కందుకూరులో లక్ష్మీ నాయుడి హత్య బాధాకరం అని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో లక్ష్మీ నాయుడు కుటుంబాన్ని పరామర్శించాం అని తెలిపారు. ఆర్థిక లావాదేవీల వల్లే లక్ష్మీ నాయుడి హత్య జరిగిందని, నిందితుడికి బెయిల్ రాకుండా శిక్షపడేలా చేస్తాం అని చెప్పారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు డీజీపీని నివేదిక అడగడంలో ఎలాంటి తప్పులేదు అని, తనకు వచ్చిన సమాచారాన్ని పవన్ వెల్లడించడంలో తప్పేముంది అని హోంమంత్రి అనిత ప్రశ్నించారు. డిప్యూటీ…
Fake Liquor Lab Report: ములకలచెరువు నకిలీ మద్యానికి సంబంధించిన ల్యాబ్ రిపోర్టు వెలువడింది. జనార్దన్ తయారు చేసిన నకిలీ మద్యం నాణ్యత లేనిదని రిపోర్టులో తేలింది. 45 నమూనాలపై పరీక్షలు చేసిన కాకినాడ ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది. స్త్రెంత్ ప్రమాణాలు పాటించకుండా మద్యం తయారు చేసినట్లు తేలింది. 25 ఉండాల్సిన అండర్ ప్రూఫ్ (యూపీ) 35గా నమోదైంది. 75 ఉండాల్సిన ఓవర్ ప్రూఫ్ 65గా ల్యాబ్ రిపోర్టులో తేలింది. ప్రమాణాలకు విరుద్ధంగా మద్యం తయారు చేసినట్టు…
Illegal Liquor: అన్నమయ్య జిల్లాలో వెలుగులోకి వచ్చిన నకిలీ మద్యం కేసులో కీలక ఆధారంగా లిక్కర్ డైరీ మారింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ములకల చెరువు నకిలీ మద్యం తయారీ కేసులో, డైరీని పోలీసులు గుర్తించారు.