Tomatos Theft: టమోటా దొంగలు.. పరేషాన్లో రైతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో దొంగలు పడడం మామూలే కానీ. ఏపీలో దొంగలు పడ్డారు. ఆ దొంగలకు బంగారం, డబ్బు అవసరం లేదు. వారికేం కావాలో తెలిస్తే మీరే షాకవుతారు. పొలంలో పండిన టమోటా బాక్సులు ఎత్తుకెళ్ళిపోతున్నారు. టమోటా ధరలు ఆకాశాన్నంటిన వేళ దొంగల కళ్ళు టమోటాలపై పడ్డాయి. చిత్తూరు జిల్లా సోమల మండలంలో టమోటాల కోసం దొంగలు పడ్డరు.
రాష్ట్రంలో టమోటా ధరలు ఆకాశాన్ని అంటడంతో చిత్తూరు జిల్లా సోమలలో దొంగల బెడద ఎక్కువైందని రైతులు వాపోతున్నారు.ఇన్నిరోజులు ధరలు లేక అల్లాడుతున్న రైతులకు ఇప్పుడు దొంగల భయం పట్టుకుంది. టమోటా రేట్లు పెరగడంతో ఇలా దొంగతనాలకు పాల్పడుతున్నారని రైతులు చెబుతున్నారు.చిన్న సోమల మార్గంలో రోడ్డు పక్కన ఉన్న తోటలో సుమారు ఐదు బాక్సుల మేర టమోటాలను దుండగులు కోసుకెళ్లినట్టు బాధిత రైతు జగన్మోహన్ తెలిపారు. రాత్రి వేళల్లో పోలీసులు గస్తీ నిర్వహిస్తే దొంగతనాలకు చెక్ పెట్టొచ్చని రైతులు అంటున్నారు. శాంతి భద్రతలకు సమయం సరిపోవడం లేదంటే.. టమోటా తోటలకు మేం ఎక్కడ కాపలా కాస్తామని పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. గతంలో ఉల్లిపాయలు రేట్లు వంద రూపాయలకు చేరినప్పుడు కూడా ఉల్లి దొంగలు రంగ ప్రవేశం చేశారు. తాజాగా చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్లో టమోటాలు భారీ ధర పలుకుతున్నాయి. నిన్న మొన్నటివరకూ 50 నుంచి 75 రూపాయలు పలికిన ధరలు ఇప్పుడు వంద దాటేశాయి. మరికొద్ది రోజుల ఈ ధరల మంట తప్పదంటున్నారు వ్యాపారులు. ధరలు పెరగడంతో రైతులు తమ పంటను కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. టమోటాల దొంగతనం గురించి తెలుసుకుని జనం నవ్వుకుంటున్నారు.
Also Read
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
- Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
- CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
ఇదిలా వుంటే టమోటాలు కొనలేక సామాన్యులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వంటింట్లో టమోటా వాడకాన్ని తాత్కాలికంగా ఆపేశారు. విశాఖలో టమోటాకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇవాళ్టి నుంచి రైతు బజార్లలో సబ్సిడీపై టమోటాల అమ్మకాలు చేపట్టారు. కేజీ 60కి చొప్పున విక్రయించేందుకు ఏర్పాట్లు చేశారు. మదనపల్లె నుంచి తెప్పించి ప్రతీ రైతు బజారుకు రెండు టన్నులు పంపిణీ చేయనున్నారు. ప్రతి వినియోగదారుడికి ఒక కిలో మాత్రం ఇవ్వనున్నారు.
Airtel Plans : మరోసారి వినియోగదారులకు షాక్.. పెరుగనున్న రీఛార్జ్ ధరలు..
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!