrababu: కుప్పంలో ముగిసిన సీఎం చంద్రబాబు పర్యటన.. బెంగళూరుకు పయనం
Also Read
- Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
- Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
- PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
- Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!
కాగా, ఆ అధికారిక నివాసంలోకి వెళ్లేందుకు ఆమ్ ఆద్మీ నేతలకు పర్మిషన్ లేదని పోలీసులు తెలిపారు. వివాదం చెలరేగడంతో బారికేడ్లను ఏర్పాటు చేశారు పోలీసులు. ఎవరినీ లోపలికి అనుమతించ వద్దంటూ పైనుంచి ఆదేశాలు వచ్చాయని వెల్లడించారు. పోలీసుల చర్యలు బీజేపీకి సంతోషాన్ని కలిగిస్తున్నాయని మంత్రి సౌరభ్ భరద్వాజ్ విమర్శించారు. తర్వాత ఎంపీ సంజయ్ సింగ్తో పాటు కొద్దిసేపు ధర్నా చేసిన తర్వాత ప్రధాన మంత్రి అధికారిక నివాసం వైపు వెళ్లారు. దీంతో వారిని పీఎం నివాసం సమీపంలోనే పోలీసులు అడ్డుకున్నారు.
Read Also: Warangal: తల్లడిల్లిపోయిన గోమాత.. వీడియో కాల్ ద్వారా ప్రసవం చేసిన మెడికల్ విద్యార్థులు..
మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీకి కౌంటర్గా భారతీయ జనతా పార్టీ ఢిల్లీ ముఖ్యమంత్రి అధికారిక నివాసం వద్దకు వెళ్లారు. హస్తీనాలోని 6 ఫ్లాగ్ స్టాఫ్ రోడ్లో ఉన్న ప్రభుత్వ బంగ్లాను అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా ఉన్న సమయంలో అధికారిక నివాసంగా ఉపయోగించారు. ఈ బంగ్లాను ‘శీష్ మహల్ (అద్దాల మేడ)’గా ప్రస్తుతం బీజేపీ అభివర్ణిస్తోంది. ప్రజాధనాన్ని వృథా చేసి ఆయన 7-స్టార్ రిసార్ట్గా మార్చుకున్నారని ఆరోపింస్తుంది. దీనికి కౌంటర్గా పీఎం నివాసాన్ని ‘రాజ్ మహల్’ అని ఆప్ విమర్శలు చేస్తుంది.
आज प्रधानमंत्री निवास देखने चलेंगे मीडिया के साथ। क्या भाजपा तैयार है? आप राज्यसभा सांसद @SanjayAzadSln और वरिष्ठ नेता @Saurabh_MLAgk की Important Press Conference l LIVE https://t.co/3HG69YvfaH
— AAP (@AamAadmiParty) January 8, 2025
BJP National Spokesperson Dr. @SudhanshuTrived addresses a press conference at BJP headquarters in New Delhi. https://t.co/htEwwdsAQ5
— BJP Delhi (@BJP4Delhi) January 8, 2025
తాజావార్తలు
-
TGSRTC Strike: నేడు ఆర్టీసీ బస్సులు నడుస్తాయా? సమ్మెపై క్లారిటీ ఇచ్చిన జేఏసీ!
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?