Girl Traced With Free WiFi: ఇంటినుంచి పారిపోయిన అమ్మాయి.. పట్టించిన ఫ్రీ వైఫై..!
- ఇంటి నుంచి అలిగి వెళ్లిన అమ్మాయిని పట్టించిన ఫ్రీ వైఫై..
- పాలిటెక్నిక్ విద్యార్థిని హారిక మిస్సింగ్ మిస్టరీ సుఖాంతం..
- చదువుపై తల్లి మందలించడంతో అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయిన అమ్మాయి..
- సిమ్ తీసేసి, ఆచూకీ దొరకకుండా జాగ్రత్త..
- కేవలం రైల్వే వైఫైతోనే నెట్టుకొచ్చిన హారిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Girl Traced With Free WiFi: అలిగి ఇంటినుంచి వెళ్లిపోయిన అమ్మాయిని ఫ్రీ వైఫై పట్టించింది.. ఆంధ్రప్రదేశ్ పార్వతీపురం మన్యం జిల్లాలో ఇంటి నుంచి అలిగి వెళ్లిన పాలిటెక్నిక్ విద్యార్థిని హారిక మిస్సింగ్ కేసు సుఖాంతమైంది. చదువుపై తల్లి మందలించడంతో ఆవేశంలో పరీక్ష ఉందని ఇంటి నుంచి బయటకు వెళ్లిన హారిక.. ఆ తర్వాత అదృశ్యమైంది. అయితే, తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఐదు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు పోలీసులు, 12 రోజుల పాటు ఆమె ఆచూకీ కోసం వెతికారు.
Also Read
- Tomato Price Crash: భారీగా పతనమైన టమాటా ధర.. తీవ్ర నిరాశలో రైతన్నలు..
- Family Suicide: ఏం కష్టం వచ్చిందో.. కుటుంబం మొత్తం ఆత్మహత్యాయత్నం.. ముగ్గురు మృతి, ఒకరికి సీరియస్..
- Woman Gave Birth on The Train Track: రైలు పట్టాలపైనే ప్రసవించిన మహిళ..
- Tourist Rush in Araku Valley: అరకు లోయకు పోటెత్తిన పర్యాటకులు.. హోటల్స్ అన్ని హౌస్ఫుల్
తాను ఉన్న లొకేష్ దొరకకూడదని భావించి హారిక తన మొబైల్లో ఉన్న సిమ్ కార్డ్ను తీసేసి, ఎలాంటి కాల్ ట్రేసింగ్ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అయినా ఆమె ప్రయాణం మాత్రం ఆగలేదు. బెంగళూరు, విశాఖపట్నం, రాజమండ్రి నగరాల్లో తిరుగుతూ, కేవలం రైల్వే స్టేషన్లు, పబ్లిక్ ప్రదేశాల్లో లభించే ఫ్రీ వైఫై ఆధారంగా ఇన్టర్నెట్ వాడుతూ ముందుకు సాగింది.. అయితే, ఫ్రీ వైఫై లాగిన్తో కేసు ఛేదించారు పోలీసులు.. సిమ్ లేకపోయినా, పబ్లిక్ వైఫై లాగిన్ డేటాతో ఆమె లొకేషన్ ట్రేస్ చేయగలిగింది పోలీసుల టెక్నికల్ టీమ్. ఒక్కొక లొకేషన్ను వెరిఫై చేయడం ద్వారా హారిక ప్రయాణ మార్గాన్ని అంచనా వేసి.. చివరకు ఆమెను రాజమండ్రి పరిసరాల్లో గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
ఇక, హారిక ఆచూకీ కనుగొన్న తర్వాత, ఆమె ఇంటికి రానంటూ మొండికేసింది.. దీంతో, పోలీసులు కౌన్సిలింగ్ చేసి నచ్చజెప్పి, ఆమెను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. కేసు ఛేదనలో కీలక పాత్ర పోషించిన టెక్నికల్ టీమ్ను ఎస్పీ అభినందించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పిల్లలతో మాట్లాడి, భావోద్వేగాలను అర్థం చేసుకోవాలని పోలీసులు సూచించారు.
తాజావార్తలు
-
Maharashtra: పెళ్లింట తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి..
-
Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
-
Afghan Women: ‘అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే’.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు
-
IPL 2026 Playoff Tickets: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ టిక్కెట్స్ షెడ్యూల్ వచ్చేసింది.. ఇక్కడ బుక్ చేసుకోండిలా..
-
Tamil Nadu: షాకింగ్.. 13 ఏళ్ల బాలుడిని చంపి పాతిపెట్టిన మైనర్ స్నేహితులు
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!