Online Cricket Betting: ఏపీలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు.. ఐదుగురు అరెస్ట్!
- గుంటూరులో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు..
- ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన మంగళగిరి రూరల్ పోలీసులు..
- క్రికెట్ మ్యాచ్ల్లో బెట్టింగ్ పెడితే లాభాలు వస్తాయని నమ్మించి మోసం చేస్తున్న ముఠా అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Online Cricket Betting: గుంటూరు జిల్లాలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఐదుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల దగ్గర నుంచి 22 బ్యాంక్ బుక్స్, 11 చెక్కులు, 30 ఏటీఎం కార్డులతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇక, డీఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ.. చినకాకాని ఎన్ఆర్ఐ హాస్పటల్ వెనుక ఎస్వీఎన్ రెసిడెన్సీ అపార్ట్మెంట్స్లోని ఒక ప్లాట్లో క్రికెట్ ఆన్లైన్ బెట్టింగ్ జరుగుతోందని సమాచారం వచ్చింది అన్నారు. దీంతో సోదాలు చేపట్టి కొక్కిలిగడ్డ ఏసన్నను అదుపులోకి తీసుకుని ప్రశ్నించాం.. బాలు, ప్రవీణ్, సూర్య పారిపోయారు.. ఈ ముగ్గురిపై నిఘా పెట్టి అరెస్టు చేశామన్నారు.
Read Also: CM Chandrababu: రాష్ట్రంలో రహదారులపై సీఎం చంద్రబాబు సమీక్ష.. గుంతలు కనిపించొద్దని ఆదేశాలు..
Also Read
- SRM University Harassment Case: ఎస్ఆర్ఎం వర్సిటీలో లైంగిక వేధింపుల కలకలం.. మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిర్యాదుతో..
- Ambati Rambabu Hunger Strike: నిరాహార దీక్ష చేపట్టిన అంబటి.. ప్రాణాలకు తెగించైనా మీ సంగతి తేలుస్తా..!
- Ambati Rambabu: పోలీసులకు ఫిర్యాదు చేసిన అంబటి రాంబాబు.. న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తా..
- Divyang Shakti Scheme: దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. వారికోసం మరింత ఆలోచన చేస్తాం..
అయితే, ఇందుకూరి బాలకృష్ణ రాజు, ఏసన్న, మనోహర్, ప్రవీణ్, సూర్య ప్రకాశ్లను అరెస్టు చేశామని డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. నిందితుల నుంచి 6 లక్షల 30 వేల రూపాయల నగదుతో పాటు ఐదు ల్యాప్టాప్లు, 32 మొబైల్ ఫోన్లు, స్వాధీనం చేసుకున్నాం. ఇక, ప్రధాన నిందితుడు మనోహర్ ఆన్లైన్ గేమింగ్కు అలపడంతో టెలిగ్రామ్ ద్వారా అందిన లింక్ను నమ్మి www.hublibook.com సైట్ ద్వారా అక్రమ బెట్టింగ్ కార్యకలాపాలను ప్రారంభించినట్లు విచారణలో తేలింది.. తెలియని వ్యక్తుల ఆధార్ కార్డులు, సిమ్ కార్డులు, బ్యాంక్ ఖాతాలను తెరిపించి మొత్తం 30 అకౌంట్లు ఓపెన్ చేసినట్లు గుర్తించాం.. క్రికెట్ మ్యాచ్ల్లో బెట్టింగ్ పెడితే పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని నమ్మించి మోసగించేవారు.. డిపాజిట్లు, విత్డ్రాలు, అకౌంట్ బ్యాలెన్స్ లాంటి కార్యకలాపాలకు పాల్పడినందుకు నిందితులను అరెస్ట్ చేశామని డీఎస్పీ మురళీకృష్ణ చెప్పారు.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!