Home
Ap Liquor Scam
Ap Liquor Scam News
-
AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు రెగ్యులర్ బెయిల్
AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. అయితే, రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూనే.. కొన్ని షరతులు విధించింది హైకోర్టు.. నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు, నిర్దిష్ట షరతులతో వారికి బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే… -
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు 3 రోజుల ఈడీ కస్టడీ..!
AP Liquor Transport Scam: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ ట్రాన్స్పోర్ట్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఏపీఎస్బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ కు నాంపల్లి కోర్టు మూడు రోజుల ఈడీ కస్టడీని మంజూరు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు నేటి నుంచి ఈ ముగ్గురిని ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. కోర్టు అనుమతి తర్వాత చర్లపల్లి జైలులో… -
AP Liquor Scam Case: లిక్కర్ స్కామ్లో కీలక మలుపు.. సత్యప్రసాద్కు ముందస్తు బెయిల్.. ఏసీబీ కోర్టు ఉత్తర్వులు రద్దు..
AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎక్సైజ్ శాఖ మాజీ అసిస్టెంట్ కమిషనర్ సత్యప్రసాద్కు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు సోమవారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కల్పించాలని కోరుతూ సత్యప్రసాద్ తొలుత ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. అయితే, ఆ పిటిషన్ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. అప్రూవర్గా మారే… -
AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. మాజీ మంత్రి కారుమూరి కుమారుడి అరెస్ట్..
AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ రవాణా అక్రమాల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న కారుమూరి సునీల్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మాజీ ఏపీఎస్బీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, రాజ్ కేసిరెడ్డిలను అరెస్ట్ చేసిన ఈడీ, తాజాగా సునీల్ను అదుపులోకి తీసుకుంది. ఇక, అరెస్ట్ అనంతరం కారుమూరి సునీల్కు హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో వైద్య… -
AP Liquor Scam: లిక్కర్ కేసులో అరెస్ట్లపై ఈడీ కీలక ప్రకటన.. రూ.195.33 కోట్ల నష్టం..!
AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSBCL)లో జరిగినట్లు ఆరోపణలు ఉన్న ట్రాన్స్పోర్ట్ స్కామ్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి 2026 మే 22న ECIR/HYZO/17/2026 నంబరుతో మనీలాండరింగ్ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. దర్యాప్తు సంస్థ ప్రాథమిక అంచనాల ప్రకారం, ఈ కేసులో నిందితులు ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.195.33 కోట్ల మేర నష్టం కలిగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అదే… -
AP Liquor Scam Case: లిక్కర్ స్కామ్లో కీలక మలుపు.. రంగంలోకి దిగిన ఐటీ అధికారులు
AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ స్కామ్పై ఇప్పుడు ఆదాయపన్ను శాఖ (ఐటీ) దృష్టి సారించింది. సుమారు రూ.2000 కోట్ల అక్రమ లావాదేవీలపై ఐటీ అధికారులు దర్యాప్తు ప్రారంభించి, పన్ను ఎగవేత కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. ఈ వ్యవహారంలో డబ్బు ప్రవాహం, అక్రమ సంపాదన మార్గాలు, నిధుల తరలింపు విధానాలపై ఐటీ అధికారులు లోతుగా… -
Liquor Scam: లిక్కర్ కేసులో అవినాష్ రెడ్డికి రిమాండ్.. రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు!
Liquor Scam: ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన లిక్కర్ కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న ముప్పిడి అవినాష్ రెడ్డికు ACB కోర్టు విజయవాడ రేపటిదాకా రిమాండ్ విధించింది. ఈ కేసులో A7 నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డిని గుంటూరు జిల్లా జైలుకు తరలించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇతర నిందితుల రిమాండ్ గడువు కూడా ముగియనున్న నేపథ్యంలో అందరినీ కలిపి రేపు మళ్లీ కోర్టులో హాజరు పరచనున్నారు. IND vs ZIM: మ్యాచ్ కు వేళాయె.. రెండు… -
AP Liquor Scam Case: చెవిరెడ్డికి స్వల్ప ఊరట.. ఏసీబీ కోర్టు అనుమతి
AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన ఏపీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై.. విజయవాడ జిల్లా జైలులో 220 రోజులుగా రిమాండ్ ఖైదీగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి స్వల్ప ఊరట దక్కింది.. మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమంలో చికిత్స చేసుకునేందుకు చెవిరెడ్డికి అనుమతించింది ఏసీబీ కోర్టు.. ఆరోగ్య పరంగా తనకు మంతెన ఆశ్రమంలో చికిత్స చేసుకునేందుకు అనుమతించాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా..… -
AP Fake Liquor Case: మాజీ మంత్రి జోగి రమేష్కు బెయిల్.. అయినా జైలులోనే..!
AP Fake Liquor Case: ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ కేసుతో పాటు నకిలీ మద్యం తయారీ కేసు సంచలనం సృష్టించింది.. ఈ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కు స్వల్ప ఊరట లభించింది.. ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీకి సంబంధించిన కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు జోగి రాముపై నమోదైన కేసులో ఎక్సైజ్ కోర్టు ఇవాళ… -
AP Liquor Scam: ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం… వైసీపీ ఎంపీకి ఈడీ నోటీసులు..
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో ఎంపీకి నోటీసులు జారీ చేసింది.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23వ తేదీన విచారణకు హాజరుకావాలని ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ స్పష్టం చేసింది. లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు అనుమానాలు ఉన్నాయని…
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!