Gudivada Amarnath: ఉత్తరాంధ్రపై ఆయనది సవతి తల్లి ప్రేమ..
- ఉత్తరాంధ్రపై ఏపీ సీఎం చంద్రబాబుది సవతి తల్లి ప్రేమ..
- ముఖ్యమంత్రిగా ఏం చేస్తారో చెప్పకుండా వైసీపీని విమర్శిస్తున్నారు..
- వైసీపీ ప్రభుత్వ హయాంలో భోగాపురం ఎయిర్ పోర్టు పనులు ప్రారంభమయ్యాయి: అమర్నాథ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudivada Amarnath: ఉత్తరాంధ్రపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిది సవతి తల్లి ప్రేమ అని మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా ఆయన ఏం చేస్తారో చెప్పకుండా వైసీపీని నిందించడానికి పరిమితం అయ్యారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఉన్న మార్కెటింగ్ స్కిల్స్ ప్రపంచంలో మరే రాజకీయ నాయకుడికి ఉండవు అంటూ మాజీ మంత్రి ఎద్దేవా చేశారు. భోగాపురం ఎయిర్ పోర్టుకు ఉన్న భూ సమస్యలు సహా అన్ని పరిష్కరించి వైసీపీ ప్రభుత్వం హయాంలో పనులు ప్రారంభం అయ్యాయి.. భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులు ప్రారంభించేనాటికి ప్రభుత్వం దగ్గర 377 ఎకరాల భూమి మాత్రమే ఉంది.. పరిహారం, కోర్టు కేసులు ఎదుర్కొని ముందుకు వెళ్లామని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.
Read Also: Raj Tarun Lavanya : రాజ్ తరుణ్ – లావణ్య కేసులో లాయర్ కళ్యాణ్ సంచలన విషయాలు
Also Read
- President Droupadi Murmu Vizag Visit: విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు..
- Gudivada Amarnath: మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు మాజీ మంత్రి.. 'నా వ్యాఖ్యల్లో తప్పు లేదు'..!
- Cyber Crime Recovery Mela: సైబర్ క్రైమ్ రికవరీ మేళా.. 310 మంది బాధితులకు రూ.6 కోట్ల రికవరీ చెక్కులు..
- President Murmu AP Visit: విశాఖ పర్యటనకు రాష్ట్రపతి.. గిరిజన వర్సిటీ స్నాతకోత్సవానికి ముర్ము..
అయితే, వైసీపీ ప్రభుత్వంలో చేసిన పనులకు ఇప్పుడు తెలుగు దేశం పార్టీ పేర్లు పెట్టుకుంటోంది అని గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. BPCL రిఫైనరీ ఏర్పాటుకు మా ప్రభుత్వంలో అనువైన ప్రదేశాలను కోసం బృందాలు పరిశీలించాయి.. అది నిజమో కాదో అధికారులను అడగండి అని సవాల్ చేశారు. ఎన్నికల్లో చేసిన ప్రచారాలకు తర్వాత పెట్టిన కండీషన్లు చూస్తుంటే సూపర్ సిక్స్ ఎంత వరకు అమలు అవుతుందనేది ఆందోళన కలిగిస్తోందన్నారు. జీవో నెంబర్ 29 మీద ప్రజలకు అనుమానాలు ఉన్నాయి.. వాటికి చంద్రబాబు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు.
పిల్లలు ఎంత మంది ఉంటే అంత మందికి 15 వేల రూపాయలు ఇస్తామని ప్రకటించిన టీడీపీ.. ఇప్పుడు తల్లులకు మాత్రమే 15 వేలు అని చెప్పడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి అంటూ ఆయన మండిపడ్డారు. ఇసుక ఫ్రీ అని చెప్పి చార్జీలతో 1394 రూపాయలు టన్నుకు పెట్టీ కండిషన్స్ అప్లై అంటున్నారు.. మీ భాగస్వామ్యంతో ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు రాష్ట్ర అభివృద్ధికి ఎందుకు సహకరించదు.. మీడియా ఆఫీసులపైనే దాడులు జరుగుతుంటే రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందకుండా ఏ విధంగా ఉండగలుగుతారు అంటూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Ishan Kishan-Abhishek Sharma: అభిషేక్ శర్మ తప్పు లేదు.. ఇషాన్ కిషన్ చూసుకోవాలి కదా!
-
Ayodhya Ram Mandir: అయోధ్య రామ్ మందిర్ కొలువుల్లో ‘కమిషన్ల’ భాగోతం.. ట్రస్ట్ కీలక సభ్యుల రాజీనామా వెనుక అసలు రహస్యం ఇదేనా?
-
Schools and Colleges Closed: ఎడతెరిపి లేని వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు
-
Gold & Silver Prices Today: కనకం ఇలా షాకిచ్చిందేంటి.. వామ్మో సిల్వర్ కూడా..
-
Hardik Pandya-CSK: సీఎస్కేలోకి హార్దిక్ పాండ్యా.. క్లారిటీ ఇచ్చిన చెన్నై సీఈఓ!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?