AP Liquor Scam Case: లిక్కర్ స్కామ్లో కీలక మలుపు.. రంగంలోకి దిగిన ఐటీ అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ స్కామ్పై ఇప్పుడు ఆదాయపన్ను శాఖ (ఐటీ) దృష్టి సారించింది. సుమారు రూ.2000 కోట్ల అక్రమ లావాదేవీలపై ఐటీ అధికారులు దర్యాప్తు ప్రారంభించి, పన్ను ఎగవేత కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. ఈ వ్యవహారంలో డబ్బు ప్రవాహం, అక్రమ సంపాదన మార్గాలు, నిధుల తరలింపు విధానాలపై ఐటీ అధికారులు లోతుగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా హవాలా మార్గం ద్వారా డబ్బు విదేశాలకు తరలించబడినట్టు అనుమానిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ నిధులు దుబాయ్కు మళ్లించబడినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది.
దర్యాప్తులో మరో సంచలన విషయం బయటపడింది. నెలకు రూ.50 నుంచి 60 కోట్ల వరకు అక్రమ నగదు సృష్టించబడినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. అలాగే, డిస్టలరీల నుంచి వెండర్లకు ఐదు రెట్లు ఎక్కువగా చెల్లింపులు జరిగినట్లు కూడా వెల్లడైంది. ఈ లావాదేవీల వెనుక పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని అధికారులు అనుమానిస్తున్నారు. ఇంకా, ఎలాంటి సరుకుల సరఫరా జరగకపోయినా, ఫేక్ ఇన్వాయిస్లు సృష్టించి రెండు డిస్టిల్లరీలు సుమారు రూ.76.92 కోట్లను తరలించినట్టు గుర్తించారు. ఈ విధంగా డిజిటల్ ట్రైల్ను తప్పించుకునేందుకు మొత్తం లావాదేవీలను ‘బ్లాక్ మనీ’గా దాచిపెట్టినట్టు ఐటీ అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో పాల్గొన్న అనుమానితులపై త్వరలోనే నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. మొత్తం వ్యవహారంపై ఐటీ శాఖ దర్యాప్తు మరింత వేగం పుంజుకుంటుండటంతో, రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశముంది.
Also Read
- TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
- Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక డ్యాష్బోర్డులు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
- Kharif Water Release: ఖరీఫ్కు నీటి విడుదలపై ప్రభుత్వం ఫోకస్.. కృష్ణా, గోదావరి డెల్టాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
తాజావార్తలు
-
Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
-
Twisha Sharma Case: ట్విషా శర్మ భర్తపై లుక్ ఔట్ నోటీసులు
-
Manchu Manoj: రాజకీయాల్లోకి మంచు వారి కోడలు! స్పష్టం చేసిన హీరో మనోజ్….
-
PM Modi: ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Sudheer Joker: రాయల్ ఫ్యామిలీ దొంగ… ఆసక్తి రేపుతున్న ‘సుధీర్ జోకర్’ బ్యాంగర్!
ట్రెండింగ్
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!