ఏపీ జేఎసీ, ఏపీజేఎసీ అమరావతి, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం , సచివాలయ ఉద్యోగుల సంఘాలు ఏక తాటిపైకి రావాలని నిర్ణయించినట్టు బండి ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చర్చల ద్వారా సంప్రదింపులు చేసుకుని ఒకే తాటిపైకి రావాలని నిర్ణయించుకున్నామన్నారు. పీఆర్సీ జీవోల వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోల ద్వారా నష్టం జరుగుతుందన్నారు. ఐక్యంగా పోరాడి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి మా డిమాండ్లు సాధించుకుంటామన్నారు. సచివాలయంలో…
సంచలనం సృష్టించిన రింగు వలలపై ఘటనపై అధికారులు, మత్స్యకారులతో చర్చలు జరిపారు. అయితే ఈ చర్చల్లో ఎలాలంటి నిర్ణయాన్ని అధికారులు తీసుకోలేకపోయారు. దీంతో మత్స్యకారులతో అధికారుల సమావేశం అసంపూర్తిగా ముగిసింది. ఇరు వర్గాల మత్స్యకార గ్రామాల పెద్దలతో చర్చలు జరిపిన జిల్లా ఉన్నతాధికారులు. ఈనెల 25వ తేదీన మరోమారు సమావేశం కావాలని నిర్ణయించారు. ఈలోగా ఏదో ఒక నిర్ణయానికి రావాలని మత్స్యకారులను అధికారులు కోరారు.తమ తమ గ్రామ పెద్దలతో చర్చించి 25 లోగా తమ నిర్ణయం తెలుపుతామని…
ఏపీ ఉద్యోగుల పీఆర్సీ అంశం ఇప్పట్లో తేలేలా లేదు. ఓవైపు ప్రభుత్వం ప్రస్తుతమున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గమనించి వ్యవహరించాలని చెబుతున్నా ఉద్యోగులు మాత్రం అందుకు సంసిద్ధంగా లేరు. ఇప్పటికే ప్రభుత్వంతో పలు మార్లు చర్చలు జరిపిన అవేవి సఫలం కాలేదు. అటు ప్రభుత్వాన్ని, ఉద్యోగులను ఒకే తాటి మీదకు తీసుకురావాలని సీఎస్ సమీర్ శర్మ చేసిన ప్రయత్నాలన్ని బెడిసి కొట్టాయి. మంత్రులు సైతం పలు మార్లు ఉద్యగ సంఘాల నాయకులతో భేటీ అయినప్పటికీ పరిస్థితిలో మార్పు…
ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం కరెక్ట్ కాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఉద్యోగుల ఆందోళనలపై స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఆందోళన చేస్తున్న ఉద్యోగులు కొంత మంది మాటలు బాధకరంగా ఉన్నాయన్నారు.భాష అదుపులో ఉండాలి. సంయమనం లేకుండా ఉద్యోగులు మాట్లాడుతున్నారన్నారు. ఉద్యగులకు కావాల్సింది ఘర్షణా లేక సమస్యల పరిష్కారమా..? వారే నిర్ణయించుకోవాలన్నారు. బాధ్యత రహితంగా మాట్లాడుతున్న వారిని ఉద్యోగ సంఘాల నేతలు కట్టడి చేయాలన్నారు. చర్యకు ప్రతిచర్య ఉంటుందన్నారు. ఇలా మాట్లాడితే తీవ్ర…
ప్రజల కోర్కెలు తీర్చడంలో… ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడం, అభివృద్ధి విషయంలో టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..టీడీపీ, వైసీపీ పార్టీలపై విమర్శల దాడులకు దిగారు. రెండు పార్టీలు కుటుంబ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. రాయలసీమలో ఎర్రచందనం, ముగ్గురాయి, చాలా ఖనిజాలు ఉన్నప్పటికీ.. ఇక్కడివారు ముఖ్యమంత్రులుగా ఉన్నా అభివృద్ధి లేకుండా చేశారన్నారు. అన్ని రకాల ఆర్థిక వనరులు ఉన్నా అభివృద్ధి శూన్యమన్నారు. 2024లో బీజేపీ…
