Vijayawada Govt Hospital: సర్కారీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా గుండె వ్యాధులకు ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే మెరుగైన వైద్యం వుంటుందని భావిస్తారు. కానీ ప్రైవేట్ ఆసుపత్రులను మించి అత్యాధునికమైన గుండెకు సంబంధించిన వైద్యాన్ని అందిస్తున్నారు విజయవాడ లోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు. గుండె వ్యాధిగ్రస్తులకు పూర్తి భరోసా ఇస్తున్నారు. గుండెకు సంబంధించిన వ్యాధి వచ్చిందంటే వెంటనే గుర్తుకు వచ్చేది ప్రైవేట్ ఆసుపత్రి. కానీ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం ప్రైవేటు ఆసుపత్రిలో అందించే వైద్యం ఇక్కడ అందించటం విశేషం. అంతే కాకుండా ఇక్కడ విజయవంతంగా అరుదైన గుండె చికిత్సలు, మరియు ఖరీదైన రోటాబ్లేషన్, ప్రైమరీ యంజియోప్లాస్టీలు వంద శాతం సక్సెస్ రేట్ తో నిర్వహిస్తున్నారు.
దీంతో గుండె వ్యాధిగ్రస్తులకు భరోసా ఇస్తున్న ప్రభుత్వ ఆసుపత్రిగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి నిలుస్తుంది. దాదాపు 4 లక్షల నుంచి 6 లక్షల వరకు ఖర్చు అయ్యే రోటాబ్లేషన్, యాంజియేప్లాస్టీల్ పరీక్షలు ఉచితంగా చేస్తూ రోగులకు భరోసా నింపుతున్నారు. రోగి ఛాతిలో నొప్పి వస్తే ఆసుపత్రికి వచ్చిన గంటల వ్యవధిలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి రోగులకు అవసరం అయిన వైద్యం అందిస్తున్నారు. అంతే కాదు ప్రతిరోజు ఆసుపత్రిలో గుండెకు సంబంధించి ఓపీ విభాగం వుంటుందని వైద్యులు చెబుతున్నారు.
Also Read
- OTR: నెల్లూరులో ప్రజారాజ్యం ఫార్ములా ఫాలో అవుతున్న జనసేన..?
- Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
- Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
- Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
ఒకప్పుడు ఆసుపత్రిలో క్యాథ్ ల్యాబ్ వుండేది కాదని ప్రస్తుతం గుండెకు సంబంధించిన అన్ని రకాల ఎక్విప్ మెంట్ లు అందుబాటులోకి వచ్చాయని వైద్యులు అంటున్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా లేని విధంగా లామినర్ ప్లో, ఐసీయూ వార్డులు వుండటంతో గుండె వ్యాధిగ్రస్తులు ప్రభుత్వాసుపత్రికి క్యూ కడుతున్నారు.
ఇటీవలే ప్రైమరీ యంజియోప్లాస్ట్ లతో పాటుగా యాంజియోప్లాస్ట్ లను విజయవంతంగా చేశామని వంద శాతం ఇక్కడికి వచ్చే గుండె వ్యాధిగ్రస్తులకు వారి జీవితానికి భరోసా ఇస్తున్నామని అంటున్నారు వైద్యులు. ఐసీయూలో వున్న పేషంట్స్ సైతం తమకు చికిత్స బాగా అందుతుందని అంటున్నారు, పూర్తి స్థాయిలో కార్డియాలజీ వైద్యులు వుండటంతో ప్రతిరోజూ 10 వరకు యాంజియోగ్రామ్ , యాంజియోప్లాస్ట్ లు నిర్వహిస్తున్నాం అంటున్నారు వైద్యులు.
IND Vs SA: గుడ్న్యూస్.. విశాఖ టీ20కి 100 శాతం ప్రేక్షకులకు ఎంట్రీ
తాజావార్తలు
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
-
Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
-
OTR: కాంగ్రెస్ కంచుకోటలో గ్రూప్ వార్.. క్యాడర్లో పెరుగుతున్న అసంతృప్తి..
-
SJ Suryah Bodhi: ‘జైలర్ 2’ నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
-
Etela Rajender : ధరణి పేరుతో పేద రైతులకు తీవ్ర అన్యాయం
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!