Gudivada Amarnath: సాహితీ ఫార్మా మృతులకు ఎక్స్గ్రేషియా ప్రకటించిన మంత్రి అమర్నాథ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Gudivada Amarnath Announces 25 Lakhs Ex Gratia To Sahithi Pharma Deaths: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని సాహితీ ఫార్మాలో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనపై మంత్రి అమర్నాథ్ స్పందించారు. సాల్వెంట్ రికవరీ సమయంలో ఈ ప్రమాదం జరిగిందని ఆయన స్పష్టతనిచ్చారు. ప్రమాదం సమయంలో 35 మంది కార్మికులు పని చేస్తున్నారని.. ఏడుగురికి గాయాలు అయ్యాయని తెలిపారు. అయితే.. మార్గమధ్యంలో ఒకరు, చికిత్స పొందుతూ మరొకరు మరణించారని చెప్పారు. మిగిలిన బాధితులు కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారని.. ఆ బాధితులందరూ శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని అన్నారు. చికిత్స పొందుతున్న వారి పరిస్థితి కూడా విషమంగా ఉందన్నారు.
Sahithi Pharma Incident: ముగిసిన రెస్క్యూ ఆపరేషన్.. ప్రారంభమైన విచారణ
Also Read
- Off The Record : జోగి రమేష్కు అనవసరంగా మైలేజ్ ఇస్తున్నారా? వైసీపీ, టీడీపీలో చర్చలు?
- Off The Record : సిక్కోలు నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారా?
- TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
కేజీహెచ్లో క్షతగాత్రులకు వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారని చెప్పిన మంత్రి అమర్నాథ్.. రాష్ట్ర ప్రభుత్వం తరపున చనిపోయిన ఇద్దరికి రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా అందిస్తామని హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించడానికి, ఎక్కడికైనా తీసుకువెళ్లాడనికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పరిశ్రమలో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసిందన్నారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేస్తామని తెలిపారు. తాను ప్రమాద స్థలానికి వెళ్లి, అధికారులతో రివ్యూ ఏర్పాటు చేస్తున్నానని అన్నారు. ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే.. వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతకుముందు.. మంత్రి అమర్నాథ్ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.
CM KCR: రాబోయే ఎన్నికల్లో వంద శాతం మనమే గెలుస్తాం.. దాంట్లో అనుమానమే లేదు
ఇదిలావుండగా.. సాహితీ ఫార్మాలో నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. 10 ఫైర్ ఇంజన్లు, స్కై లిఫ్టర్ల సహాయంతో.. ఐదు గంటలకు పైగా శ్రమించి, బలగాలు మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో.. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆధ్వర్యంలో విచారణ ప్రారంభించారు. కెమికల్స్ని అన్లోడ్ చేస్తున్న సమయంలో.. రసాయనాలు ఒత్తిడికి గురయ్యాయని, ఈ క్రమంలోనే కంటైనర్కి నిప్పు అంటుకోవడంతో, నిమిషాల్లోనే మంటలు ఫ్యాక్టరీ మొత్తం వ్యాపించాయని తెలిసింది. ఈ మంటల్లో సాహితీ ఫార్మా యూనిట్-1 మొత్తం పూర్తిగా కాలి బూడిదైంది.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!