Vijayawada Govt Hospital: సర్కారీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా గుండె వ్యాధులకు ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే మెరుగైన వైద్యం వుంటుందని భావిస్తారు. కానీ ప్రైవేట్ ఆసుపత్రులను మించి అత్యాధునికమైన గుండెకు సంబంధించిన వైద్యాన్ని అందిస్తున్నారు విజయవాడ లోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు. గుండె వ్యాధిగ్రస్తులకు పూర్తి భరోసా ఇస్తున్నారు. గుండెకు సంబంధించిన వ్యాధి వచ్చిందంటే వెంటనే గుర్తుకు వచ్చేది ప్రైవేట్ ఆసుపత్రి. కానీ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం ప్రైవేటు ఆసుపత్రిలో అందించే వైద్యం ఇక్కడ అందించటం విశేషం. అంతే కాకుండా ఇక్కడ విజయవంతంగా అరుదైన గుండె చికిత్సలు, మరియు ఖరీదైన రోటాబ్లేషన్, ప్రైమరీ యంజియోప్లాస్టీలు వంద శాతం సక్సెస్ రేట్ తో నిర్వహిస్తున్నారు.
దీంతో గుండె వ్యాధిగ్రస్తులకు భరోసా ఇస్తున్న ప్రభుత్వ ఆసుపత్రిగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి నిలుస్తుంది. దాదాపు 4 లక్షల నుంచి 6 లక్షల వరకు ఖర్చు అయ్యే రోటాబ్లేషన్, యాంజియేప్లాస్టీల్ పరీక్షలు ఉచితంగా చేస్తూ రోగులకు భరోసా నింపుతున్నారు. రోగి ఛాతిలో నొప్పి వస్తే ఆసుపత్రికి వచ్చిన గంటల వ్యవధిలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి రోగులకు అవసరం అయిన వైద్యం అందిస్తున్నారు. అంతే కాదు ప్రతిరోజు ఆసుపత్రిలో గుండెకు సంబంధించి ఓపీ విభాగం వుంటుందని వైద్యులు చెబుతున్నారు.
Also Read
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
- Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
- CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
ఒకప్పుడు ఆసుపత్రిలో క్యాథ్ ల్యాబ్ వుండేది కాదని ప్రస్తుతం గుండెకు సంబంధించిన అన్ని రకాల ఎక్విప్ మెంట్ లు అందుబాటులోకి వచ్చాయని వైద్యులు అంటున్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా లేని విధంగా లామినర్ ప్లో, ఐసీయూ వార్డులు వుండటంతో గుండె వ్యాధిగ్రస్తులు ప్రభుత్వాసుపత్రికి క్యూ కడుతున్నారు.
ఇటీవలే ప్రైమరీ యంజియోప్లాస్ట్ లతో పాటుగా యాంజియోప్లాస్ట్ లను విజయవంతంగా చేశామని వంద శాతం ఇక్కడికి వచ్చే గుండె వ్యాధిగ్రస్తులకు వారి జీవితానికి భరోసా ఇస్తున్నామని అంటున్నారు వైద్యులు. ఐసీయూలో వున్న పేషంట్స్ సైతం తమకు చికిత్స బాగా అందుతుందని అంటున్నారు, పూర్తి స్థాయిలో కార్డియాలజీ వైద్యులు వుండటంతో ప్రతిరోజూ 10 వరకు యాంజియోగ్రామ్ , యాంజియోప్లాస్ట్ లు నిర్వహిస్తున్నాం అంటున్నారు వైద్యులు.
IND Vs SA: గుడ్న్యూస్.. విశాఖ టీ20కి 100 శాతం ప్రేక్షకులకు ఎంట్రీ
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!