AP Liquor Scam: లిక్కర్ కేసులో అరెస్ట్లపై ఈడీ కీలక ప్రకటన.. రూ.195.33 కోట్ల నష్టం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSBCL)లో జరిగినట్లు ఆరోపణలు ఉన్న ట్రాన్స్పోర్ట్ స్కామ్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి 2026 మే 22న ECIR/HYZO/17/2026 నంబరుతో మనీలాండరింగ్ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. దర్యాప్తు సంస్థ ప్రాథమిక అంచనాల ప్రకారం, ఈ కేసులో నిందితులు ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.195.33 కోట్ల మేర నష్టం కలిగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో అక్రమ మార్గాల్లో భారీగా ఆర్థిక లాభాలు పొందినట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా జూన్ 11, 2026న ఐదు ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టుల కేటాయింపు, ఆర్థిక లావాదేవీలు, షెల్ కంపెనీల ద్వారా నిధుల మళ్లింపు, అక్రమ ఆస్తుల కొనుగోలు వంటి అంశాలపై అధికారులు ఆధారాలు సేకరిస్తున్నట్లు సమాచారం. సోదాల సమయంలో నగదు, కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలు, బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించిన పలు రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. స్వాధీనం చేసుకున్న వస్తువుల పూర్తి వివరాలను ఈడీ త్వరలో అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.
Also Read
- Tobacco Farmers: పొగాకు రైతులకు సర్కార్ గుడ్న్యూస్.. క్వింటాల్కు రూ.1,000 ప్రోత్సాహకం, వడ్డీలేని రుణాలు
- AP PPP Policy 2026కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. కీలక ఉత్తర్వులు జారీ
- AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. పంచాయతీరాజ్ శాఖ క్లారిటీ
- Snake Bite Treatment in 108 ambulance: పాముకాటుకు అంబులెన్స్లోనే చికిత్స.. 108 వాహనాల్లో తొలిసారి ఇంజక్షన్లు
ఈ ట్రాన్స్పోర్ట్ స్కామ్కు సంబంధించి పలువురు కీలక వ్యక్తుల పాత్రపై కూడా విచారణ కొనసాగుతోందని సమాచారం. ఆర్థిక లావాదేవీల పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చిన తర్వాత మరిన్ని చర్యలు తీసుకునే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, కాంట్రాక్టుల కేటాయింపుల్లో జరిగినట్లు ఆరోపణలు ఉన్న అవకతవకలు, మనీలాండరింగ్ కోణాలు వంటి అంశాలపై ఈడీ లోతుగా దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ కేసు పురోగతిపై రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
మొత్తంగా ఏపీ లిక్కర్ ట్రాన్స్పోర్ట్ స్కామ్లో విచారణ ముమ్మరం చేశామని ఈడీ ప్రకటించింది.. ఈ స్కామ్లో రూ.195 కోట్ల నష్టం వాటిల్లినట్లు గుర్తించామని.. అక్రమ మార్గాల్లో తమ అనుచరులకు లాభాలు చేకూర్చారనే ఆరోపణలు ఉన్నాయి.. ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టులు, షెల్ కంపెనీల ద్వారా ఆర్థిక లావాదేవీలు గుర్తించాం.. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజ్కేసిరెడ్డి, వాసుదేవరెడ్డిలను అరెస్ట్ చేశాం.. ఇక, రాజ్ కేసిరెడ్డి, వాసుదేవరెడ్డి, విజయనర్సింహరెడ్డి, వల్లు సందీప్, కారుమూరి నాగేశ్వరరావు, సునీల్ కుమార్ ఇళ్లల సోదాలు నిర్వహించాం.. కారిమూరి ఇంట్లో 2 రోలక్స్ వాచ్లు రేంజ్ రోవర్ కారు సీజ్ .. కారుమూరి ఇంట్లో దొరికిన ఫోన్లో హవాలాకు సంబంధించిన చాటింగ్ను రికవరీ చేశామని పేర్కొంది ఈడీ..
తాజావార్తలు
-
Colombia Earthquake: 7.4 తీవ్రతతో భూకంపం.. 111 మంది మృతి, శిథిలాల కింద పలువురు
-
Agadha Pre Release Event: ‘అగధ’తో ఎంఎస్ రాజు కమ్బ్యాక్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అదిరిపోయే రెస్పాన్స్.. కల్ట్ క్లాసిక్ అవుతుందా?
-
Astrology: ఆగస్టు 11 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!