AP Liquor Scam: లిక్కర్ కేసులో అరెస్ట్లపై ఈడీ కీలక ప్రకటన.. రూ.195.33 కోట్ల నష్టం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSBCL)లో జరిగినట్లు ఆరోపణలు ఉన్న ట్రాన్స్పోర్ట్ స్కామ్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి 2026 మే 22న ECIR/HYZO/17/2026 నంబరుతో మనీలాండరింగ్ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. దర్యాప్తు సంస్థ ప్రాథమిక అంచనాల ప్రకారం, ఈ కేసులో నిందితులు ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.195.33 కోట్ల మేర నష్టం కలిగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో అక్రమ మార్గాల్లో భారీగా ఆర్థిక లాభాలు పొందినట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా జూన్ 11, 2026న ఐదు ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టుల కేటాయింపు, ఆర్థిక లావాదేవీలు, షెల్ కంపెనీల ద్వారా నిధుల మళ్లింపు, అక్రమ ఆస్తుల కొనుగోలు వంటి అంశాలపై అధికారులు ఆధారాలు సేకరిస్తున్నట్లు సమాచారం. సోదాల సమయంలో నగదు, కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలు, బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించిన పలు రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. స్వాధీనం చేసుకున్న వస్తువుల పూర్తి వివరాలను ఈడీ త్వరలో అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.
Also Read
- AP COVID-19 Update: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పెరుగుతోన్న ఒమిక్రాన్ RF.5 వేరియంట్ కేసులు
- YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- CM Chandrababu: టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్.. సమన్వయంపై ప్రత్యేక దృష్టి
ఈ ట్రాన్స్పోర్ట్ స్కామ్కు సంబంధించి పలువురు కీలక వ్యక్తుల పాత్రపై కూడా విచారణ కొనసాగుతోందని సమాచారం. ఆర్థిక లావాదేవీల పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చిన తర్వాత మరిన్ని చర్యలు తీసుకునే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, కాంట్రాక్టుల కేటాయింపుల్లో జరిగినట్లు ఆరోపణలు ఉన్న అవకతవకలు, మనీలాండరింగ్ కోణాలు వంటి అంశాలపై ఈడీ లోతుగా దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ కేసు పురోగతిపై రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
మొత్తంగా ఏపీ లిక్కర్ ట్రాన్స్పోర్ట్ స్కామ్లో విచారణ ముమ్మరం చేశామని ఈడీ ప్రకటించింది.. ఈ స్కామ్లో రూ.195 కోట్ల నష్టం వాటిల్లినట్లు గుర్తించామని.. అక్రమ మార్గాల్లో తమ అనుచరులకు లాభాలు చేకూర్చారనే ఆరోపణలు ఉన్నాయి.. ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టులు, షెల్ కంపెనీల ద్వారా ఆర్థిక లావాదేవీలు గుర్తించాం.. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజ్కేసిరెడ్డి, వాసుదేవరెడ్డిలను అరెస్ట్ చేశాం.. ఇక, రాజ్ కేసిరెడ్డి, వాసుదేవరెడ్డి, విజయనర్సింహరెడ్డి, వల్లు సందీప్, కారుమూరి నాగేశ్వరరావు, సునీల్ కుమార్ ఇళ్లల సోదాలు నిర్వహించాం.. కారిమూరి ఇంట్లో 2 రోలక్స్ వాచ్లు రేంజ్ రోవర్ కారు సీజ్ .. కారుమూరి ఇంట్లో దొరికిన ఫోన్లో హవాలాకు సంబంధించిన చాటింగ్ను రికవరీ చేశామని పేర్కొంది ఈడీ..
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!