Gudivada Amarnath: ఉత్తరాంధ్రపై ఆయనది సవతి తల్లి ప్రేమ..
- ఉత్తరాంధ్రపై ఏపీ సీఎం చంద్రబాబుది సవతి తల్లి ప్రేమ..
- ముఖ్యమంత్రిగా ఏం చేస్తారో చెప్పకుండా వైసీపీని విమర్శిస్తున్నారు..
- వైసీపీ ప్రభుత్వ హయాంలో భోగాపురం ఎయిర్ పోర్టు పనులు ప్రారంభమయ్యాయి: అమర్నాథ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudivada Amarnath: ఉత్తరాంధ్రపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిది సవతి తల్లి ప్రేమ అని మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా ఆయన ఏం చేస్తారో చెప్పకుండా వైసీపీని నిందించడానికి పరిమితం అయ్యారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఉన్న మార్కెటింగ్ స్కిల్స్ ప్రపంచంలో మరే రాజకీయ నాయకుడికి ఉండవు అంటూ మాజీ మంత్రి ఎద్దేవా చేశారు. భోగాపురం ఎయిర్ పోర్టుకు ఉన్న భూ సమస్యలు సహా అన్ని పరిష్కరించి వైసీపీ ప్రభుత్వం హయాంలో పనులు ప్రారంభం అయ్యాయి.. భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులు ప్రారంభించేనాటికి ప్రభుత్వం దగ్గర 377 ఎకరాల భూమి మాత్రమే ఉంది.. పరిహారం, కోర్టు కేసులు ఎదుర్కొని ముందుకు వెళ్లామని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.
Read Also: Raj Tarun Lavanya : రాజ్ తరుణ్ – లావణ్య కేసులో లాయర్ కళ్యాణ్ సంచలన విషయాలు
Also Read
- Rajnath Singh: భారత నౌకాదళం ఆర్థిక ప్రయోజనాలకు రక్షకుడు
- Governor Abdul Nazeer: డిగ్రీలతోనే ఆగిపోవద్దు.. నైపుణ్యాలు, ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలి..
- INS Mahendragiri: విశాఖలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి జాతికి అంకితం.. రాజ్నాథ్ కీలక వ్యాఖ్యలు
- Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
అయితే, వైసీపీ ప్రభుత్వంలో చేసిన పనులకు ఇప్పుడు తెలుగు దేశం పార్టీ పేర్లు పెట్టుకుంటోంది అని గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. BPCL రిఫైనరీ ఏర్పాటుకు మా ప్రభుత్వంలో అనువైన ప్రదేశాలను కోసం బృందాలు పరిశీలించాయి.. అది నిజమో కాదో అధికారులను అడగండి అని సవాల్ చేశారు. ఎన్నికల్లో చేసిన ప్రచారాలకు తర్వాత పెట్టిన కండీషన్లు చూస్తుంటే సూపర్ సిక్స్ ఎంత వరకు అమలు అవుతుందనేది ఆందోళన కలిగిస్తోందన్నారు. జీవో నెంబర్ 29 మీద ప్రజలకు అనుమానాలు ఉన్నాయి.. వాటికి చంద్రబాబు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు.
పిల్లలు ఎంత మంది ఉంటే అంత మందికి 15 వేల రూపాయలు ఇస్తామని ప్రకటించిన టీడీపీ.. ఇప్పుడు తల్లులకు మాత్రమే 15 వేలు అని చెప్పడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి అంటూ ఆయన మండిపడ్డారు. ఇసుక ఫ్రీ అని చెప్పి చార్జీలతో 1394 రూపాయలు టన్నుకు పెట్టీ కండిషన్స్ అప్లై అంటున్నారు.. మీ భాగస్వామ్యంతో ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు రాష్ట్ర అభివృద్ధికి ఎందుకు సహకరించదు.. మీడియా ఆఫీసులపైనే దాడులు జరుగుతుంటే రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందకుండా ఏ విధంగా ఉండగలుగుతారు అంటూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!