ఏపీ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు. విశాఖలో ఉన్న లక్షలాది మంది కార్మికులకు వైద్య సేవలు అందించేందుకు ఈఎస్ఐ ఆస్పత్రి, వైద్య కళాశాల నిర్మించాలని కేంద్రం ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇవ్వని కారణంగా కళాశాల లేకుండా ఆసుపత్రి నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరు చేసింది.
కేవలం ఆసుపత్రి నిర్మాణానికి రూ. 400 కోట్లు నిధులు కేంద్రం కార్మిక శాఖ మంజూరు చేసింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్ధలం సేకరించి ప్రతిపాదనలు పంపితే వైద్యకళాశాల కూడా వచ్చే అవకాశం ఉంది.వైద్యకళాశాల ఉంటే వైద్య విద్యార్ధులతోపాటు అనేక రంగాలకు ఉపాధి ఉంటుంది.ఇక్కడ కార్మికులకు మంచి వైద్యం అందేందుకు అవకాశం ఉంటుందన్నారు సోము వీర్రాజు.