విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో భాగంగా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ మరో అడుగు ముందుకు వేసింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ ఆపాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని గత కొన్ని రోజులుగా కోరుతున్నారు. అయినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఉద్యోగులు ఆందోళన బాట పట్టిన సంగతి తెల్సిందే.. ఈ ఉద్యమానికి రాజకీయ పార్టీలు సైతం మద్దతునిస్తున్నాయి. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలు మార్లు ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.…
తిరులమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ముగిసినట్టు టీటీడీ ప్రకటించింది. ఆలయంలో ఇక నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ఉండవని పేర్కొంది. పది రోజుల పాటు భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ అనుమతించింది. కోవిడ్ కారణంగా పరిమిత సంఖ్యలోనే భక్తులును దర్శనానికి అనుమతించిన టీటీడీ. పది రోజుల్లో వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న 3 లక్షల 77వేల 943 మంది భక్తులు. 1,22,799 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించినట్టు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. పది…
ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో ఏపీ వైద్యారోగ్య అధికారులను కలవరానికి గురి చేస్తుంది. సంక్రాంతి పండుగ తర్వాత ఒక్కసారిగా కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. తాజాగా ఈరోజు 43,763 శాంపిల్స్ను పరీక్షించగా 12,926 మందికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. మరోవైపు ప్రభుత్వం పరీక్షల సంఖ్యను పెంచాలని భావిస్తోంది. కరోనాతో ఈ రోజు ఆరుగురు మృతి చెందారు. విశాఖపట్నం జిల్లాలో ముగ్గురు, నెల్లూరులో ఇద్దరు, తూర్పుగోదావరిలో ఒక్కరు మరణించారు. Read Also: ఒళ్లు…
సీఎం జగన్ ను నిద్ర లేపడానికే వచ్చానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ ప్రభుత్వం ధమన కాండ ను చెప్పడానికే వచ్చానని, ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాలు చేస్తుందన్నారు. ఏపీలో పోలీస్ స్టేషన్లు తగులబెట్టారు..పోలీస్ లపై దాడులు చేస్తున్నారు…అలాంటి వారిపై తక్కువ యాక్షన్ తీసుకొని బీజేపీ క్యాడర్ పై కేసులు పెడుతున్నారని అరుణ్ సింగ్ ఆరోపించారు. యూపీలో సీఎం…
కొడాలి నానిపై వచ్చిన ఆరోపణలను నిరూపించడానికి సిద్ధమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమహేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం, కొడాలి నాని తీవ్రంగా విమర్శించారు. గుడివాడలో మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో క్యాసినో నిర్వహించారు. కొడాలి నానిపై మేం చేసిన ఆరోపణలు నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వ పరువు పోయిందని భయపడి.. మమ్మల్ని తిడుతున్నారని బోండా ఉమ ఆరోపించారు. మంత్రి కొడాలి నాని కన్వెన్షన్ సెంటర్లో జరిగినట్లు నిరూపిస్తే పెట్రోల్…
దేశంలో హిందువులకు ముప్పు రాబోతుందని జీవీఎల్ నరసింహరావు అన్నారు. ఈ సందర్భంగా కర్నూల్లో .. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.విజయవాడలో ప్రజాగ్రహ సభ ద్వారా నిద్ర లేకుండా చేసి శరణు ప్రభు అంటూ ఢిల్లీ వెళ్లాలా చేశామన్నారు. పీఎఫ్ ఐ వంటి సంస్థలు ఐఎస్ఐ కనుసన్నల్లో పనిచేస్తుందన్నారు. ఢిల్లీలో ఫీఎప్ఐ మత అల్లర్లు సృష్టించిందన్నారు. Read Also: వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆలయాలపై దాడులు పెరిగాయి: టీజీ వెంకటేష్ కేరళలోని ప్రొఫెసర్ చేతని నరికేశారని జీవీఎల్…
కొడాలి నాని ఆధ్వర్యంలో విష సంస్కృతి తీసుకు వచ్చారని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. కొడాలి నానిపై వర్ల రామయ్య తీవ్రంగా విమర్శలు చేశారు. ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ.. నీ కళ్యాణ మండపంలో ఏం జరిగిందో నువ్వే పోలీసులకు చెప్పాలన్నారు. కొడాలి నాని నీచుడు, నికృష్టుడు, దృష్టుడు, పనికి రాని వాడు దద్దమ్మ, యూజ్ లెస్ ఫెలో అంటూ వర్ల రామయ్య తిట్ల పురాణం అందుకున్నారు. మేము నిజనిర్ధారణ బృందం వెళ్లితే గుడివాడలో వైసీపీ…
కరోనాతో ఆగిపోయిన రైళ్లలో జనరల్ టిక్కెట్లను తిరిగి దశల వారీగా ప్రారంభించేందుకు రైల్వే శాఖ సన్నద్ధం అవుతుంది. ఇప్పటికే చాలా రైళ్లలో కరోనా కారణంగా జనరల్ టిక్కెట్లను ప్రభుత్వం నిలిపివేసింది. కరోనా అనంతరం చాలా రైళ్లు తిరిగి ప్రారంభం అయినా కేవలం రిజర్వేషన్ టిక్కెట్ సౌకర్యం మాత్రమే రైల్వే శాఖ కల్పించింది. దీంతో సామాన్య ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. దూర ప్రాంతాలకు వెళ్లే వారు సొంత వాహనాలు, లేదా బస్సులను ఆశ్రయించారు. అయితే తాజాగా కొన్ని…
సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన కాసేపటి క్రితమే ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం అయింది. కరోనా పరిస్థితులు, నియంత్రణ చర్యల పై చర్చించనున్న క్యాబినెట్.. కొత్త పీఆర్సీ జీవోలను ర్యాటిఫై చేయనుంది. ఉద్యోగుల పదవి విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంపు కి ఆమోదం తెలపనున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్.. కరోనా మహమ్మారి తో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కారుణ్య నియామకాల పై ఆమోదం తెలపనుంది. ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల పథకంకు ఆమోదం తెలపనున్న క్యాబినెట్..…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ రేపు సమావేశం కానుంది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం కానుంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర మంత్రి మండలి భేటీ జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పీఆర్సీ విషయం పై అటు ప్రభుత్వానికి ఇటు ఉద్యోగులకు వార్ నడుస్తుంది. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీతో…