Panchayati Funds: పంచాయతీ రాజ్ ఛాంబర్, సర్పంచ్ల ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ను కలిశారు ఏపీ పంచాయతీ రాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘం ప్రతినిధులు. రూ. 7660 కోట్ల నిధులను పంచాయతీ ఖాతాల్లో నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకుందని గవర్నరుకి ఫిర్యాదు చేశారు సర్పంచుల సంఘం. కేంద్ర ప్రభుత్వం 14,15వ ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు పంపించిన నిధులు రూ. 7660 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం తన సొంత అవసరాలకు వాడుకుందంటూ గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళారు సర్పంచులు.
పంచాయతీ ఖాతాల్లోకి తిరిగి డబ్బు జమ చేయుంచాలని.. ఈ మేరకు గవర్నర్ జోక్యం కోరింది సర్పంచుల సంఘం. ఏపీ పంచాయతీ రాజ్ ఛాంబర్ వ్యవస్థాపక అధ్యక్షుడు వైబీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ గవర్నరుని కలిసి రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేశామన్నారు. 14,15వ ఆర్ధిక సంఘం నిధులను కేంద్రం 2018 నుండి 2022వరకు రూ. 7660 కోట్ల నిధులు పంపింది. సర్పంచులకు చెప్పకుండా, ఆమోదం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను దారి మళ్లించింది.
Also Read
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
సీఎంఎఫ్ ఎకౌంటును దొంగిలించి సొంత పధకాలకు మళ్లించారు. ఈ విషయాలు తెలుసుకున్న గవర్నర్ కూడా ఆశ్చర్య పోయారు. 12,918పంచాయతీ నిధులు ఖాళీ చేయడంపై వివరాలడిగి తెలుసుకున్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఎలా తీసుకుంటుందని ఆయన ఎదురు ప్రశ్నించారు. ఇవ్వాల్సిన నిధులివ్వకపోగా… కేంద్రం నిధులు కూడా స్వాహా చేసింది. రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరించిన ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని చెప్పాం.
జగన్ ప్రభుత్వానికి బుద్ది చెప్పి.. మా నిధులు మాకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాం. అన్ని అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని కోరాం.73,74 రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చిన నిధులును రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించింది. గ్రామాల అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం ఏమిటి..? సర్పంచుల ప్రమేయం లేకుండా అకౌంట్ల నుంచి ఎలా మళ్లిస్తారు..? ఇది దొంగతనం కాకపోతే ఎలా చూడాలి. ఇప్పటికే వివిధ రూపాలలో మా ఆవేదనను తెలిపాం. గవర్నరును ఇచ్చిన ఫిర్యాదుతో అయినా మా నిధులు మాకు వస్తాయని భావిస్తున్నాం అన్నారు సర్పంచ్లు. అప్పటికి స్పందన లేకపోతే రాష్ట్రపతిని కూడా కలిసి వివరిస్తాం. జగన్ ఇప్పుడైనా స్పందించి మా నిధులు మాకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Excise Duty: వాహనదారులకు బంపర్ ఆఫర్.. ఆ పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు చేసిన కేంద్రం!
-
2026 Audi Q7: సూపర్ ఫాస్ట్ SUV.. 4.8 సెకన్లలోనే 100 కిమీ వేగాన్ని అందుకునే 2026 Audi Q7
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
Jayam Ravi Case : పిల్లల పాఠశాల ఫీజు, నా భరణం ఏడాదిగా రవి ఇవ్వడం లేదు : ఆర్తి
-
FIFA World Cup 2026: భూగోళమంతా బంతిలోనే.. నేటి నుంచే ఫుట్బాల్ ప్రపంచకప్.. మనకు మాత్రం నిరాశే!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!