ఉద్యోగులు సీఎం పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఉరుకోం : బొత్స సత్యనారాయణ
ఉద్యోగులు సీఎం పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఉరుకోబోమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు డిమాండ్లు పరిష్కరిస్తేనే ఉద్యోగులు చర్చలకు వస్తామని చెబుతున్నారన్నారు. జీవోలు విడుదల అయినందున ప్రభుత్వం కొత్త జీతాలను ఇస్తుందన్నారు. ఉద్యోగులు ముఖ్యమంత్రి పై తూలనాడి మాట్లాడితే సంఘం నాయకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. మేము కూడా మాట్లాడితే మరింత ఘర్షణ వాతావరణం ఏర్పడుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
Read Also: నారీ సంకల్ప దీక్ష చేసే అర్హత టీడీపీకి లేదు: పోతుల సునీత
Also Read
అది మేము కోరుకోవడం లేదన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తే పర్యవసానాలు చూడాల్సి వస్తుందని మంత్రి ఉద్యోగులను హెచ్చరించారు. మొదటి తేదీ నుంచి ఎంత మందికి వీలైతే అంతమందికి జీతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. పాత జీతాలు కావాలంటారు… మొదటి తేదీన జీతాలు వేసే బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని అంటున్నారు.ఇది ద్వంద్వ వైఖరి కాదా అంటూ ఉద్యోగులను మంత్రి ప్రశ్నించారు. జీతాలు ప్రాసెస్ చేయని సిబ్బంది, అధికారుల పై ప్రభుత్వ పరంగా చర్యలు ఉంటాయని వెల్లడించారు. ఇవన్నీ క్రమ శిక్షణా చర్యల్లో భాగమే.. టీడీపీకి టైం బాలేదు. దీక్షలు వాళ్లే చేస్తున్నారు. వాళ్ల నాయకులే అత్యాచారాలు చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.
తాజావార్తలు
-
CM Chandrabbau: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత.. బంకుల మూసివేతపై సీఎం సమీక్ష!
-
Sangareddy: కర్రిపాయింట్లో రూ.10 లకు సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి.!
-
Toxic: యశ్ ‘టాక్సిక్’ పై రుక్మిణి వసంత్ క్రేజీ కామెంట్స్..
-
Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల దగ్గర వాహనాల బారులు!
-
Ashu Reddy: మోసం కేసులో ట్విస్ట్.. మౌనం వీడిన అషు రెడ్డి
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!