ఉద్యోగులు గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని ఏపీ ఏన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడారు. 3వ తేదిన జరిగే ఛలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు. కొత్త పీఆర్సీ అమలులోకి వస్తే ఉద్యోగుల పరిస్థితి రివర్స్ అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రుల బృందం కావాలనే రెచ్చగొడుతుందన్నారు. మిశ్రా కమిటీ సిఫార్సు బయటపెట్టమని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఉనికిలో లేని ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించి మమ్ముల్ని అవమానపరిచారననారు. Read…
ఏపీలో పీఆర్సీ రగడ ఇప్పట్లో తేలేలా లేదు. ఇప్పటికే ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వనించినప్పటీకి వారు రాలేదు. దీంతో మంత్రుల కమిటీ వెనుదిరిగింది. అయితే ఉద్యోగ సంఘాలు మాత్రం మా డిమాండ్లు నేరవేర్చడంతో పాటు తాము పెట్టే షరతులకు ఒప్పుకుంటేనే చర్చలకు వస్తామని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించే అంశంతో పాటు వారిని దారికి తెచ్చేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ట్రెజరీ ఉద్యోగులు, డీడీవోలకు ప్రభుత్వం…
గిరిజనుల సమస్యలు దశలవారీగా పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి ధర్మాన కృష్ణ దాస్ అన్నారు. జిల్లాల విభజన అధ్యయనం జరిగిన తర్వాత తీసుకన్న నిర్ణయమే అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన శ్రీకాకుళం జిల్లాలో మాట్లాడారు. సీఎం జిల్లాల గిరిజన పక్షపాతి అన్నారు. జిల్లా ఏర్పాటు పై ఏవైనా సమస్యలు ఉంటే అభిప్రాయాలను తెలియజేసే అవకాశాలను కల్పించామన్నారు. ప్రభుత్వం దృష్టికి సమష్యలు తీసుకువస్తే సాధ్యాసాధ్యాలను బట్టి నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ప్రజలకు మేలు…
బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. కడప ఎయిర్పోర్టు విషయంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.. అయితే, ఆయన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి.. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఓ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్న ఆయన.. కడప ప్రజలు మనుషులను చంపుతారని వారికి ఎయిర్ పోర్టు అవసరమా అని సోమువీర్రాజు వ్యాఖ్యలు చేయడం శోచనీయం అన్నారు.. ఆయన తన మాటలు వెంటనే వెనక్కు…
కోవిడ్ పరిస్థితులపై సీఎం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ అధికారులకు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో కోవిడ్ విస్తరణ పరిస్థితులను సీఎం జగన్ కు అధికారులు వివరించారు. కేసులు నమోదు అవుతున్నా ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం ఉన్నవారి సంఖ్య తక్కువగా ఉందని తెలిపిన అధికారులు. 1.06 లక్షలకు పైగా కేసుల్లో 2709 మందే ఆస్పత్రుల్లో చేరారని తెలిపిన అధికారులు. ఇందులో ఐసీయూలో చేరిన వారు కేవలం 287 మంది మాత్రమేనని వెల్లడించారు.…
ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే ఉద్యోగులకు పాత జీతాలే ఇవ్వాలని పీఆర్సీ సాధన సమితి నేత వెంకట్రామిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యమానికి సహకరిస్తున్న ట్రెజరీ ఉద్యోగులు, డీడీఓలపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తుందని వెంకట్రామిరెడ్డి అన్నారు. పాత జీతమే ఇవ్వాలని ప్రతి ఉద్యోగి డీడీఓలు.. హెచ్వోడీల వద్దకు వెళ్లి రాతపూర్వకంగా కోరాలన్నారు. దీని నిమిత్తం ఓ ప్రోఫార్మా రూపొందించామని తెలిపారు. చర్చలకు వచ్చే విషయంలో మా డిమాండ్లు ఏంటో…
తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం చూపగల వ్యక్తి ఎన్టీఆర్ అని మంత్రి పేర్ని నాని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్టీఆర్ను ఓ ప్రాంతానికో.. కులానికో పరిమితం చేయొద్దని మంత్రి పేర్నినాని అన్నారు. ప్రధానులనే నియమించి చక్రం తిప్పానన్న చంద్రబాబు.. ఎన్టీఆర్కు భారతరత్న ఎందుకు ఇప్పించలేకపోయారని ప్రశ్నించారు? ఎన్టీఆర్ పేరుతో జిల్లా పెట్టాలన్న ఆలోచనను చంద్రబాబు ఎందుకు చేయలేదని మండిపడ్డారు. కొత్త జిల్లాల ఏర్పాటు అనేది రాత్రికి రాత్రే తీసుకున్న నిర్ణయం…
పాదయాత్రలో ఇచ్చిన హామీలను సీఎం జగన్ నేరవేరుస్తున్నారని కోవ్వూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకూమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్త జిల్లాలను సీఎం జగన్ ఏర్పాటుచేశారన్నారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్.పేరు పెట్టి చరిత్ర సృష్టించారన్నారు. ఎన్టీఆర్ను చంద్రబాబు వాడుకున్నారే తప్ప ఆయన కోసం ఏమీ చేయలేదని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంలో చంద్రబాబు ఉన్నప్పుడు కూడా ఎన్టీఆర్కు భారతరత్న ప్రయత్నం చేయలేదన్నారు. Read also: 14 నెలల్లో ప్లాంట్ ప్రారంభం ఓ మైలురాయి:…
శ్రీ సిటీలో నోవా ఎయిర్ ప్లాంట్ను క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా సీఎం జగన్ ప్రారంభించారు. ఈ ప్లాంట్లో మెడికల్, లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ నైట్రోజన్, లిక్విడ్ ఆర్గోన్ వాయువుల తయారీ చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో నోవా ఎయిర్ ఎండీ గజనన్నబర్, కమర్షియల్ హెడ్ శరద్ మధోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు. రోజుకు220 టన్నుల ఆక్సిజన్ తయారీ ఉత్పత్తి చేయడం ఈ ప్లాంట్ ఉద్దేశమన్నారు. కేవలం 14 నెలల్లో ప్లాంట్ ప్రారంభం కావడం…
ఉద్యోగుల ఆందోళనలకు కొత్త జిల్లాల ఏర్పాటుకు ఎలాంటి సంబంధం లేదని ఏపీ ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త జిల్లాల ఏర్పాటు పై మాట్లాడారు. లోక్ సభ నియోజకవర్గ పరిధి, భౌగోళిక విస్తీర్ణం, జిల్లా ఆర్థికంగా అభివృద్ధి చెందగలిగే పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కొత్త జిల్లాల ప్రతిపాదనలు చేశామని చెప్పారు. పాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం గత ఏడాదిన్నరగా కొత్త జిల్లాల ఏర్పాటు కోసం కసరత్తు చేసి నిర్ణయం తీసుకుందన్నారు.…