Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం.. జోగి బ్రదర్స్ కుమారులకు నోటీసులు..
- నకిలీ మద్యం తయారీ కేసులో కీలక పరిణామం..
- జోగి బ్రదర్స్ కుమారులు నలుగురికి ఎక్సైజ్ అధికారుల నోటీసులు..
- ఎల్లుండి విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్న అధికారులు..
- జోగి రమేష్ కుమారులు జోగి రాజీవ్, జోగి రోహిత్..
- జోగి రాము కుమారులు రాకేష్, రామ్మోహన్ లకు ఎక్సైజ్ అధికారుల నోటీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Liquor Case: ఓ వైపు ఏపీ లిక్కర్ స్కామ్ కేసు సంచలనంగా మారిన వేళ.. మరోవైపు నకిలీ మద్యం వ్యవహారం కలకలం రేపింది.. అయితే, విజయవాడలో నకిలీ మద్యం తయారీ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా అధికారులు మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే నకిలీ లిక్కర్ కేసులో మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు జోగి రామును కూడా అరెస్ట్ చేశారు.. అయితే, తాజాగా, ఈ కేసులో జోగి బ్రదర్స్ కుమారులకు నోటీసులు అందజేశారు ఎక్సైజ్ పోలీసులు.. ఎక్సైజ్ శాఖ పంపిన నోటీసుల ప్రకారం విచారణకు హాజరుకావాల్సిన వారు.. జోగి రమేశ్ కుమారుడు జోగి రాజీవ్, జోగి రోహిత్.. జోగి రాము కుమారుడు రాకేష్, రామ్మోహన్ ఉన్నారు.. ఈ నలుగురు విజయవాడ ఎక్సైజ్ కార్యాలయంలో ఎల్లుండి ఉదయం విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు అధికారులు..
Read Also: Hyderabad Metro : మెట్రోలో మహిళల భద్రతకు నూతన అడుగు
Also Read
- CM Chandrababu Naidu: యోగాతో హెల్తీ, వెల్తీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం.!
- Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. నవీన్రెడ్డి హత్యతో లింకులపై ఫోకస్
- Baba Ramdev Visits Kanaka Durga Temple: బెజవాడ కనకదుర్గమ్మ సేవలో బాబా రాందేవ్
- Sai Krishna Missing Case: సాయి కృష్ణ కుటుంబానికి అండగా ప్రభుత్వం.. సీఎం భరోసాతో సంతృప్తి వ్యక్తం చేసిన తల్లి
నకిలీ మద్యం తయారీ, నిల్వ, రవాణా మరియు పంపిణీ వ్యవహారంలో కీలక ఆధారాలు లభించడంతో విచారణను వేగవంతం చేసినట్టు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్టు కాగా.. అధికారులు కీలక అనుమానితుల ఆస్తి మరియు లావాదేవీలను కూడా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఈ కేసుతో సంబంధం ఉన్న మరిన్ని ప్రముఖులు కూడా దర్యాప్తులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.. మొత్తంగా ఇప్పటికే మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాము అరెస్ట్ కావడం.. ఇప్పుడు జోగి బ్రదర్స్ కుమారులు నలుగురికి నోటీసులు అందజేయడం చర్చగా మారింది.. కాగా, నకిలీ మద్యం తయారీ కేసులో అరెస్ట్ అయిన జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రామును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. నాలుగు రోజుల పాటు ప్రశ్నించిన విషయం విదితమే.. నాలుగు రోజుల్లో మొత్తం 250 ప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తుంది.. అయితే, ప్రతి ప్రశ్నకూ దాటవేత ధోరణిలోనే సమాధానాలిచ్చారట…
తాజావార్తలు
-
Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
-
Ketan Agarwal case: కేతన్ను చంపిన తర్వాత సియా చెప్పిన ‘‘తొలి అబద్ధం’’ ఇదే..
-
Delhi Court: ఆ టైమ్లో పరాయి పురుషుడితో మాట్లాడినంతమాత్రాన మహిళ చెడిపోయినట్టు కాదు.. కోర్టు సంచలన తీర్పు
-
Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
-
Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!