AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. మాజీ మంత్రి కారుమూరి కుమారుడి అరెస్ట్..
- ఏపీ లిక్కర్ రవాణా అక్రమాల కేసులో కారుమూరి సునీల్ అరెస్ట్..
- కారుమురి సునీల్ ను అరెస్ట్ చేసిన ED ..
- లిక్కర్ రవాణా ద్వారా 195.33 కోట్ల కుంభకోణం కి పాల్పడినట్లు గుర్తింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ రవాణా అక్రమాల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న కారుమూరి సునీల్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మాజీ ఏపీఎస్బీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, రాజ్ కేసిరెడ్డిలను అరెస్ట్ చేసిన ఈడీ, తాజాగా సునీల్ను అదుపులోకి తీసుకుంది. ఇక, అరెస్ట్ అనంతరం కారుమూరి సునీల్కు హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయనను నాంపల్లిలోని ఈడీ ప్రత్యేక కోర్టుకు తరలించారు. మరికాసేపట్లో ఆయనను కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈడీ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, లిక్కర్ రవాణా ఒప్పందాల వ్యవహారంలో సుమారు రూ.195.33 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. టెండర్ల కేటాయింపులో నిబంధనలను ఉల్లంఘించి అక్రమ లాభాలు పొందినట్లు ఈడీ ఆరోపిస్తోంది. జిల్లా స్థాయిలో ఒక్కో కార్టన్కు సగటున రూ.19.68గా ఉన్న రవాణా రేట్లను రూ.35.57 వరకు పెంచి భారీ మొత్తంలో లాభాలు ఆర్జించినట్లు విచారణలో తేలినట్లు సమాచారం. అలాగే స్థానిక రాజకీయ నాయకులు, వారి అనుబంధ వ్యక్తులు, సంస్థలకు సబ్ కాంట్రాక్టులు కేటాయించే సమాంతర వ్యవస్థను నిర్వహించినట్లు ఈడీ గుర్తించినట్లు తెలుస్తోంది.
Also Read
- CM Revanth Reddy: ‘2034 వరకు నేనే సీఎంగా ఉంటా.. మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోకండి’: సీఎం రేవంత్ రెడ్డి
- WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
- PM Modi: సీనియర్ మంత్రులు, ఉన్నతాధికారులతో మోడీ హైలెవల్ మీటింగ్.. అజెండాపై ఉత్కంఠ
- 7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
ఈ వ్యవహారంలో అప్పటి ఏపీఎస్బీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి ప్రధాన సూత్రధారిగా వ్యవహరించినట్లు ఈడీ ఆరోపిస్తోంది. చట్టబద్ధంగా అమల్లో ఉన్న జిల్లా స్థాయి రవాణా విధానాన్ని రద్దు చేసి, ప్రభుత్వ అనుమతి లేకుండానే రాష్ట్రవ్యాప్త కేంద్రీకృత రవాణా విధానాన్ని అమలు చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు అధికారులు పేర్కొన్నారు. లిక్కర్ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన ఈడీ, మనీలాండరింగ్ కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తోంది. కారుమూరి సునీల్ అరెస్ట్తో ఈ కేసులో మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
ఆపదలో దేవుడిలా మారిన Apple Watch.. కూతురు ఇచ్చిన గిఫ్ట్.. తండ్రికి ప్రాణం పోసింది!
-
CM Revanth Reddy: ‘2034 వరకు నేనే సీఎంగా ఉంటా.. మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోకండి’: సీఎం రేవంత్ రెడ్డి
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
Janhvi Kapoor: జాన్వీ కపూర్కు ఆ స్టార్తో నిజంగానే గ్యాప్ వచ్చిందా?
-
PM Modi: సీనియర్ మంత్రులు, ఉన్నతాధికారులతో మోడీ హైలెవల్ మీటింగ్.. అజెండాపై ఉత్కంఠ
ట్రెండింగ్
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!