CM Chandrababu: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దురుద్దేశంతో కూడుకున్నది.. అందుకే రద్దు చేశాం..
- రాబోయే రోజుల్లో ఇబ్బంది లేకుండా భూమికి భద్రత కల్పించాం..
- లా అండ్ ఆర్డర్కు సమస్య తెస్తే తాట తీస్తా..
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దురుద్దేశంతో కూడుకున్నది.. అందుకే రద్దు చేశాం: సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: కర్నూలు జిల్లాలోని కలుగోట్ల సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. రౌడీలు మీ భూమిని 22A కింద పెట్టేస్తున్నారు.. ప్రైవేట్ భూములను ప్రభుత్వ భూముల జాబితాలో పెట్టారు.. తాడేపల్లి ప్యాలెస్ కట్టుకున్నారు..హెలిపాడ్ కోసం ఆ పక్కన 10 ఎకరాల భూమి అడిగారు.. భూమి ఇవ్వమని చెబితే.. బలవంతంగా హెలిపాడ్ చేశారు.. 22ఏ కింద ఆ భూమిని ప్రభుత్వ భూమిని చేశారని ఆరోపించారు. 1956 నుంచి అన్ని రికార్డులు ఉన్నాయని ఆయన ఆధారాలు చూపుతున్నారు.. బలవంతంగా ప్రభుత్వ భూమిగా మార్చి అనుభవించారు.. వ్యక్తిగత స్వార్థం కోసం చేశారు.. పార్టీ ఆఫీసుకు వందల సంఖ్యలో భూముల సమస్యలు వస్తున్నాయని చంద్రబాబు అన్నారు.
Read Also: US-Iran: మధ్యప్రాచ్యంలో టెన్షన్.. టెన్షన్.. తక్షణమే ఇరాన్ ఖాళీ చేయాలని అమెరికన్లకు ట్రంప్ వార్నింగ్
Also Read
- RK Roja: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. ప్రతిచోటా పోటీ చేస్తాం..
- YS Jagan: వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.. ప్రతి ఇంట్లో వైసీపీ, కూటమి పాలనపై చర్చ జరుగుతోంది..
- YS Jagan: ఏకగ్రీవాలకు అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవు.. వైసీపీ నేతలకు జగన్ హెచ్చరిక
- Supreme Court: X, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
ఇక, మళ్లీ భూమిపై కన్ను వేయగుండా సర్వ హక్కులు ఇచ్చి సెక్యురిటీ హక్కులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను అని సీఎం చంద్రబాబు తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేసి క్యూ ఆర్ కోడ్ పెట్టాం.. ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు.. బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చాం.. ట్యాంపరింగ్ చేయడానికి ప్రయత్నిస్తే అప్పటికప్పుడే తెలుస్తుంది.. బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చాము…ట్యాంపరింగ్ చేయడానికి ప్రయత్నిస్తే అప్పటికప్పుడే తెలుస్తుంది…వాళ్ళు జైలుకి వెళ్లాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.
Read Also: Supreme Court: ప్రశాంత్ కిషోర్కు సుప్రీంకోర్టు షాక్.. పిటిషన్ తీరుపై చీవాట్లు
అయితే, ప్రతి నెల 9వ తేదీన భూ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు నేను వస్తాను అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఎలాంటి తప్పులు లేకుండా పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వడమే నా ధ్యేయం.. పట్టాదారు పుస్తకాల తో పారదర్శకత వస్తుంది.. కర్నూలు జిల్లాలో 8,745 మందికి కొత్త పట్టాదారు పుస్తకాలు పంపిణీ చేస్తున్నాం.. 37 లక్షల 40 వేలు పట్టాదారు పాసు పుస్తకాలు రెడీ అయ్యాయి.. నూటికి నూరు శాతం పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తామన్నారు. జనవరిలో ప్రారంభించి డిసెంబర్ వరకు భూమికి భద్రత ఇచ్చే పనిలో ఉంటా.. భూముల విషయంలో కొట్టుకోవద్దు.. అర సెంటు కోసం అన్నదమ్ములు, తల్లికొడుకులు కొట్టుకుంటున్నారు.. వారసత్వంగా వచ్చే భూమికి కొత్తగా మ్యూటేషన్ చేసుకోవాలంటే 100 రూపాయలు చెల్లిస్తే చాలు అని చంద్రబాబు నాయుడు తెలియజేశారు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ ప్రళయంలో మాజీ కేంద్ర మంత్రి కోడలు గల్లంతు
-
Toxic First Day Collection: ‘టాక్సిక్’ బాక్సాఫీస్ బ్లాస్ట్.. ఫస్ట్ డే రూ.150 కోట్లు
-
India and Sri Lanka: 429/9 వద్ద మ్యాచ్కు తెర.. కొలంబోలో భారత్, శ్రీలంక డ్రా.. సిరీస్ మనదే..
-
Nepal Floods: నేపాల్లో హృదయవిదారక పరిస్థితులు.. ఆత్మీయుల జాడ తెలియక అరణ్యరోదన
-
ICC: స్టార్ క్రికెటర్కు భారీ షాక్.. డోపింగ్ కేసులో 15 నెలల బ్యాన్
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!