ఏపీ ప్రభుత్వం అమలుచేస్తున్న పీఆర్సీపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ఉద్యోగులు ఆందోళన బాట పట్టడంతో ఎస్మా ప్రయోగించే అంశంపై ఆలోచన చేస్తోంది ప్రభుత్వం. కీలక శాఖలు కూడా ఉద్యమంలోకి వెళ్తామంటూ స్పష్టం చేయడంతో అలెర్టయింది ప్రభుత్వం. సమ్మె దిశగా అడుగులేస్తోన్న ఆర్టీసీ, విద్యుత్, వైద్యారోగ్య శాఖ ఉద్యోగులను ఎలాగైనా దారికి తీసుకురావాలని భావిస్తోంది. ఎస్మా ప్రయోగించే అంశంపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. ఏయే శాఖల్లోని ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించవచ్చనే అంశంపై శాఖల వారీగా జాబితాను సిద్దం చేస్తోన్న…
ఏపీలో పీఆర్జీ జీవోలు రద్దుచేయాలని ఏపీ గెజిటెడ్ అధికారుల జేఏసీ చైర్మన్ కేవీ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వంతో గెజిటెడ్ అధికారుల జేఏసీ చర్చలకు వెళ్ళడంలేదన్నారు. సోమవారం హైకోర్టు నిర్ణయాన్ని బట్టి మా కార్యాచరణ ఉంటుందన్నారు. కొత్త పీ ఆర్ సీ అంశం హై కోర్టు లో విచారణ ముగిసిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ పై జేఏసీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఉద్యోగుల న్యాయమైన హక్కులు కాపాడుకునేందుకు చివరి వరకు పోరాడతాం అన్నారు. గతంలో ఉద్యోగుల హక్కులు కాపాడే…
ఏపీ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు. విశాఖలో ఉన్న లక్షలాది మంది కార్మికులకు వైద్య సేవలు అందించేందుకు ఈఎస్ఐ ఆస్పత్రి, వైద్య కళాశాల నిర్మించాలని కేంద్రం ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇవ్వని కారణంగా కళాశాల లేకుండా ఆసుపత్రి నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరు చేసింది. కేవలం ఆసుపత్రి నిర్మాణానికి రూ. 400 కోట్లు నిధులు కేంద్రం కార్మిక శాఖ మంజూరు చేసింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్ధలం సేకరించి ప్రతిపాదనలు…
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధం అవుతోందా? ఎన్నికల హామీ నిలబెట్టుకుంటున్నారు సీఎం జగన్. కొత్త జిల్లాల ఏర్పాటు పై ఫోకస్ చేసిన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి ఒకటిరెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయనుంది ప్రభుత్వం. ప్రతి లోక్సభ నియోజక వర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన వైసీపీ హామీల అమలుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే సంప్రదింపులు పూర్తి చేసిన…
ఏపీలో ఉద్యోగ సంఘాలు ఉద్యమానికి రెడీ అవుతున్నాయి. ఉద్యోగసంఘాలన్నీ కలిపి రేపు మధ్యాహ్నం 3 గంటలకు సమ్మె నోటీసులు ఇస్తామని ఉద్యోగ సంఘాల స్టీరింగ్ కమిటీలు తెలిపాయి. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో సమరానికి సై అంటున్నాయి అన్ని సంఘాలు. పీఆర్సీ వల్ల కలిగిన నష్టాలను పూడ్చాలని డిమాండ్ చేశాయి. నాలుగుజీవోలు రద్దుచేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇదిలా వుంటే… ఏపీ ఉద్యోగ సంఘ నేతలకు జీఏడీ సెక్రటరీ శశి భూషణ్ ఫోన్ చేశారు. రేపు మంత్రులతో…
ఏపీలో పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఉద్యమం ఊపందుకుంటోంది. తాజాగా అమరావతి నుంచి ప్రారంభం అయిన ఉద్యమం విశాఖ సాగరతీరానికి చేరింది. విశాఖ జిల్లా స్ధాయిలోనూ ఉద్యోగ జేఏసీలు ఏకమయ్యాయి. పీఆర్సీ సాధన సమితిగా ఏర్పాటయినట్టు సమితి కన్వీనర్ ఈశ్వర్రావు తెలిపారు. ఈనెల 25 న బైక్ ర్యాలీతో నగరమంతా నిరసన తెలుపుతామంటున్నారు. ఫిబ్రవరి 3 న ఛలో విజయవాడ తలపెట్టామన్నారు. తమ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లి వారి మద్దతు కూడగట్టుకుంటామన్నారు ఈశ్వరరావు. ఫిబ్రవరి 7 తేదీన…
సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన ఆ నాయకుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. మరోసారి కేబినెట్లో చోటుదక్కలేదన్న ఆవేదనో ఏమో.. సైలెంట్. ఇప్పుడు గేర్మార్చి మాటల తూటాలు పేలుస్తున్నారు. ఎందుకలా? ధర్మాన ప్రసాదరావు కామెంట్స్తో అలజడి..!ధర్మాన ప్రసాదరావు. ఆయన మాట్లాడితే ఒక పదం ఎక్కువ తక్కువ ఉండదు. సూటిగా సుత్తిలేకుండా చెప్పేస్తారు. సిక్కోలు జిల్లాలో కీలకనేతగా గుర్తింపు పొందిన ప్రసాదరావు.. చాన్నాళ్లు మంత్రిగా ఉన్నారు. వైసీపీలో చేరి ఎమ్మెల్యే అయ్యాక మరోసారి కేబినెట్లో చోటు దక్కుతుందని ఆశించినా..…
ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ మండిపడ్డారు. బిసీలకు ఎన్టీఆర్ ఆరాధ్యదైవం అయితే..ఆయన్ను పదవీవీచ్చుతుణ్ని చేసిన సందర్భంలో, మరణించినప్పుడు మీరు ప్రవర్తించిన తీరు బీసీల మనోభావాలను దెబ్బతీసాయన్నారు. తెలుగుదేశం పార్టీ బీసీల ద్రోహి. బీసీలంటే టీడీపీలో యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు మాత్రమే అన్నారు. అధికారంలో ఉండగా బీసీలను చంద్రబాబు పట్టించుకోలేదు. మత్స్యకారులను..నాయి బ్రహ్మణులను తోలు వలుస్తా..తోకలు కత్తిరిస్తా అంటూ చాలా చులనగా చేసి మాట్లాడారు. బీసీలు మా వెనుకున్నారని చంద్రబాబు…