Home
Ap Govt
Ap Govt News
-
Tomatos Theft: టమోటా దొంగలు.. పరేషాన్లో రైతులు
దేశంలో దొంగలు పడడం మామూలే కానీ. ఏపీలో దొంగలు పడ్డారు. ఆ దొంగలకు బంగారం, డబ్బు అవసరం లేదు. వారికేం కావాలో తెలిస్తే మీరే షాకవుతారు. పొలంలో పండిన టమోటా బాక్సులు ఎత్తుకెళ్ళిపోతున్నారు. టమోటా ధరలు ఆకాశాన్నంటిన వేళ దొంగల కళ్ళు టమోటాలపై పడ్డాయి. చిత్తూరు జిల్లా సోమల మండలంలో టమోటాల కోసం దొంగలు పడ్డరు. రాష్ట్రంలో టమోటా ధరలు ఆకాశాన్ని అంటడంతో చిత్తూరు జిల్లా సోమలలో దొంగల బెడద ఎక్కువైందని రైతులు వాపోతున్నారు.ఇన్నిరోజులు ధరలు లేక… -
Yanamala Ramakrishnudu: జగన్ లండన్ ల్యాండింగ్ మిస్టరీ ఏంటి?
ఏపీ సీఎం జగన్పై మండిపడ్డారు టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. సీఎం జగన్ లండన్ ల్యాండింగ్ మిస్టరీ ఏమిటి..? దండుకున్న అవినీతి సంపద దాచుకోడానికేనా అనే అనుమానాలున్నాయి. సీఎం జగన్ ఆ అనుమానాలు నివృత్తి చేయాలి. మూడేళ్ల తర్వాత దావోస్ వెళ్లడం రాష్ట్రం కోసమా, తన కోసమా..? అక్రమార్జన నల్లధనం తరలింపు కోసమా..? దండుకున్న సంపద దాచుకోడానికే లండనులో ల్యాండింగా అనే అనుమానం ప్రజల్లో ప్రబలంగా ఉంది. అధికారికంగానే జగన్ లండన్ వెళ్లవచ్చు కదా..?… -
Andhrapradesh: టీడీపీ నేత ఆలూరి హరి కృష్ణ విడుదల
గొల్లపూడిలో అరెస్ట్ చేసిన దేవినేని ఉమా అనుచరుడు ఆలూరి హరికృష్ణ (చిన్నా)ను భవానీపురం పోలిస్ స్టేషన్ కు తరలించారు. 41 నోటీస్ ఇచ్చి చిన్నాను విడుదల చేశారు పోలీసులు. మరోసారి పిలిచినప్పుడు స్టేషన్ కు రావాలని పోలీసులు స్పష్టం చేశారు. చిన్నా విడుదల అయిన అనంతరం టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు మాట్లాడారు. టీడీపీ నాయకుల పై అక్రమ కేసులు… ఏం సాధించవ్ జగన్…? రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది. రాష్ట్రానికి అంబేద్కర్ రాజ్యాంగం… -
Panchayati Funds: పంచాయతీ రాజ్ ఛాంబర్, సర్పంచ్ల ఫిర్యాదు
ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ను కలిశారు ఏపీ పంచాయతీ రాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘం ప్రతినిధులు. రూ. 7660 కోట్ల నిధులను పంచాయతీ ఖాతాల్లో నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకుందని గవర్నరుకి ఫిర్యాదు చేశారు సర్పంచుల సంఘం. కేంద్ర ప్రభుత్వం 14,15వ ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు పంపించిన నిధులు రూ. 7660 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం తన సొంత అవసరాలకు వాడుకుందంటూ గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళారు సర్పంచులు. పంచాయతీ ఖాతాల్లోకి… -
GVL Narasimha Rao: విజయవాడ- ఢిల్లీ విమానాలు పెంచాలి
విజయవాడ- ఢిల్లీ మధ్య విమానాల రాకపోకలు పెంచాలని కేంద్ర మంత్రికి, విమానయాన సంస్థలకు ఎంపీ జీవీఎల్ నరసింహారావు అభ్యర్థించారు. విజయవాడ- ఢిల్లీ మధ్య విమానాల సంఖ్య తగ్గించడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఎంపీ అన్నారు. ఎంతోమందికి ఉపయుక్తంగా ఉన్న విజయవాడ-ఢిల్లీ మధ్య విమానాల సంఖ్యను పెంచాలని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఏయిర్ ఇండియా, ఇండిగో ఎయిర్ లైన్స్, మరియు స్పైస్ జెట్ వంటి విమానయాన సంస్థలకు లేఖలు రాశారు బీజేపీ ఎంపీ జీవీఎల్… -
Disha App Event: దిశ యాప్ మహిళలకు రక్షణ కవచం
రాష్ట్రంలోని మహిళలందరూ దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు. ఎన్టీఆర్ జిల్లాలో దిశా యాప్ మెగా ఈవెంట్ నిర్వహించారు. ఒకే రోజు రెండు లక్షల మంది డౌన్ లోడ్ చేసుకునేలా జిల్లా వ్యాప్తంగా దిశా ఎస్.ఓ.ఎస్ యాప్ పై మాస్ క్యాంపెయిన్ జరుగుతోంది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి దిశా యాప్ మెగా ఈవెంట్ ప్రారంభం అయింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు, పోలీస్ కమీషనర్… -
LIVE: వైసీపీ ఎమ్మెల్సీ కారులో మృతదేహం.. అసలేం జరిగింది?
