సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీల్లో 93 శాతం అమలు చేశాం. చంద్రబాబు హయాంలో కేవలము కొంత మందికే పథకాలు అందేవన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. జన్మభూమి కమిటీ ఆమోదిస్తేనే పథకాలు అందేవి. ఈరోజు కులం, మతం, పార్టీ చూడకుండా కేవలం పేదరికం చూసే పథకాలు అందిస్తున్నాం. ఎక్కడా లంచాలకు తావు లేకుండా అకౌంట్ లో డబ్బులు జమ అవుతున్నాయి. రైతులు మీటర్లు బిగిస్తే ఉరి తాడు వేసుకున్నట్టే అని చంద్రబాబు అంటున్నారు. గతంలో ఉచిత కరెంట్…
ఏపీలో మూడురాజధానుల అంశం ఎప్పుడైనా హాట్ టాపిక్. విశాఖలో పాలనా రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని అంటూ అప్పటివరకూ వున్న అమరావతి రాజధానిని వికేంద్రీకరించాలని ప్రభుత్వం భావించింది. అయితే న్యాయపరమయిన ఇబ్బందుల నేపథ్యంలో బిల్లుని వెనక్కి తీసుకుంది. సమగ్రమయిన విధానంతో, ఎలాంటి న్యాయపరమయిన చిక్కులు లేకుండా వుండేలా మూడురాజధానుల బిల్లు తేవాలని భావిస్తోంది ప్రభుత్వం. మూడు రాజధానులనేది ఇక రాజకీయ నివాదంగానే ఉంటుందన్నారు బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవిఎల్ నరసింహారావు. మూడు రాజధానుల…
ఏపీ సీఎంపై మండిపడ్డారు జనసేన నేత నాదెండ్ల మనోహర్ నోటికొచ్చిన అబద్దాలు చెప్పడమే సీబీఐ దత్తపుత్రుడుకి తెలిసిన విద్య. మేనిఫెస్టోలో చెప్పిన జాబ్ క్యాలెండర్ ఏమైంది? ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్షలు ఎగ్గొడుతున్నారు. మద్యపాన నిషేధం అని ఊరూరా మద్యం పారిస్తున్నారు. సీపీఎస్ రద్దుపై మాట తప్పారు. మల్లాడి సత్యలింగం నాయకర్ పేరు పలికే అర్హత సీఎంకి లేదు. ఎం.ఎస్.ఎన్.ఛారిటీస్ ఆస్తులు వైసీపీ వాళ్ళు కబ్జా చేస్తున్న విషయం ఆయనకు తెలియదా? అని ప్రశ్నించారు…
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం జర్న పంచాయితీ గ్రామ సచివాలయంలో మహిళా పోలీస్ నిర్మల దిశా యాప్ డౌన్లోడ్ చేసేందుకు గ్రామస్తులు వద్దకు వెళ్ళారు. గ్రామంలో ఉన్నవారి మొబైల్ కి దిశ యాప్ డౌన్లోడ్ చేద్దామని ప్రయత్నించారు. కానీ ఆ పరిసర ప్రాంతాల్లో ఒడిశా సెల్ సిగ్నల్స్ వస్తున్నాయి. ఒడిశా సెల్ సిగ్నల్స్ తో యాప్ డౌన్లోడ్ అవ్వకపోతుండడంతో ఆమె తెలివిగా ఆలోచించింది. గ్రామానికి చాలా దూరంగా ఆంధ్రప్రదేశ్ సెల్ సిగ్నల్ ఎక్కడ వస్తుందో పరిశీలించి…
ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి సమస్యను పరష్కరించడంలో భాగంగా తాజాగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ (కేఆర్ఎంబీ) మీటింగ్ జరిగింది. ఇందులో భాగంగా.. పవర్ జనరేషన్ విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యక్తం చేసిన అభ్యంతరంపై తాము రాజీ పడేదే లేదని తెలంగాణ ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి తేల్చి చెప్పారు. శ్రీశైలంలో పవర్ జనరేషన్ చేస్తున్నారని ఏపీ అభ్యంతరం చెప్పారని, విద్యుత్ అవసరాల కోసం తాము కచ్ఛితంగా ఉత్పత్తి చేస్తామని, ఆ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే…
