Tomatos Theft: టమోటా దొంగలు.. పరేషాన్లో రైతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో దొంగలు పడడం మామూలే కానీ. ఏపీలో దొంగలు పడ్డారు. ఆ దొంగలకు బంగారం, డబ్బు అవసరం లేదు. వారికేం కావాలో తెలిస్తే మీరే షాకవుతారు. పొలంలో పండిన టమోటా బాక్సులు ఎత్తుకెళ్ళిపోతున్నారు. టమోటా ధరలు ఆకాశాన్నంటిన వేళ దొంగల కళ్ళు టమోటాలపై పడ్డాయి. చిత్తూరు జిల్లా సోమల మండలంలో టమోటాల కోసం దొంగలు పడ్డరు.
రాష్ట్రంలో టమోటా ధరలు ఆకాశాన్ని అంటడంతో చిత్తూరు జిల్లా సోమలలో దొంగల బెడద ఎక్కువైందని రైతులు వాపోతున్నారు.ఇన్నిరోజులు ధరలు లేక అల్లాడుతున్న రైతులకు ఇప్పుడు దొంగల భయం పట్టుకుంది. టమోటా రేట్లు పెరగడంతో ఇలా దొంగతనాలకు పాల్పడుతున్నారని రైతులు చెబుతున్నారు.చిన్న సోమల మార్గంలో రోడ్డు పక్కన ఉన్న తోటలో సుమారు ఐదు బాక్సుల మేర టమోటాలను దుండగులు కోసుకెళ్లినట్టు బాధిత రైతు జగన్మోహన్ తెలిపారు. రాత్రి వేళల్లో పోలీసులు గస్తీ నిర్వహిస్తే దొంగతనాలకు చెక్ పెట్టొచ్చని రైతులు అంటున్నారు. శాంతి భద్రతలకు సమయం సరిపోవడం లేదంటే.. టమోటా తోటలకు మేం ఎక్కడ కాపలా కాస్తామని పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. గతంలో ఉల్లిపాయలు రేట్లు వంద రూపాయలకు చేరినప్పుడు కూడా ఉల్లి దొంగలు రంగ ప్రవేశం చేశారు. తాజాగా చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్లో టమోటాలు భారీ ధర పలుకుతున్నాయి. నిన్న మొన్నటివరకూ 50 నుంచి 75 రూపాయలు పలికిన ధరలు ఇప్పుడు వంద దాటేశాయి. మరికొద్ది రోజుల ఈ ధరల మంట తప్పదంటున్నారు వ్యాపారులు. ధరలు పెరగడంతో రైతులు తమ పంటను కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. టమోటాల దొంగతనం గురించి తెలుసుకుని జనం నవ్వుకుంటున్నారు.
Also Read
- Chandrababu on Mega DSC: డీఎస్సీపై వైసీపీ ఆందోళనలకు చంద్రబాబు కౌంటర్.. కీలక వ్యాఖ్యలు
- CM Chandrababu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్.. గంజాయి, రౌడీయిజంపై సంచలన వ్యాఖ్యలు
- Nuzvid Love Marriage Twist: ప్రేమ వివాహం తర్వాత ట్విస్ట్.. భార్యను అప్పగించేందుకు రూ.12 లక్షలు డిమాండ్?
- Tobacco Farmers: పొగాకు రైతులకు సర్కార్ గుడ్న్యూస్.. క్వింటాల్కు రూ.1,000 ప్రోత్సాహకం, వడ్డీలేని రుణాలు
ఇదిలా వుంటే టమోటాలు కొనలేక సామాన్యులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వంటింట్లో టమోటా వాడకాన్ని తాత్కాలికంగా ఆపేశారు. విశాఖలో టమోటాకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇవాళ్టి నుంచి రైతు బజార్లలో సబ్సిడీపై టమోటాల అమ్మకాలు చేపట్టారు. కేజీ 60కి చొప్పున విక్రయించేందుకు ఏర్పాట్లు చేశారు. మదనపల్లె నుంచి తెప్పించి ప్రతీ రైతు బజారుకు రెండు టన్నులు పంపిణీ చేయనున్నారు. ప్రతి వినియోగదారుడికి ఒక కిలో మాత్రం ఇవ్వనున్నారు.
Airtel Plans : మరోసారి వినియోగదారులకు షాక్.. పెరుగనున్న రీఛార్జ్ ధరలు..
తాజావార్తలు
-
AAA Vizag : వైజాగ్ AAA స్క్రీన్ స్పెసిఫికేషన్స్ వేరే లెవెల్ అంతే!
-
Darshan Case: రీల్ హీరో రియల్ విలన్.. దర్శన్ కేసులో దిమ్మతిరిగే నిజాలు! అప్రూవర్ వాంగ్మూలంలో షాకింగ్ విషయాలు..
-
Chandrababu on Mega DSC: డీఎస్సీపై వైసీపీ ఆందోళనలకు చంద్రబాబు కౌంటర్.. కీలక వ్యాఖ్యలు
-
Vismaya Mohanlal : ఫస్ట్ సినిమాతో అదరగొట్టిన మోహన్ లాల్ కూతరు.. మూడు రోజుల్లో భారీ కలెక్షన్స్
-
CM Chandrababu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్.. గంజాయి, రౌడీయిజంపై సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!