AP CM: రేపు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు
- రేపు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు..
- ప్రధాని మోడీతో పాటు కేంద్రమంత్రులతో వరుస సమావేశాలు..
- కేంద్ర బడ్జెట్ లో ఏపీకి నిధుల కేటాయింపుపై చర్చించే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP CM: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు ( బుధవారం) ఢిల్లీ పర్యటన ఖరారైంది. ముఖ్యమంత్రి హోదాలో హస్తిన పర్యటనకు వెళ్తు్న్నారు. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసే ఛాన్స్ ఉంది. ఇక, వారితో భేటీలో రాష్ట్ర అభివృద్ధిపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అలాగే, మరికొందరు కేంద్ర మంత్రులతో కూడా ఏపీ సీఎం భేటీ అయ్యే అవకాశం ఉంది. అందుబాటులో ఉన్న కేంద్రమంత్రులతో సమావేశమై రాష్ట్రానికి అవసరమైన నిధుల విషయంలో వారితో చర్చిస్తారని సమాచారం.
Read Also: West Bengal: జంటపై దాడి ఘటనలో ట్విస్.. బాధితురాలి ఏం చేసిందంటే..!
Also Read
- CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- APL: విద్యార్థులకు శుభవార్త.. ఏపీఎల్ మ్యాచ్లకు ఉచిత ప్రవేశం..
ఇక, రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో కూరుకు పోవడంతో.. దీనిని గాడిన పడేయాలంటే కేంద్ర సర్కార్ నుంచి సహకారం అవసరం అని భావించిన సీఎం చంద్రబాబు.. అనేక విషయాల్లో మోడీ సర్కార్ నుంచి నిధులను తెచ్చుకోవడమే కాకుండా రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులపై కూడా ప్రధానంగా చర్చించనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ సాయాన్ని కోరేందుకే చంద్రబాబు ఈ టూర్ పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఐదేళ్లలో రెండు ప్రాజెక్టులు పూర్తి అయ్యేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందిస్తున్నాం.. దానికి కావాల్సిన నిధుల కోసమే కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు సమాచారం.
Read Also: Rahul Gandhi: ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ లేఖ.. విషయం ఏంటంటే..
అయితే, త్వరలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ విషయంలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల సానుకూలంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరే అవకాశం ఉంది. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి పెద్దపీట వేస్తూ నిర్ణయాలు తీసుకోవాలని కోరే ఛాన్స్ ఉంది. దీనివల్ల ఏన్డీయే కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో సానుకూలత వస్తుందని, డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రభావం పని చేసిందని ప్రజలు భావించే ఛాన్స్ ఉందనే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి చంద్రబాబు చెప్పే అవకాశం ఉంది. కేంద్రం ఈసారి బడ్జెట్ లో పోలవరం, అమరావతిలకి సంబంధించి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తే ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తారని కూడా సూచించనున్నారు.
తాజావార్తలు
-
IND Vs AFG: చరిత్ర స్పష్టించిన భారత్.. కొత్త రికార్డు నమోదు..
-
Lakshadweep: లక్షద్వీప్లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్.. 47 ఏళ్ల నిషేధానికి తెర.. కారణం ఇదే..
-
Iran Vs Israel: యుద్ధం మళ్లీ మొదలు..! ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల వెనుక ఉన్న కారణాలేంటి?
-
Gym Tips : వర్కౌట్ మధ్యలో కోల్డ్ వాటర్.. మంచిదా? ప్రమాదమా.?
-
Putin: పుతిన్ భద్రతపై రష్యా సంచలన నిర్ణయం.. నిఘా వ్యవస్థలపై తాత్కాలికంగా..!
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!