కాకినాడ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్సీ కారులో డ్రైవర్ డెడ్ బాడీ కలకలం రేపుతోంది? అసలేం జరిగిందనేది హాట్ టాపిక్ అవుతోంది. మృతుడు సుబ్రహ్మణ్యం భార్య తో ఫోన్ లో మాట్లాడారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడలో అధికారపార్టీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ బాబు కారులో డ్రైవర్ మృతదేహం కలకలం రేపుతోంది. మృతదేహం ఎమ్మెల్సీ దగ్గర పనిచేసే డ్రైవర్ సుబ్రమణ్యంది గుర్తించారు. గురువారం ఉదయం ఎమ్మెల్సీ ఉదయ్ బాబు… -
Vijayawada Govt Hospital: సర్కారీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి
సాధారణంగా గుండె వ్యాధులకు ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే మెరుగైన వైద్యం వుంటుందని భావిస్తారు. కానీ ప్రైవేట్ ఆసుపత్రులను మించి అత్యాధునికమైన గుండెకు సంబంధించిన వైద్యాన్ని అందిస్తున్నారు విజయవాడ లోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు. గుండె వ్యాధిగ్రస్తులకు పూర్తి భరోసా ఇస్తున్నారు. గుండెకు సంబంధించిన వ్యాధి వచ్చిందంటే వెంటనే గుర్తుకు వచ్చేది ప్రైవేట్ ఆసుపత్రి. కానీ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం ప్రైవేటు ఆసుపత్రిలో అందించే వైద్యం ఇక్కడ అందించటం విశేషం. అంతే కాకుండా ఇక్కడ విజయవంతంగా అరుదైన గుండె… -
Janasena: టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై జనసేన ఫైర్
తిరుమలలో అమలవుతున్న విధానాలు, ధర్మారెడ్డి తీరుపై జనసేన మండిపడింది. ప్రభుత్వం మాదనే ఉద్దేశంతోనే ఇష్టమొచ్చినట్టు తిరుమలలో వ్యవహరిస్తున్నారని ఈవో ధర్మారెడ్డిపై మండిపడ్డారు జనసేన నేత కిరణ్ రాయల్. టీటీడీలో ఏదో జరుగుతోంది, జవహర్ రెడ్డి ని హడావుడిగా బదిలీ చేయడం వెనక కారణం ఏంటి…?గడువు ముగిసిన టీటీడీ ఈఓగా ధర్మారెడ్డిని కొనసాగింపు ఎందుకు….? అని ఆయన ప్రశ్నించారు. ధర్మారెడ్డి దేవస్థానం లా మార్చేశారు. ఏపీలో ఇంకెవరు ఐఏఎస్ లు లేరా…? ఐడిఈయస్ హోదా లో ఉన్న ధర్మారెడ్డి… -
Kakani GovardhanReddy: రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవస్థలో మార్పు
నాలుగో ఏడాది తొలి విడత వైఎస్సార్ రైతు భరోసా సాయం అందించే కార్యక్రమాన్ని పశ్చిమగోదావరి జిల్లాలో ప్రారంభించారు సీఎం జగన్. ఈ సందర్భంగా మంత్రి గోవర్ధన్ రెడ్డి మాట్లాడారు. వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా రైతులను సీఎం జగన్ ఆదుకుంటున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు అండగా నిలిచిన సీఎం జగన్ మాత్రమే అన్నారు. RBK ల ద్వారా వ్యవస్థలో మార్పు తీసుకువచ్చామన్నారు. రాష్ట్రంలో 10,779 RBK లను ఏర్పాటు చేయడం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు.…
తాజావార్తలు
-
Bengal: 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి
-
Digital Arrest Scam: దేశంలోనే బిగ్గెస్ట్ డిజిటల్ అరెస్ట్.. వృద్ధురాలి నుంచి ఏకంగా రూ.24 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు!
-
HYD RACING NEWSENSE: రేసింగ్లకు పాల్పడే పోకిరీలు మరింత రెచ్చిపోయారు..! ఏకంగా పోలీసుల మీదకే కార్లతో దూసుకొచ్చి హంగామా
-
OTR : పవన్ కల్యాణ్ క్లాస్ రూమ్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Master Plan: ఊరి జనాల్ని నమ్మించి.. మాస్టర్ స్కెచ్ వేశారు.. రూ.కోటితో పరార్..
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?