ప్రభుత్వ విధానాలతోనే రాష్ట్రంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని టీడీపీ ఏపీ అధ్యక్షడు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. పెడనలో చేనేత కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం బాధకరమన్నారు. ప్రచార ఆర్భాటమే తప్ప ప్రజలకు జగన్ సర్కార్ ఉద్దరించింది ఏం లేదని మండి పడ్డారు. టీడీపీ హయాంలో చేనేతలకు ప్రోత్సాహకాలు, రాయితీలు, రుణాలు, వడ్డీ రాయితీలు చాలా ఇచ్చామన్నారు. సొంత మగ్గం లేకున్నా రిబేటుతో సహా ఏడాదికి రూ.…
ఏపీలో పీఆర్సీ రగడ మాములుగా జరగడం లేదు. ప్రభుత్వం వర్సెస్ ఉద్యోగులు అన్నట్టు తయారైంది పరిస్థితి. ప్రభుత్వం ఎస్మా ప్రయోగిస్తామని చెబుతున్నా ఉద్యోగులు మాత్రం వెనక్కు తగ్గడం లేదు. డిమాండ్లు సాధించుకునేందుకు ఎంతవరకైనా వెళ్తాం అని ఉద్యోగులు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతుంది. తాజాగా ఏపీ ఉద్యోగుల ఛలో విజయవాడకు అనుమతి ఇవ్వొద్దని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. Read Also: ఉద్యోగుల ఉద్యమాన్ని నీరు గార్చేందుకే కొత్త జిల్లాల ప్రతిపాదన:…
ఉద్యోగుల ఉద్యమాన్ని నీరు గార్చేందుకే కొత్త జిల్లాల ప్రతిపాదనను సీఎం జగన్ తీసుకొచ్చారని టీడీపీ జాతీయ ఉపాధ్యాక్షుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. కొత్త జిల్లాల విభజన దారుణంగా ఉందన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలకు మాట్లాడే ధైర్యం లేదని మండిపడ్డారు. అభివృద్ధి పనులు చేయలేదని ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలంటూ డిమాండ్ చేశారు. కొత్త జిల్లాల విభజన ఫేక్గా తయారైందన్నారు. సీఎం ను ప్రసన్నం చేసుకునేందుకు…
ఆంధ్ర ప్రదేశ్లో ఉద్యోగులు, ప్రభుత్వానికి మధ్య పీఆర్సీపై ఘర్షణ వాతావరణం కొనసాగుతుంది. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ తమనకు సమ్మతంగా లేదని ఉద్యోగ సంఘాలు నిరసనలకు పిలుపునివ్వడంతో పాటు సమ్మెకు కూడా పిలుపునిచ్చారు. అయితే ఈనేపథ్యంలో విద్యుత్ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. విద్యుత్ ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ లో ఉన్న నాలుగు డీఏలను చెల్లిస్తామని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. Read Also: రాష్ట్రపతి కోవింద్ను కలిసిన నిర్మలాసీతారామన్ ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించిన విధంగానే…
ఉద్యోగులు సీఎం పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఉరుకోబోమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు డిమాండ్లు పరిష్కరిస్తేనే ఉద్యోగులు చర్చలకు వస్తామని చెబుతున్నారన్నారు. జీవోలు విడుదల అయినందున ప్రభుత్వం కొత్త జీతాలను ఇస్తుందన్నారు. ఉద్యోగులు ముఖ్యమంత్రి పై తూలనాడి మాట్లాడితే సంఘం నాయకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. మేము కూడా మాట్లాడితే మరింత ఘర్షణ వాతావరణం ఏర్పడుతుందని మంత్రి…
ఏపీలో ఓ వైపు పీఆర్సీ రగడ నడుస్తుండగానే ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతుంది. దీనిపై ఉద్యోగ సంఘాలు గుర్రుగా ఉన్నాయి. ఉద్యోగులు, పెన్షనర్ల జీతాల చెల్లింపుల పై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. జీతాల చెల్లింపు ప్రాసెసింగ్కు కూడా ఇవాళే డెడ్ లైన్ ఉంది. దీంతో ఆర్థిక శాఖ శర వేగంగా పీఆర్సీ బిల్లులను సిద్ధం చేస్తోంది. నిన్న, మొన్న ఉద్యోగుల జీతాల బిల్లులు అప్లోడ్ చేసిన ట్రెజరీ శాఖ ఉద్యోగులు. Read Also:…
ఉద్యోగులు గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని ఏపీ ఏన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడారు. 3వ తేదిన జరిగే ఛలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు. కొత్త పీఆర్సీ అమలులోకి వస్తే ఉద్యోగుల పరిస్థితి రివర్స్ అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రుల బృందం కావాలనే రెచ్చగొడుతుందన్నారు. మిశ్రా కమిటీ సిఫార్సు బయటపెట్టమని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఉనికిలో లేని ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించి మమ్ముల్ని అవమానపరిచారననారు. Read…
ఏపీలో పీఆర్సీ రగడ ఇప్పట్లో తేలేలా లేదు. ఇప్పటికే ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వనించినప్పటీకి వారు రాలేదు. దీంతో మంత్రుల కమిటీ వెనుదిరిగింది. అయితే ఉద్యోగ సంఘాలు మాత్రం మా డిమాండ్లు నేరవేర్చడంతో పాటు తాము పెట్టే షరతులకు ఒప్పుకుంటేనే చర్చలకు వస్తామని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించే అంశంతో పాటు వారిని దారికి తెచ్చేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ట్రెజరీ ఉద్యోగులు, డీడీవోలకు ప్రభుత్వం…
గిరిజనుల సమస్యలు దశలవారీగా పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి ధర్మాన కృష్ణ దాస్ అన్నారు. జిల్లాల విభజన అధ్యయనం జరిగిన తర్వాత తీసుకన్న నిర్ణయమే అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన శ్రీకాకుళం జిల్లాలో మాట్లాడారు. సీఎం జిల్లాల గిరిజన పక్షపాతి అన్నారు. జిల్లా ఏర్పాటు పై ఏవైనా సమస్యలు ఉంటే అభిప్రాయాలను తెలియజేసే అవకాశాలను కల్పించామన్నారు. ప్రభుత్వం దృష్టికి సమష్యలు తీసుకువస్తే సాధ్యాసాధ్యాలను బట్టి నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ప్రజలకు మేలు…
బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. కడప ఎయిర్పోర్టు విషయంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.. అయితే, ఆయన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి.. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఓ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్న ఆయన.. కడప ప్రజలు మనుషులను చంపుతారని వారికి ఎయిర్ పోర్టు అవసరమా అని సోమువీర్రాజు వ్యాఖ్యలు చేయడం శోచనీయం అన్నారు.. ఆయన తన మాటలు వెంటనే వెనక్కు…