Fact Check: సోషల్ మీడియాలో ఓ నకిలీ భూమి పట్టా సంబంధించిన ఫోటో వైరల్ కావడంతో దానిపై తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోషల్ మీడియా ద్వారా స్పందించింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన భూమి పట్టాలో ఓ భూమికి సంబంధించిన అడంగల్ పత్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే రాష్ట్ర రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంపులు మంత్రి సత్యప్రసాద్ ఫోటోలు ఉన్నాయి. అయితే ఈ ఫోటోని కొందరు కావాలని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో…
Gudivada Amarnath: ఉత్తరాంధ్రపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిది సవతి తల్లి ప్రేమ అని మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా ఆయన ఏం చేస్తారో చెప్పకుండా వైసీపీని నిందించడానికి పరిమితం అయ్యారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఉన్న మార్కెటింగ్ స్కిల్స్ ప్రపంచంలో మరే రాజకీయ నాయకుడికి ఉండవు అంటూ మాజీ మంత్రి ఎద్దేవా చేశారు. భోగాపురం ఎయిర్ పోర్టుకు ఉన్న భూ సమస్యలు సహా అన్ని పరిష్కరించి వైసీపీ ప్రభుత్వం హయాంలో…
CM Chandrababu: వివిధ శాఖలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ (బుధవారం) సమీక్షించనున్నారు. అలాగే, ఆర్థిక శాఖపై కూడా సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.
MLA Gorantla Butchaiah Chowdary on Villages Development: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుదల, స్వచ్ఛమైన త్రాగునీరు సదుపాయాల రూపకల్పనకు ప్రభుత్వ నడుం బిగిస్తుందని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. కూటమి ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు అడుగులు వేస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో నిధులు లేమితో వీధిలైట్లు, పైపులైన్లు కూడా వేయలేని పరిస్థితి ఏర్పడిందని.. ఇక నుంచి ఆ పరిస్థితులు…
CM Chandrababu Meets PM Modi: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా గురువారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీతో ఆయన సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థికసాయం, ఇతర అంశాలపై ప్రధానితో చంద్రబాబు చర్చించారు. దాదాపు అరగంట పాటు సాగిన ఈ సమావేశంలో చంద్రబాబు డిమాండ్లపై ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అంతకుముందు కేంద్రమంత్రి పీయూష్ గోయల్తో సమావేశమైన సీఎం చంద్రబాబు.. వివిధ అంశాలపై మాట్లాడారు. Also Read: Kalki…
AP CM Chandrababu Delhi Tour: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. గురువారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీతో చంద్రబాబు సమావేశం కానున్నారు. కేంద్ర ప్రభుత్వం జులై చివరి వారంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్ర అవసరాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లి.. తగిన సాయం కోరనున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్, రహదారులు భవనాలశాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్రావు, ప్రభుత్వ…
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. సీఎం హోదాలో తొలిసారి హస్తినకు వెళ్తున్నారు. రాష్ట్రానికి కీలక ప్రాజెక్టులు, నిధుల సమీకరణ, పెండింగ్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీఎం ఢిల్లీ టూర్ ఉండనుంది. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. రేపు ఉదయం 10 గంటలకు ప్రధాని మోడీతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు.
AP CM: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు ( బుధవారం) ఢిల్లీ పర్యటన ఖరారైంది. ముఖ్యమంత్రి హోదాలో హస్తిన పర్యటనకు వెళ్తు్న్నారు. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసే ఛాన్స్ ఉంది.
AP CM: రాష్ట్రంలోని పెన్షన్ దారులకు ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చటమే కూటమి ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం.. అందరి మద్దతుతో అండగా నిలుస్తూ.. సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది.. ఏ ఆశలు, ఆకాంక్షలతో ప్రజలు ఓట్లేసి గెలిపించారో వాటిని నెరవేర్చడమే తక్షణ, ప్రథమ కర్తవ్యం.. మేనిఫెస్టోలో చెప్పినట్లు పెన్షన్ను ఒకేసారి రూ. 1000 పెంచాం.
KADAPA: కడప జిల్లా బద్వేల్ ఆర్డీఓ ఆకుల వెంకటరమణ అవినీతి చిట్టా అంటూ కరపత్రాలు కలకలం రేపుతున్నాయి. బద్వేల్ లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు జరిగిన తర్వాత మొదటి ఆర్డీఓగా ఆకుల వెంకటరమణ బాధ్యతలు చేపట్టారు.