హక్కుల కోసం ఉద్యమిస్తే అరెస్టులు చేస్తారా అంటూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.టీడీపీ 43% పిఆర్సీ ఇస్తే తప్పుబట్టిన జగన్ రెడ్డి ఈరోజు అసలు వేతనాలకే ఎసరు పెట్టారన్నారు. ఉద్యోగుల న్యాయమైన కోర్కెలను పరిష్కరించాల్సింది పోయి అరెస్టులు చేయడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని కాగ్ నివేదికలు చెబుతున్నా ఆదాయం లేదంటూ ఉద్యోగుల పొట్ట కొట్టడం దుర్మార్గమన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన హమీల్లో రెండున్నరేళ్లలో ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ఉద్యోగులకు మొడి…
పీఆర్సీపై రెండు నెలలుగా చెప్పిందే సీఎస్ మళ్లీ చెబుతున్నారని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె. వెంకట్రామిరెడ్డి అన్నారు. ప్రభుత్వంతో చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎస్ వివరణలో కొత్త విషయాలేమీ లేవన్నారు. పీఆర్సీని, డీఏలను కలిపి చూడొద్దన్నారు. డీఏలను కూడా కలిపి జీతాలు పెరుగుతున్నాయని అధికారులు తప్పుడు లెక్కలు చూపెడుతున్నారని ఆయన మండిపడ్డారు. Read Also: తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు : మంత్రి ఆదిమూలపు ప్రభుత్వం ప్రటించిన 23 శాతం…
గుంజేపల్లిలో దళితుల ఆలయ ప్రవేశంపై కొందరు అనవసర రాద్ధాంతం సృష్టిస్తున్నారని శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. గ్రామంలో సున్నితంగా ఉన్న సమస్యను కొందరు పక్కదారి పట్టించారని ఆరోపించారు. ఇలాంటి ఆధునిక కాలంలో కూడా దళితులు ఆలయాల్లోకి రానివ్వకపోవడం ఏంటి…? అంటూ ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని మేము సూచించాం. అధికారులు చట్టం ప్రకారం ఏది ఉంటే అదే చేశారన్నారు. కొందరూ కులాలు అంటూ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారన్నారు. Read Also:…
రేపటి నుంచి ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు 4 రోజులు రాయలసీమ పర్యటన చేయనున్నారు. ఇప్పటికే సోము వీర్రాజు కర్నూలు చేరుకున్నారు. రేపు కర్నూల్లో ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గొంటారు. బనగానపల్లెలోను సోమూవీర్రాజు పర్యటిస్తారని బీజేపీ శ్రేణులు తెలిపాయి. నంద్యాలలో పోలీసులు అరెస్ట్ చేసిన బీజేపీ కార్యకర్త సుజన్ పురోహిత్ కుటుంబాన్ని పరామర్శించనున్న సోము వీర్రాజు. ఎల్లుండి అనంతపురంలో పర్యటిస్తారు. 21న గూడూరులో పోలీసులు అరెస్ట్ చేసిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తారు. 22న ఆత్మకూరు ఘటనపై కర్నూలులో…
కోవిడ్ పరిస్థితి పై జిల్లా అధికారులతో మంత్రి సీదిరి అప్పలరాజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోవిడ్ను ఏవిధంగా ఎదుర్కొవాలో అధికారులకు పలు సూచనలు చేశారు. కోవిడ్ ని ఎలా ఎదుర్కోవాలో మన నుంచి ఇతర రాష్ట్రాల వారు తెలసుకుంటున్నారని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. కోవిడ్ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉందన్నారు. సెకండ్ వేవ్లో ఆక్సిజన్ కొరత ఎక్కువగా వచ్చింది. Read Also: ఏపీలో కరోనా విజృంభణ.. కొత్తగా 6,996 కేసులు 10వేల…