శ్రీకాళహస్తీ ఆలయ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రాహు కేతు పూజలలో భక్తులకు త్వరలో బంగారు నాగపడగలు వినియోగానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు వెండి నాగపడగలతో తమ దోషాలను తొలగించుకున్న భక్తులు..ఇకపై బంగారు పడగలతో సేవలను పొందనున్నారు. వాయులింగ క్షేత్రం గా…. రాహు కేతువులకు నిలయంగా విరాజిల్లుతున్న ముక్కంటి క్షేత్రం శ్రీకాళహస్తి. రాహు కేతువుల, నాగ దోషాలు, కుజదోషాల నివారణకు పేరుగాంచింది శ్రీకాళహస్తి దేవస్థానం. శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడు రాహు కేతువుల నిలయంగా పేరుగాంచారు. ఇక్కడి…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన రేపల్లె రైల్వే స్టేషన్లో వివాహితపై అత్యాచార ఘటనపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని స్పందించారు. రేపల్లె రైల్వే స్టేషన్ లో మహిళపై అత్యాచార ఘటన అత్యంత బాధాకరం. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీరియస్గా తీసుకున్నారు. నిందితులకు కఠిన శిక్ష పడే వరకు మా ప్రభుత్వం వదిలిపెట్టం అన్నారు. పోలీసులు ఇప్పటికే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీతో, ఆస్పత్రి అధికారులతో మాట్లాడాం. బాధితురాలికి మెరుగైన వైద్యం…
రేపల్లె రైల్వే స్టేషన్లో మహిళపై అత్యాచారాన్ని ఖండిస్తున్నా. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఏపీలో మహిళలపై రోజుకో అత్యాచారం.. పూటకో హత్య జరుగుతున్నాయన్నారు టీడీపీ రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్. రేపల్లెను గంజాయి హబ్ గా తయారు చేశారు.గంజాయి తాగి మహిళను గ్యాంగ్ రేప్ చేసారు అంటే ఏపీలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయి అనే దానికి అద్దంపడుతుంది. జగన్ రెడ్డి పాలనలో ఏపీ బీహార్ గా మారింది. దిశా చట్టం అంటూ మహిళా మంత్రులు మైకులు పట్టుకుని…
ఏపీలో ప్రభుత్వ వైఫల్యం వల్లే రోజుకో మర్డర్… పూటకో రేప్ ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్. ఇలాంటి ఘటనలతో బీహారును ఏపీ మించిపోయింది. లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది.ఇవాళ ఓ వలసకూలీపై రేపల్లెలో అత్యాచారం జరిగింది. బతుకుదెరువు కోసం భర్త, పిల్లలతో వలసవెళ్లిన మహిళపై కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. రాష్ట్రంలో ఏంచేసినా పోలీసులు ఏమీ చేయలేరనే ధైర్యంతోనే ఉన్మాదులు ఇటువంటి దురాగతాలకు పాల్పడుతున్నారన్నారు లోకేష్. గత నాలుగు రోజులుగా…
ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి రుయా ఆస్పత్రి వద్ద అమానవీయ ఘటన జరిగింది. పదేళ్ల బాలుడి మృతదేహాన్ని తీసుకెళ్లడానికి అంబులెన్స్ సిబ్బంది వ్యవహరించిన తీరు విమర్శల పాలవుతోంది. అన్నమయ్య జిల్లా చిట్వేలికి చెందిన వ్యక్తి తన కుమారుడు జైశ్వ అనారోగ్యంతో ఉండటంతో ఇటీవల తిరుపతి రుయాకు తీసుకొచ్చారు. చికిత్స పొందుతూ కిడ్నీ, కాలేయం పూర్తిగా పనిచేయకపోవడంతో బాలుడు నిన్న రాత్రి 11 గంటల సమయంలో మృతి చెందాడు. బాలుడిని తిరుపతి నుంచి 90 కి.మీ. దూరంలో ఉన్న చిట్వేలికి తీసుకెళ్లడానికి…