Vangalapudi Anitha: పవన్ కళ్యాణ్ తప్పులేదు.. తగిన చర్యలు తీసుకుంటాం!
- లక్ష్మీ నాయుడి హత్య బాధాకరం
- లక్ష్మీ నాయుడు కుటుంబాన్ని పరామర్శించాం
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తప్పులేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కందుకూరులో లక్ష్మీ నాయుడి హత్య బాధాకరం అని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో లక్ష్మీ నాయుడు కుటుంబాన్ని పరామర్శించాం అని తెలిపారు. ఆర్థిక లావాదేవీల వల్లే లక్ష్మీ నాయుడి హత్య జరిగిందని, నిందితుడికి బెయిల్ రాకుండా శిక్షపడేలా చేస్తాం అని చెప్పారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు డీజీపీని నివేదిక అడగడంలో ఎలాంటి తప్పులేదు అని, తనకు వచ్చిన సమాచారాన్ని పవన్ వెల్లడించడంలో తప్పేముంది అని హోంమంత్రి అనిత ప్రశ్నించారు.
డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ గారు డిఎస్పీపై నివేదిక కోరవచ్చు, అందులో తప్పేంటి. భీమవరం డిఎస్పీ వ్యవహార శైలికి సంబంధించి నివేదిక హోంశాఖ దగ్గర ఉంది. డిప్యూటీ సీఎంగా పవన్.. డీజీపీని నివేదిక అడగడంలో ఎలాంటి తప్పు లేదు. తనకు వచ్చిన సమాచారాన్ని పవన్ వెల్లడించడంలో తప్పేముంది. కూటమి ప్రభుత్వంలో శాఖల మధ్య సమన్వయంతో పనిచేస్తున్నాం. మాకు మాకు ఎలాంటి ఇగోలు లేవు. డీఎస్పీ జయసూర్యకు సంబంధించిన నివేదిక మా వద్ద ఉంది. తగిన చర్యలు తీసుకుంటాం’ అని హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు.
Also Read
- Indoor Plants: ఒక్క గ్లాస్ నీటితో ఇంట్లో గ్రీన్ డెకరేషన్.. ఈ మొక్కలను ఇలా పెంచండి!
- AP Dwakra Women: డ్వాక్రా మహిళలకు గుడ్న్యూస్.. రూ.3 లక్షల రుణం, సబ్సిడీ కూడా!
- Census 2027: జనాభా లెక్కల్లో తొలిసారి కులగణన.. 40 ప్రశ్నలను నోటిఫై చేసిన కేంద్రం
- Termite-Proof Furniture: చెదల బెడదకు చెక్.. చెక్కకు బదులుగా ఈ మెటీరియల్స్ ఎంచుకోండంతే.!
Also Read: AP News: మాయమాటలు చెప్పి.. పదో తరగతి విద్యార్థినిపై యువకుడు అత్యాచారం, చివరకు..!
‘కందుకూరులో లక్ష్మీ నాయుడు హత్య బాధాకరం. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రి నారాయణతో కలిసి తిరుమలశెట్టి లక్ష్మీ నాయుడు కుటుంబాన్ని పరామర్శించాము. స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కూడా ఉన్నారు. కుటుంబ నేపథ్యం అంతా చూశాం. హత్య కేవలం ఆర్ధిక లావాదేవీల కారణంగానే జరిగింది. మంచి స్నేహితులుగా ఉండి వ్యాపారం చేసుకున్నారు. చిన్న ఆర్ధిక లావాదేవీలతో వీరి మధ్య విభేదాలు వచ్చాయి. విభేదాలు హత్యకు దారి తీసింది. కార్ దాడితో ఇంత దారుణంగా హత్య చేసే పరిస్థితి రాకూడదు. నిందితుడికి శిక్ష పడాలని లక్ష్మీ నాయుడు భార్య కోరారు. నిందితుడికి బెయిల్ రాకుండా శిక్ష పడేలా చూస్తాం. హత్య కేసు విచారణ వేగంగా జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించాం’ అని హోంమంత్రి తెలిపారు.
తాజావార్తలు
-
JoJo : ‘జోజో’ ఫస్ట్ లుక్ ‘మనోభావాల బ్యాచ్’కి స్వీట్ వార్నింగ్
-
Indoor Plants: ఒక్క గ్లాస్ నీటితో ఇంట్లో గ్రీన్ డెకరేషన్.. ఈ మొక్కలను ఇలా పెంచండి!
-
AP Dwakra Women: డ్వాక్రా మహిళలకు గుడ్న్యూస్.. రూ.3 లక్షల రుణం, సబ్సిడీ కూడా!
-
LIC Investment: ఎల్ఐసీ మీ పాలసీ డబ్బును ఎక్కడ పెట్టుబడి పెడుతుంది? నష్టాలను ఎలా ఎదుర్కొంటుంది? పూర్తి వివరాలు
-
Census 2027: జనాభా లెక్కల్లో తొలిసారి కులగణన.. 40 ప్రశ్నలను నోటిఫై చేసిన కేంద్రం
ట్రెండింగ్
-
Termite-Proof Furniture: చెదల బెడదకు చెక్.. చెక్కకు బదులుగా ఈ మెటీరియల్స్ ఎంచుకోండంతే.!
-
Hardik Pandya Trade: చెన్నై, కోల్కతా కాదు.. హార్దిక్ ఆ జట్టులోకే వెళ్తాడు.. ఏ తప్పేముంది!
-
IND vs SL 1st Test: తుది జట్టులో చోటు ఉండదు.. స్టార్ బ్యాటర్కు హెడ్ కోచ్ గంభీర్ వార్నింగ్!
-
BSNL బంపర్ ఆఫర్.. 365 రోజులకు బదులుగా 412 రోజుల వ్యాలిడిటీ.! రోజుకు 2GB హై-స్పీడ్ డేటా కూడా..
-
IND vs SL: గిల్, రాహుల్, పంత్ కాదు.. అతడే సబ్ కాంటినెంట్కు కింగ్.. మొదటి టెస్టులో ఆడించాలి!