Gudivada Amarnath: ఉత్తరాంధ్రపై ఆయనది సవతి తల్లి ప్రేమ..
- ఉత్తరాంధ్రపై ఏపీ సీఎం చంద్రబాబుది సవతి తల్లి ప్రేమ..
- ముఖ్యమంత్రిగా ఏం చేస్తారో చెప్పకుండా వైసీపీని విమర్శిస్తున్నారు..
- వైసీపీ ప్రభుత్వ హయాంలో భోగాపురం ఎయిర్ పోర్టు పనులు ప్రారంభమయ్యాయి: అమర్నాథ్
Gudivada Amarnath: ఉత్తరాంధ్రపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిది సవతి తల్లి ప్రేమ అని మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా ఆయన ఏం చేస్తారో చెప్పకుండా వైసీపీని నిందించడానికి పరిమితం అయ్యారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఉన్న మార్కెటింగ్ స్కిల్స్ ప్రపంచంలో మరే రాజకీయ నాయకుడికి ఉండవు అంటూ మాజీ మంత్రి ఎద్దేవా చేశారు. భోగాపురం ఎయిర్ పోర్టుకు ఉన్న భూ సమస్యలు సహా అన్ని పరిష్కరించి వైసీపీ ప్రభుత్వం హయాంలో పనులు ప్రారంభం అయ్యాయి.. భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులు ప్రారంభించేనాటికి ప్రభుత్వం దగ్గర 377 ఎకరాల భూమి మాత్రమే ఉంది.. పరిహారం, కోర్టు కేసులు ఎదుర్కొని ముందుకు వెళ్లామని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.
Read Also: Raj Tarun Lavanya : రాజ్ తరుణ్ – లావణ్య కేసులో లాయర్ కళ్యాణ్ సంచలన విషయాలు
Also Read
- Weather Updates in Regional Languages: రైతులకు గుడ్న్యూస్.. ఇక ప్రాంతీయ భాషల్లోనే వాతావరణ సమాచారం..
- Vizag Stock Market Scam: ఫ్యామిలీ మొత్తం కంత్రీ..! స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో రూ.6.5 కోట్లు నొక్కేశారు..
- CM Chandrababu: ఏపీ చరిత్రలో ఇది మరిచిపోలేని రోజు.. గూగుల్ రాక గేమ్ ఛేంజర్..
- Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐ పట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
అయితే, వైసీపీ ప్రభుత్వంలో చేసిన పనులకు ఇప్పుడు తెలుగు దేశం పార్టీ పేర్లు పెట్టుకుంటోంది అని గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. BPCL రిఫైనరీ ఏర్పాటుకు మా ప్రభుత్వంలో అనువైన ప్రదేశాలను కోసం బృందాలు పరిశీలించాయి.. అది నిజమో కాదో అధికారులను అడగండి అని సవాల్ చేశారు. ఎన్నికల్లో చేసిన ప్రచారాలకు తర్వాత పెట్టిన కండీషన్లు చూస్తుంటే సూపర్ సిక్స్ ఎంత వరకు అమలు అవుతుందనేది ఆందోళన కలిగిస్తోందన్నారు. జీవో నెంబర్ 29 మీద ప్రజలకు అనుమానాలు ఉన్నాయి.. వాటికి చంద్రబాబు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు.
పిల్లలు ఎంత మంది ఉంటే అంత మందికి 15 వేల రూపాయలు ఇస్తామని ప్రకటించిన టీడీపీ.. ఇప్పుడు తల్లులకు మాత్రమే 15 వేలు అని చెప్పడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి అంటూ ఆయన మండిపడ్డారు. ఇసుక ఫ్రీ అని చెప్పి చార్జీలతో 1394 రూపాయలు టన్నుకు పెట్టీ కండిషన్స్ అప్లై అంటున్నారు.. మీ భాగస్వామ్యంతో ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు రాష్ట్ర అభివృద్ధికి ఎందుకు సహకరించదు.. మీడియా ఆఫీసులపైనే దాడులు జరుగుతుంటే రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందకుండా ఏ విధంగా ఉండగలుగుతారు అంటూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Iran: ఉరిశిక్షలతో హడలెత్తిస్తున్న ఇరాన్..
-
Explore to Expand: తెలంగాణ టూ గ్లోబల్.. ‘ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్’ వేదికను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు
-
Lavanya : మా రామ్ చరణ్ బావకి థాంక్స్!
-
Revanth Reddy: ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి ‘బంపర్ గిఫ్ట్’.. 100 రోజుల్లో రూ. 6 వేల కోట్లు క్లియర్!
-
Getup Srinu: మేం కాపులం వివాదం.. అంతా ప్రమోషనా?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!