Online Cricket Betting: ఏపీలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు.. ఐదుగురు అరెస్ట్!
- గుంటూరులో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు..
- ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన మంగళగిరి రూరల్ పోలీసులు..
- క్రికెట్ మ్యాచ్ల్లో బెట్టింగ్ పెడితే లాభాలు వస్తాయని నమ్మించి మోసం చేస్తున్న ముఠా అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Online Cricket Betting: గుంటూరు జిల్లాలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఐదుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల దగ్గర నుంచి 22 బ్యాంక్ బుక్స్, 11 చెక్కులు, 30 ఏటీఎం కార్డులతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇక, డీఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ.. చినకాకాని ఎన్ఆర్ఐ హాస్పటల్ వెనుక ఎస్వీఎన్ రెసిడెన్సీ అపార్ట్మెంట్స్లోని ఒక ప్లాట్లో క్రికెట్ ఆన్లైన్ బెట్టింగ్ జరుగుతోందని సమాచారం వచ్చింది అన్నారు. దీంతో సోదాలు చేపట్టి కొక్కిలిగడ్డ ఏసన్నను అదుపులోకి తీసుకుని ప్రశ్నించాం.. బాలు, ప్రవీణ్, సూర్య పారిపోయారు.. ఈ ముగ్గురిపై నిఘా పెట్టి అరెస్టు చేశామన్నారు.
Read Also: CM Chandrababu: రాష్ట్రంలో రహదారులపై సీఎం చంద్రబాబు సమీక్ష.. గుంతలు కనిపించొద్దని ఆదేశాలు..
Also Read
- Ambati Rambabu: పోలీసులను రాజకీయ కక్షకు వాడుతున్నారు.. అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
అయితే, ఇందుకూరి బాలకృష్ణ రాజు, ఏసన్న, మనోహర్, ప్రవీణ్, సూర్య ప్రకాశ్లను అరెస్టు చేశామని డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. నిందితుల నుంచి 6 లక్షల 30 వేల రూపాయల నగదుతో పాటు ఐదు ల్యాప్టాప్లు, 32 మొబైల్ ఫోన్లు, స్వాధీనం చేసుకున్నాం. ఇక, ప్రధాన నిందితుడు మనోహర్ ఆన్లైన్ గేమింగ్కు అలపడంతో టెలిగ్రామ్ ద్వారా అందిన లింక్ను నమ్మి www.hublibook.com సైట్ ద్వారా అక్రమ బెట్టింగ్ కార్యకలాపాలను ప్రారంభించినట్లు విచారణలో తేలింది.. తెలియని వ్యక్తుల ఆధార్ కార్డులు, సిమ్ కార్డులు, బ్యాంక్ ఖాతాలను తెరిపించి మొత్తం 30 అకౌంట్లు ఓపెన్ చేసినట్లు గుర్తించాం.. క్రికెట్ మ్యాచ్ల్లో బెట్టింగ్ పెడితే పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని నమ్మించి మోసగించేవారు.. డిపాజిట్లు, విత్డ్రాలు, అకౌంట్ బ్యాలెన్స్ లాంటి కార్యకలాపాలకు పాల్పడినందుకు నిందితులను అరెస్ట్ చేశామని డీఎస్పీ మురళీకృష్ణ చెప్పారు.
తాజావార్తలు
-
INS Mahendragiri: భారత నౌకాదళంలోకి స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరి.. ఆత్మనిర్భర్ భారత్కు మరో మైలురాయి
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
Double Occupancy OTT: పగలు అమ్మాయి.. రాత్రి అబ్బాయి.. ఓటీటీలోకి షాకింగ్ కాన్సెప్ట్ మూవీ
-
INS Mahendragiri: విశాఖలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి జాతికి అంకితం.. రాజ్నాథ్ కీలక వ్యాఖ్యలు
-
Donald Trump: నన్ను చంపడానికి ట్రై చేస్తే 1,000 క్షిపణులు సిద్ధంగా ఉన్నాయ్.. ట్రంప్ షాకింగ్ ప్రకటన..
ట్రెండింగ్
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!